Mallu Bhatti Vikramarka: లిక్కర్ స్కాం పై భట్టి విక్రమార్క హాట్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallu Bhatti Vikramarka: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర 17 రోజు కు చేరుకుంది. ఉదయం 8గంటలకు బెల్లంపల్లి నియోజకవర్గం మెట్పల్లి గ్రామం నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభమైంది. మెట్పల్లి గ్రామం నుంచి చిత్తాపూర్, ఆవడం, గంగారం మీదుగా కాజిపల్లి నర్సింగాపూర్ గ్రామానికి పీపుల్స్ మార్చ్ చేరుకోనుంది. నెన్నెల మండలం ఆవడం గ్రామంలో లంచ్ బ్రేక్ వుంటుంది. నెన్నెల మండలం ఆవడం గ్రామంలో మధ్యాహ్నం 1గంటకు భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం కాజిపల్లి నర్సింగపూర్ గ్రామంలో రాత్రికి బస చేయనున్నారు.
Read also: Astrology : ఏప్రిల్ 1, శనివారం దినఫలాలు
Also Read
- CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
- Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
- Pocharam Srinivas Reddy: "అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా".. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
- Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. "డ్రైవర్నే చంపుకోండి" అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
కాగా.. నిన్న మంచిర్యాలలో పీపుల్స్ మార్చ్ సందర్భంగా భట్టి విక్రమార్క వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. లిక్కర్ స్కాం పై భట్టి విక్రమార్క హాట్ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఢిల్లీ తరహాలో తెలంగాణ లో లిక్కర్ స్కాం జరుగుతుందని మండిపడ్డారు. లోతుగా విచారణ చేపట్టితే బయట పడుతుందని అన్నారు. తెలంగాణలో తొమ్మిదేళ్లుగా లిక్కర్ సప్లై చేసిన కంపెనీలు ఏవీ? అంటూ ప్రశ్నించారు. ధరలను ఎవరు ఫిక్స్ చేశారు? ఏ కంపెనీలు సప్లై చేశాయి? దానికి డీలర్లు ఎవ్వరూ? అంటూ ప్రశ్నిల వర్షం కురిపించారు. డీలర్లకు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకున్న సంబందం ఏమిటి? అని ప్రశ్నించారు భట్టి. లోతుగా విచారణ చేపట్టాలని కోరారు. పేపర్ లీకేజీ పై సిట్ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని తెలిపారు. వెంటనే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పేపర్ల లీకేజీ వ్యవహారంను ప్రభుత్వం పక్కదారి పట్టించే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపణలు గుప్పించారు. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు అంటూ నిప్పులు చెరిగారు. ఇక్కడ వదిలేసి మహారాష్ట్ర కర్ణాటక తిరుగుతున్నారు అంటూ ఎద్దేవ చేశారు. సీఎం ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకున్నారు? బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు? అంటూ ప్రశ్నించారు. ఒక ఆయన నష్టపరిహారం, ఇంకో ఆయన పరువు నష్టమంటాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ ను అడ్డం పెట్టుకొని ఆసలు వాల్లు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
Astrology : ఏప్రిల్ 1, శనివారం దినఫలాలు
తాజావార్తలు
-
India-Nepal Border Dispute: భారత్తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
-
Kangana Ranaut: హరియాలీ తీజ్ వేడుకల్లో కంగనా రనౌత్తో కలిసి డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి
-
Prashanth Neel: ‘డ్రాగన్’ షూటింగ్కు బ్రేక్.. ప్రభాస్తో ‘సలార్-2’ మొదలుపెట్టనున్న ప్రశాంత్ నీల్?
-
CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
-
YS Jagan: గాంధీ పుట్టిన దేశంలో ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!