TPCC Mahesh Goud : రేవంత్ రెడ్డి నిర్ణయంతో మోడీనే పరేషాన్లో ఉన్నాడు
- రేవంత్ రెడ్డి మొనగాడు.. దమ్ముంటేనే ఇలాంటి నిర్ణయం తీసుకోగలడు
- రాహుల్ గాంధీ కలను ముందుకు తీసుకెళ్తున్న రేవంత్
- బీసీ బిల్లులపై కేంద్రంపై మండిపాటు
- బీజేపీపై విమర్శలు.. రిజర్వేషన్లు సాధించే వరకు వెనక్కి తగ్గం : టీపీసీసీ చీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Mahesh Goud : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన బీసీ మహా ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ధైర్యవంతమైన నిర్ణయం వల్ల కేవలం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రమే కాకుండా, ప్రధానమంత్రి మోడీనే పరేషాన్లో ఉన్నాడని ఆయన అన్నారు.
మహేష్ గౌడ్ మాట్లాడుతూ, “సహాసోపేత నిర్ణయం తీసుకోవాలంటే దమ్ము ధైర్యం ఉండాలి. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. సపోర్ట్ చేయలేక, తిరస్కరించలేక మోడీ ముస్లింల అంశాన్ని ముందుకు తెస్తున్నాడు” అని వ్యాఖ్యానించారు.
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
“రాహుల్ గాంధీ ఆశయానికి బీసీలు రుణపడి ఉండాలి. ఆయన కలను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సైనికుడిగా ముందుకు తీసుకెళ్తున్నాడు. దేశంలోని ఓబీసీలంతా ఇప్పుడు రేవంత్ వైపు చూస్తున్నారు. రాహుల్ ఎప్పుడైనా మాట్లాడినా తెలంగాణ అంశాన్ని ప్రస్తావిస్తారు,” అని చెప్పారు.
Suicide: భార్య, అత్తమామల వేధింపులతో అల్లుడి ఆత్మహత్య..! హృదయవిదారక వీడియో..
బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు బిల్లులు నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్నాయని గుర్తుచేశారు. “మన బాధ మోడీకి తెలియజేయడానికే ఈ ధర్నా చేస్తున్నాం. కేంద్రం బిల్లులను తొక్కిపెట్టింది. ఆర్డినెన్స్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలంటే గవర్నర్ అడ్డుపడుతున్నారు,” అని ఆరోపించారు.
“కిషన్ రెడ్డి జీవితంలో ఏ పని చేసి గెలిచాడా? మేము పూజలు చేస్తాం కానీ దేవుళ్ల పేరు మీద ఓట్లు అడగం. చేతకాని దద్దమ్మలు దేవుళ్లను ముందు పెట్టి ఓట్లు అడుగుతున్నారు. సికింద్రాబాద్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు లేకుండా కిషన్ రెడ్డి నామినేషన్ వేయగలడా? అసెంబ్లీలో బీసీ బిల్లుకు ఓటు వేసిన బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎందుకు తోకముడుస్తున్నారు?” అని ప్రశ్నించారు.
“బీసీలకు మద్దతుగా అన్ని వర్గాలు జంతర్ మంతర్కి తరలివచ్చాయి. ఓబీసీ రిజర్వేషన్లలో రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి కూడా చరిత్రలో నిలుస్తారు. మేము బీసీల విషయంలో చిత్తశుద్ధితో ఉన్నాం. రిజర్వేషన్లు సాధించే వరకు ఎంత దూరమైనా వెళ్తాం. కాంగ్రెస్ అందరి పార్టీ. కేంద్రం దిగివచ్చి రిజర్వేషన్ల క్యాప్ తొలగించాల్సిందే,” అని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు.
Ghaati Trailer: సీతమ్మోరు లంకా దహనం చేస్తే? అనుష్కకి మరో అరుంధతి దొరికిందిగా!
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit: ‘ప్రేమలు’ డైరెక్టర్ నుంచి మరో రొమాంటిక్ మ్యాజిక్.. రిలీజ్ డేట్ అనౌన్స్
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
-
FIFA World Cup 2026: హోరాహోరీ పోరులో.. ఫ్రాన్స్పై 6-4తో ఇంగ్లండ్ ఘన విజయం.. కాంస్య పతకం కైవసం
-
Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం… ‘రామాయణం’ వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
-
Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. “మరచిపోలేని గుణపాఠం చెబుతాం” అంటూ ఖమేనీ హెచ్చరిక
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!