Bhatti Vikramarka: తెలంగాణ మీద బీజేపీ దండయాత్ర చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో మూడు రోజులపాటు సమావేశాలు నిర్వహించుకున్న బీజేపీ.. విభజన చట్టంలోని హామీల్ని నెరవేరుస్తుందని భావిస్తే, దానికి బదులుగా తెలంగాణపై దండయాత్ర చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చేటప్పుడు, ఇచ్చిన తర్వాత కూడా ప్రధాని మోదీ రాష్ట్రాన్ని అవమాన పరిచారన్నారు. అసలు బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని ఓట్లు వేయాలని ఆయన ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య దోస్తీ ఉందన్న విషయం.. ఈ సమావేశాలతో తేలిందన్నారు. ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రభుత్వం మోసం చేస్తోందని ఆగ్రహించారు.
బీజేపీతో యుద్ధమని చెప్పిన కేసీఆర్.. ఇక్కడ బీజేపీ సమావేశాలు నిర్వహించినప్పుడు మూడు రోజులపాటు ఏం చేశావని సీఎంని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. తెలంగాణలో దండయాత్ర చేస్తుంటే, దగ్గరుండి మరీ పోలీసుల రక్షణ కల్పించారని, ఎందుకు మోదీని ప్రశ్నించలేదని కేసీఆర్ని అడిగారు. ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారని కేసీఆర్ అనుకుంటున్నారని, కానీ ఆయన మాటలకు కాలం చెల్లిందని అన్నారు. బలహీన వర్గాలు, గిరిజనుల హక్కుల కోసం భారీ సభలు పెడతామని.. ఆ వర్గాలకు అండగా ఉంటామని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ పాలనని చూశామని.. వచ్చే రోజుల్లో కాంగ్రెస్ని అధికారంలోకి తెద్దామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!