Bandi Sanjay: కుంభకోణాలు, కుతంత్రాలు తప్ప కేసీఆర్ ప్రజలకు చేసిందేమీ లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: కేసీఆర్ పదేళ్ల పాలనలో కుంభకోణాలు, కుతంత్రాలు తప్ప రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మండి పడ్డారు. గణేష్ ఉత్సవాలను రాజకీయాల కోసం బీఆర్ఎస్ వాడుకుంటోందని అన్నారు. మండపాల ఏర్పాటుకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో కోట్లాది రూపాయల విరాళాలు ఇచ్చారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు సీఎం కేసీఆర్ రకరకాలుగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆదివారం కరీంనగర్లోని పలు కాలనీల్లోని పలు గణేష్ మండపాలను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు సీఎం కేసీఆర్ పంపిణీ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో కుంభకోణాలు, కుతంత్రాలు తప్ప రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. గ్రూప్-1 పరీక్షల రద్దుపై ఆయన స్పందించారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో సీఎం చెలగాటమాడారని సంజయ్కుమార్ అన్నారు.
Read also: Bhatti Vikramarka: భట్టితో బీసీ నేతల భేటీ.. ఆ రెండు సీట్లు ఇవ్వాలని విజ్ఙప్తి
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
రాష్ట్రంలో పోటీ పరీక్షలే కాదు, టెన్త్, ఇంటర్ పరీక్షలను కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం సక్రమంగా నిర్వహించలేకపోతోందన్నారు. బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో పిల్లల భవిష్యత్తు అంధకారంలో మగ్గుతుందని యువత తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. ఇప్పటికే యూనివర్సిటీలో మురళీ ముదిరాజ్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడడం అతని తల్లిదండ్రులను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తదుపరి పరీక్షలకు హాజరు కావడానికి నిరుద్యోగ యువతకు వయోపరిమితిలో సడలింపు ఇవ్వాలి. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3,116 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కాకుండా సీఎం కేసీఆర్ మద్యాన్ని ప్రోత్సహిస్తూ మద్యానికి బానిసలుగా మారుతున్నారని ఆరోపించారు.
Skanda :వైరల్ అవుతున్న స్కంద రిలీజ్ ట్రైలర్ ప్రోమో…
తాజావార్తలు
-
SPIRIT : ప్రభాస్తో పెట్టుకుంటే ఇంతే సంగతులా? ‘స్పిరిట్’పై మాకు నమ్మకం లేదు?
-
Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
-
SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!