Bhatti Vikramarka: తెలంగాణలో పరిపాలన గాడితప్పింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో చేపడుతున్న పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. 32 రోజుల పాటు, 506 కిలోమీటర్ల దూరం పాద యాత్ర చేస్తున్నారు. పీపుల్స్ మార్చ్ పేరిట ఈ పాద యాత్ర ప్రారంభం అయ్యింది.మొదటి రోజు పాదయాత్ర ను ముదిగొండ మండలం యడవెల్లి గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజలు చేసి శ్రీకారం చుట్టారు. కుటుంబ సమేతంగా దేవాలయంలో పూజలు చేసి అనంతరం యాత్రను చేపట్టారు. యడవెల్లి, మాధాపురం, కట్టకూర్, మేడేపల్లి, యడవెల్లి లక్ష్మీ పురంల మీదుగా ముదిగొండకు చేరుకుంది. పాద యాత్ర సందర్బంగా గ్రామ గ్రామాన మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు.
అన్ని గ్రామాల్లో భట్టి పాద యాత్రకు జననీరాజనం పడుతున్నారు. ఈ సందర్భంగా భట్గి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ విత్తనాలు యథేచ్ఛగా రాజ్యమేలుతున్నాయి.. నకిలీ విధానాలను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందన్నారు. నకిలీ విత్తనాలకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ప్రభుత్వ పాలసీలు దుర్మార్గంగా అన్యాయంగా ఉన్నాయి. పంటలు నష్టపోయిన రైతులకు పూర్తి నష్ట పరిహారం ఇవ్వాలి. అడ్డగోలు జీవోలు తీసుకుని వస్తున్నారు. రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఓల్డ్ పెన్షన్ సిస్టం తీసుకుని వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఖమ్మం జిల్లా ప్రాజెక్ట్ లకు 1500 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యేవి. కానీ రీడిజైన్ పేరుతో 25 వేల కోట్లకు పెంచారని విమర్శించారు. ప్రాజెక్ట్ డీపీఆర్ లను బయట పెట్టాలి. కేసీఆర్ చిట్టా వుందని పదే పదే బీజేపీ నేత బండి సంజయ్ అనడమే కానీ ఎందుకు బయట పెట్టడం లేదని విక్రమార్క ప్రశ్నించారు.
Also Read
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
ఎవరిని బ్లాక్ మెయిల్ చేయడానికి బెదిరింపులకు పాల్పడుతున్నారు. చిట్టా ఉంటే, ఎందుకు బయట పెట్టడం లేదు. మీరు బయట పెట్టకుండా అపుతున్నది ఎవరని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం లోని అన్ని మండలాల్లో పర్యటిస్తానని, ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడతానన్నారు. రాష్ట్రంలో 15 లక్షల కోట్ల అప్పు మిగిలింది.ఇంత డబ్బు సంపద సృష్టిస్తే సంపద ఎటు పోయింది. రాష్టంలో పరిపాలన గాడి తప్పిందన్నారు.
తాజావార్తలు
-
Nithya Menen : నిర్మాణ రంగంపై నిత్యామీనన్ ఫోకస్
-
Raaz Actress: అప్పుడు దెయ్యంగా భయపెట్టిన నటి.. ఇప్పుడు ఫామ్స్టే నడుపుతూ ప్రశాంత జీవితం..
-
India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్లో కీలక టెస్ట్..
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
ట్రెండింగ్
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!