Bhatti Vikramarka : కాంగ్రెస్ పాలనలోనే మహిళల అభ్యున్నతి
- మహిళల సంక్షేమాన్ని విస్మరించిందంటూ బీఆర్ఎస్పై భట్టి విమర్శలు
- రాష్ట్రంలో 8 వేల మహిళా సంఘాల భవనాలకు శంకుస్థాపనలు
- మహిళా సంఘాలకు రూ.66 వేల కోట్ల రుణాలు ఇచ్చామన్న డిప్యూటీ సీఎం
- విద్యుత్, సోలార్ పవర్పై ప్రభుత్వ ప్రణాళికలు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఖమ్మంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ మహిళల ఆర్థిక, సామాజిక అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మహిళా వారోత్సవాలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనంగా ఇప్పటికే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 8 వేల మహిళా సమాఖ్య (సంఘాల) భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు కూడా పూర్తి చేశామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం చేసే ప్రతి మంచి కార్యక్రమంపై బీఆర్ఎస్ నేతలు కావాలనే విషం కక్కుతున్నారని, వారి దుష్ప్రచారాలు, ప్రకటనలు చూస్తుంటే తీవ్ర అసహనం, అసహ్యం వేస్తోందని మండిపడ్డారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మహిళా సంఘాలు తమ సమస్యలపై ఎన్ని విజ్ఞప్తులు చేసినా అప్పటి ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని భట్టి విక్రమార్క విమర్శించారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన వడ్డీ లేని రుణాల పథకాన్ని బీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా అటకెక్కించిందని, అలాగే మహిళలకు భరోసానిచ్చే ‘అభయహస్తం’ ప్రాజెక్టును కూడా పక్కన పడేసిందని ఆరోపించారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది కాలంలోనే ఏకంగా 66 వేల కోట్ల రూపాయలను బ్యాంకుLinkల ద్వారా మహిళా సంఘాలకు రుణాలుగా ఇప్పించిన ఘన చరిత్ర తమ ప్రభుత్వానిదేనని ఆయన గర్వంగా ప్రకటించారు. మహిళల క్షేమం కోరేది ఏ ప్రభుత్వమో ప్రజలందరికీ బాగా తెలుసని, ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని చూస్తున్న విపక్షాల కుట్రలను ప్రజలు, పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
Also Read
- KCR : అసెంబ్లీలో కేసీఆర్ బిగ్ ప్లాన్.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు.!
- Vikarabad Land Fraud : 2 ఎకరాలు రాసిస్తే.. మొత్తం భూమినే కొట్టేశాడు.. అల్లుడి మాస్టర్ ప్లాన్
- Rain Alert: మళ్లీ వర్షాల జోరు.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులతో భారీ వర్షాలు!
- Ramnagar Stampede: రాంనగర్ గణేష్ ఆగమన్ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో యువకుడు మృతి
రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై వస్తున్న విమర్శలను కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గట్టిగా తిప్పికొట్టారు. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో మునుపెన్నడూ లేనంతగా విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగినప్పటికీ, ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఒక్క క్షణం కూడా కరెంట్ పోకుండా, ఎక్కడా ట్రిప్ కాకుండా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ను అందించగలిగామని స్పష్టం చేశారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైతులకు పగటిపూటే ఉచితంగా సోలార్ పవర్ (సౌర విద్యుత్) అందించేలా ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య రహిత సమాజ స్థాపనకు సోలార్ పవర్ వినియోగాన్ని పెంచడం ఎంతో అవసరమని, ఆ దిశగానే కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరమైన అడుగులు వేస్తోందని భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
New World Map: ‘తప్పుగా చూపితే అంగీకరించం’.. కొత్త ‘‘వరల్డ్ మ్యాప్’’పై భారత్ ఘాటు స్పష్టీకరణ
-
KCR : అసెంబ్లీలో కేసీఆర్ బిగ్ ప్లాన్.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు.!
-
TFPC: హోరాహోరీగా ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు.. గెలిచింది ఎవరెవరు అంటే ?
-
Fire Accident: ఆటోనగర్లోని హ్యుందాయ్ కార్ల షోరూమ్లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..
-
Vikarabad Land Fraud : 2 ఎకరాలు రాసిస్తే.. మొత్తం భూమినే కొట్టేశాడు.. అల్లుడి మాస్టర్ ప్లాన్
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!