Bhatti Vikramarka: తెలంగాణలో పరిపాలన గాడితప్పింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో చేపడుతున్న పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. 32 రోజుల పాటు, 506 కిలోమీటర్ల దూరం పాద యాత్ర చేస్తున్నారు. పీపుల్స్ మార్చ్ పేరిట ఈ పాద యాత్ర ప్రారంభం అయ్యింది.మొదటి రోజు పాదయాత్ర ను ముదిగొండ మండలం యడవెల్లి గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజలు చేసి శ్రీకారం చుట్టారు. కుటుంబ సమేతంగా దేవాలయంలో పూజలు చేసి అనంతరం యాత్రను చేపట్టారు. యడవెల్లి, మాధాపురం, కట్టకూర్, మేడేపల్లి, యడవెల్లి లక్ష్మీ పురంల మీదుగా ముదిగొండకు చేరుకుంది. పాద యాత్ర సందర్బంగా గ్రామ గ్రామాన మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు.
అన్ని గ్రామాల్లో భట్టి పాద యాత్రకు జననీరాజనం పడుతున్నారు. ఈ సందర్భంగా భట్గి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ విత్తనాలు యథేచ్ఛగా రాజ్యమేలుతున్నాయి.. నకిలీ విధానాలను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందన్నారు. నకిలీ విత్తనాలకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ప్రభుత్వ పాలసీలు దుర్మార్గంగా అన్యాయంగా ఉన్నాయి. పంటలు నష్టపోయిన రైతులకు పూర్తి నష్ట పరిహారం ఇవ్వాలి. అడ్డగోలు జీవోలు తీసుకుని వస్తున్నారు. రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఓల్డ్ పెన్షన్ సిస్టం తీసుకుని వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఖమ్మం జిల్లా ప్రాజెక్ట్ లకు 1500 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యేవి. కానీ రీడిజైన్ పేరుతో 25 వేల కోట్లకు పెంచారని విమర్శించారు. ప్రాజెక్ట్ డీపీఆర్ లను బయట పెట్టాలి. కేసీఆర్ చిట్టా వుందని పదే పదే బీజేపీ నేత బండి సంజయ్ అనడమే కానీ ఎందుకు బయట పెట్టడం లేదని విక్రమార్క ప్రశ్నించారు.
Also Read
ఎవరిని బ్లాక్ మెయిల్ చేయడానికి బెదిరింపులకు పాల్పడుతున్నారు. చిట్టా ఉంటే, ఎందుకు బయట పెట్టడం లేదు. మీరు బయట పెట్టకుండా అపుతున్నది ఎవరని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం లోని అన్ని మండలాల్లో పర్యటిస్తానని, ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడతానన్నారు. రాష్ట్రంలో 15 లక్షల కోట్ల అప్పు మిగిలింది.ఇంత డబ్బు సంపద సృష్టిస్తే సంపద ఎటు పోయింది. రాష్టంలో పరిపాలన గాడి తప్పిందన్నారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!