Basara IIIT: వీకెండ్ విత్ వీసీ.. విద్యార్థుల సమస్యలు నేరుగా చెప్పుకునే ఛాన్స్
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో ఇన్ చార్జి వీసీ వెంకట రమణ అప్రమత్తమయ్యారు. రెండు నెలల్లోనే పీయూసీ-1లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతో వీసీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీయూసీ వన్ విద్యార్థులకు ఈ నెల 14 వరకు సెలవులు ప్రకటించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో అత్యవసరంగా సమావేశమైన ఆయన.. బాసర ట్రిపుల్ ఐటీలో ఉండగలరని భావిస్తేనే పిల్లలను వెనక్కి పంపాలని తల్లిదండ్రులకు సూచించారు. RGKUT యొక్క నూతన విధానాల గురించి VC తల్లిదండ్రులతో చర్చించారు. విద్యార్థులు మానసికంగా ఇక్కడ ఉండేందుకు సిద్ధంగా లేరని వీసీ తెలిపారు. ఇక నుంచి ప్రతి శనివారం వీకెండ్ విత్ వీసీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. తద్వారా విద్యార్థులు తమ సమస్యలను నేరుగా వీసీకి చెప్పుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఇక నుంచి ప్రతి శనివారం గ్రామ పర్యటన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Read also: Jailer Records: రజినీ దెబ్బకి ఈ రికార్డులు బద్దలయ్యాయి…
Also Read
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
- Petrol, Diesel: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత భయాల వేళ.. సివిల్ సప్లై కమిషనర్ కీలక ప్రకటన
- Traffic Constable: రైతు ఇబ్బంది తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. స్థానికుల నుంచి ప్రశంసల వర్షం
మరోవైపు బాసర ట్రిపుల్ ఐటీ గత ఏడాది కాలంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఇక్కడి విద్యార్థులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం వారం రోజుల పాటు శాంతియుతంగా ఆందోళనలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి బాసరకు వెళ్లి చర్చలు జరపడంతో వారు ఆందోళన విరమించి తరగతులకు హాజరయ్యారు. అనంతరం ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లోని రెండు మెస్ లలో ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం గతేడాది జూలైలో బాసర ట్రిపుల్ ఐటీ ఇన్ చార్జి వీసీగా ఉన్న రాహుల్ బొజ్జా స్థానంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వెంకట రమణను నియమించింది.
ఇన్ ఛార్జి వీసీగా వెంకటరమణ వస్తే పరిస్థితి మారుతుందని అంతా భావించారు. అయితే విద్యార్థుల ఆత్మహత్యలు అందరినీ కలచివేసింది. గతేడాది డిసెంబర్లో భాను ప్రసాద్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జూన్ 13న దీపిక అనే విద్యార్థిని, జూన్ 15న లిఖిత అనే బాలిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆగస్టు 8న జదాబ్ బబ్లూ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రిపుల్ ఐటీలో చేరిన కొద్ది రోజులకే నారాయణఖేడ్ కు చెందిన బబ్లూ ఆత్మహత్య చేసుకున్నాడు. తన సోదరుడు క్యాంపస్లో ఉన్నప్పటికీ, బబ్లూ తన సమస్య ఏమిటో అతనికి చెప్పలేదు. మనస్పర్థల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు వీసీ తెలిపారు.
Jailer Records: రజినీ దెబ్బకి ఈ రికార్డులు బద్దలయ్యాయి…
తాజావార్తలు
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
-
NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!