Basara IIIT: వీకెండ్ విత్ వీసీ.. విద్యార్థుల సమస్యలు నేరుగా చెప్పుకునే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో ఇన్ చార్జి వీసీ వెంకట రమణ అప్రమత్తమయ్యారు. రెండు నెలల్లోనే పీయూసీ-1లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతో వీసీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీయూసీ వన్ విద్యార్థులకు ఈ నెల 14 వరకు సెలవులు ప్రకటించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో అత్యవసరంగా సమావేశమైన ఆయన.. బాసర ట్రిపుల్ ఐటీలో ఉండగలరని భావిస్తేనే పిల్లలను వెనక్కి పంపాలని తల్లిదండ్రులకు సూచించారు. RGKUT యొక్క నూతన విధానాల గురించి VC తల్లిదండ్రులతో చర్చించారు. విద్యార్థులు మానసికంగా ఇక్కడ ఉండేందుకు సిద్ధంగా లేరని వీసీ తెలిపారు. ఇక నుంచి ప్రతి శనివారం వీకెండ్ విత్ వీసీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. తద్వారా విద్యార్థులు తమ సమస్యలను నేరుగా వీసీకి చెప్పుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఇక నుంచి ప్రతి శనివారం గ్రామ పర్యటన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Read also: Jailer Records: రజినీ దెబ్బకి ఈ రికార్డులు బద్దలయ్యాయి…
Also Read
మరోవైపు బాసర ట్రిపుల్ ఐటీ గత ఏడాది కాలంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఇక్కడి విద్యార్థులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం వారం రోజుల పాటు శాంతియుతంగా ఆందోళనలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి బాసరకు వెళ్లి చర్చలు జరపడంతో వారు ఆందోళన విరమించి తరగతులకు హాజరయ్యారు. అనంతరం ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లోని రెండు మెస్ లలో ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం గతేడాది జూలైలో బాసర ట్రిపుల్ ఐటీ ఇన్ చార్జి వీసీగా ఉన్న రాహుల్ బొజ్జా స్థానంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వెంకట రమణను నియమించింది.
ఇన్ ఛార్జి వీసీగా వెంకటరమణ వస్తే పరిస్థితి మారుతుందని అంతా భావించారు. అయితే విద్యార్థుల ఆత్మహత్యలు అందరినీ కలచివేసింది. గతేడాది డిసెంబర్లో భాను ప్రసాద్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జూన్ 13న దీపిక అనే విద్యార్థిని, జూన్ 15న లిఖిత అనే బాలిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆగస్టు 8న జదాబ్ బబ్లూ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రిపుల్ ఐటీలో చేరిన కొద్ది రోజులకే నారాయణఖేడ్ కు చెందిన బబ్లూ ఆత్మహత్య చేసుకున్నాడు. తన సోదరుడు క్యాంపస్లో ఉన్నప్పటికీ, బబ్లూ తన సమస్య ఏమిటో అతనికి చెప్పలేదు. మనస్పర్థల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు వీసీ తెలిపారు.
Jailer Records: రజినీ దెబ్బకి ఈ రికార్డులు బద్దలయ్యాయి…
తాజావార్తలు
-
KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
-
Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
-
Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
-
Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
-
Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..