Bhatti Vikramarka : కాంగ్రెస్ పాలనలోనే మహిళల అభ్యున్నతి
- మహిళల సంక్షేమాన్ని విస్మరించిందంటూ బీఆర్ఎస్పై భట్టి విమర్శలు
- రాష్ట్రంలో 8 వేల మహిళా సంఘాల భవనాలకు శంకుస్థాపనలు
- మహిళా సంఘాలకు రూ.66 వేల కోట్ల రుణాలు ఇచ్చామన్న డిప్యూటీ సీఎం
- విద్యుత్, సోలార్ పవర్పై ప్రభుత్వ ప్రణాళికలు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఖమ్మంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ మహిళల ఆర్థిక, సామాజిక అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మహిళా వారోత్సవాలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనంగా ఇప్పటికే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 8 వేల మహిళా సమాఖ్య (సంఘాల) భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు కూడా పూర్తి చేశామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం చేసే ప్రతి మంచి కార్యక్రమంపై బీఆర్ఎస్ నేతలు కావాలనే విషం కక్కుతున్నారని, వారి దుష్ప్రచారాలు, ప్రకటనలు చూస్తుంటే తీవ్ర అసహనం, అసహ్యం వేస్తోందని మండిపడ్డారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మహిళా సంఘాలు తమ సమస్యలపై ఎన్ని విజ్ఞప్తులు చేసినా అప్పటి ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని భట్టి విక్రమార్క విమర్శించారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన వడ్డీ లేని రుణాల పథకాన్ని బీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా అటకెక్కించిందని, అలాగే మహిళలకు భరోసానిచ్చే ‘అభయహస్తం’ ప్రాజెక్టును కూడా పక్కన పడేసిందని ఆరోపించారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది కాలంలోనే ఏకంగా 66 వేల కోట్ల రూపాయలను బ్యాంకుLinkల ద్వారా మహిళా సంఘాలకు రుణాలుగా ఇప్పించిన ఘన చరిత్ర తమ ప్రభుత్వానిదేనని ఆయన గర్వంగా ప్రకటించారు. మహిళల క్షేమం కోరేది ఏ ప్రభుత్వమో ప్రజలందరికీ బాగా తెలుసని, ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని చూస్తున్న విపక్షాల కుట్రలను ప్రజలు, పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
Also Read
- Fire Accident: నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్ని ప్రమాదం
- Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
- Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
- Negligence : జహీరాబాద్ ఆస్పత్రిలో విషాదం.. వైద్యులు లేక శిశువు మృతి
రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై వస్తున్న విమర్శలను కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గట్టిగా తిప్పికొట్టారు. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో మునుపెన్నడూ లేనంతగా విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగినప్పటికీ, ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఒక్క క్షణం కూడా కరెంట్ పోకుండా, ఎక్కడా ట్రిప్ కాకుండా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ను అందించగలిగామని స్పష్టం చేశారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైతులకు పగటిపూటే ఉచితంగా సోలార్ పవర్ (సౌర విద్యుత్) అందించేలా ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య రహిత సమాజ స్థాపనకు సోలార్ పవర్ వినియోగాన్ని పెంచడం ఎంతో అవసరమని, ఆ దిశగానే కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరమైన అడుగులు వేస్తోందని భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
Samson vs Vaibhav: మూడు మ్యాచ్లకేనా.. జోక్ చేస్తున్నారా?.. వైభవ్ అరంగేట్రంపై మండిపడ్డ మాజీ క్రికెటర్!
-
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
-
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య కేసులో షాకింగ్ విషయాలు.. దొంగిలించిన డబ్బుతో కార్లు, ఖరీదైన ఫోన్లు, గిఫ్ట్లు..!
-
Novak Djokovic: రోజర్ ఫెడరర్ రికార్డుకు చెక్ మెట్.. వింబుల్డన్లో చరిత్ర సృష్టించిన జొకోవిచ్.!
-
Fertilizers: రైతులకు ఊరట! యూరియా, డీఏపీతో నిండిన 15 నౌకలు వచ్చేస్తున్నయ్.. ఎరువుల సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!
-
185Hz డిస్ప్లే, 9,000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 7 Series స్మార్ట్ ఫోన్స్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!