Bandi Sanjay: పులి వస్తోంది, వేట మొదలైంది.. బండి సంజయ్ ఉద్వేగభరిత ప్రసంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Speech In Vijaya Sankalpa Sabha: ‘‘కేసీఆర్ నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి 8 గంటలు రోడ్లపై తిప్పారు. అప్పుడు కార్యకర్తలకు నేను చెప్పింది ఒక్కటే.. మీరేం భయపడకండి, ఢిల్లీ నుండి ఫోన్ వచ్చింది, పులి వస్తోంది, వేట మొదలైంది, వెంటాడటం ప్రారంభించింది, అది కార్యకర్తల్ని కాపాడే పులి’’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. చేవెళ్లలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ.. హిందీ టెన్త్ పేపర్ లీకేజీ కేసులో పోలీసులు తనను అర్థరాత్రి అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. 8 గంటల పాటు రోడ్ల మీదే తిప్పారని గుర్తు చేశారు. అయితే.. కరీంనగర్ దాటిన తర్వాత తన భార్య ఫోన్ చేసిందని, ఢిల్లీ నుండి ఫోన్ చేశారని చెప్పిందని తెలిపారు. తనని కొత్తపేట, ప్రజ్ఞపూర్, భువనగిరికి తీసుకుపోయారని.. అక్కడికి ఒక కానిస్టేబుల్ వచ్చి ‘ఎక్కడికి తీసుకుపోతున్నారో అర్థం కావడం లేదని’ భయపడుతూ చెప్పాడని అన్నారు. అప్పుడు తాను ‘మీరేం భయపడకండని, ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందని, అక్కడి నుంచి పులి వస్తోందని, ఆ పులి వెంటాడటం ప్రారంభించిందని, ఆ పులే కార్యకర్తల్ని కాపాడుతుందని’ భరోసా ఇచ్చాడనని పేర్కొన్నారు.
Tarun Chugh: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే..
Also Read
తెలంగాణను అభివృద్ధి చేసేందుకు మోడీ ప్రభుత్వం ఇక్కడికి వస్తుంటే.. కేసీఆర్ సర్కార్ అడుగడుగునా అడ్డుకుంటోందని బండి సంజయ్ ఆరోపించారు. ఒక్కసారి తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నానన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తప్పకుండా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తాం.. ఫసల్ బీమా అమలు చేస్తాం.. ఇళ్లను నిర్మిస్తామని, జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని.. ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని మాటిచ్చారు. తెలంగాణలో రాక్షస రాజ్యాన్ని, కుటుంబ పాలనను, నియంత పాలనను కూకటి వేళ్లతో పెకిలించివేసేందుకు అమిత్ షా ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చామని ఉద్ఘాటించారు. అందరి ఆశీస్సులు కావాలని కోరిన ఆయన.. లాఠీదెబ్బలకు, కేసులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇంతపెద్ద ఎత్తున సభకు తరలి వచ్చినందుకు అందరికీ చేతులెత్తి జోడించారు. కాగా.. ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ & మధ్యప్రదేశ్ ఇంఛార్జీలు తరుణ్ చుగ్, మురళీధర్ రావు, సహఇంఛార్జీ అరవింద్ మీనన్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు.
Amit Shah: ప్రధాని కుర్చీ ఖాళీగా లేదు.. ముందు సీఎం సీటు కాపాడుకో..
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!