Amit Shah: ప్రధాని కుర్చీ ఖాళీగా లేదు.. ముందు సీఎం సీటు కాపాడుకో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: యువకుల జీవితాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటలాడుతున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా మండిపడ్డారు. లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలను అంధకారంలో నెట్టారని విమర్శించారు. చేవెళ్లలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో మాట్లాడిన అమిత్ షా.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతి ప్రభుత్వం నడుస్తోందని.. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు. కేసీఆర్ చెవులు పెట్టి విను.. జైళ్లకు పంపిస్తే బీజేపీ కార్యకర్తలు భయపడరంటూ కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. బండి సంజయ్ను జైలులో పెడితే 24 గంటల్లో బెయిల్పై బయటకు వచ్చారని.. బండి సంజయ్ పేపర్ లీకేజీపై మాట్లాడినందుకు ఆయన్ను జైలుకు పంపించారని మండిపడ్డారు. నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ ఆడుకున్నారని అమిత్ షా ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికలలో కేసీఆర్ను ఓడించేందుకు సిద్దంగా ఉన్నారని..ఒక పరీక్ష కూడా సక్రమంగా నిర్వహించని ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదన్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో కేసీఆర్ ఎవరిని రక్షించాలని అనుకుంటున్నారని.. ఎందుకు మాట్లాడడం లేదని.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని అమిత్ షా పేర్కొన్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే… అవినీతి పరులను జైలుకు పంపిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలోనే కేసీఆర్ పని అయిపోతుందని.. దేశం గురించి ఏమీ మాట్లాడుతారంటూ అమిత్ షా ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రధాని కావాలని కలలు కంటున్నారని.. 2024లో ప్రధాని కుర్చీ ఖాళీగా లేదన్నారు. “కేసీఆర్.. ప్రధాని సీటు ఖాళీగా లేదు. వచ్చే ఎన్నికల తర్వాత కూడా మోదీనే ప్రధాని. కేసీఆర్.. ముందు సీఎం సీటు కాపాడుకుంటే చాలు. అధికారంలోకి వస్తే విమోచన దినం ఘనంగా నిర్వహిస్తాం. మజ్లిస్కు బీజేపీ భయపడేది లేదు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాం. కారు స్టీరింగ్ మజ్లిస్ చేతుల్లో ఉంది.” అమిత్ షా అన్నారు.
Also Read
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
Read Also: Punjab CM Bhagawant Mann: మార్చిలోనే అమృత్పాల్ను అరెస్ట్ చేసి ఉండొచ్చు.. కానీ..!
పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు ఇక్కడ ఎన్నికలు వస్తున్నాయని.. బీజేపీ అధికారంలోకి వస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్లు కేసీఆర్కు ఏటీఎంలుగా మార్చుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ నీ జులుం బంద్ చెయ్యి.. ఉన్న ఈ టైమ్లో ప్రజల కోసం పని చెయ్యి అంటూ అమిత్ షా మాట్లాడారు. దాదాపు 20 నిమిషాలు మాట్లాడిన అమిత్ షా.. గొంతు సహకరించక పోవడంతో ఇబ్బంది పడ్డారు. వేట మొదలైంది.. వేటాడానికే పులి వచ్చిందని.. కుటుంబ పాలనను కూకటి వేళ్లతో పెకిలించి వేస్తామని అమిత్ షా అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, ఫస్ట్ తారీఖే జీతాలిస్తామని అమిత్ షా అన్నారు.
తాజావార్తలు
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!