Bandi Sanjay : కేటీఆర్ పరువు నష్టం కేసుపై బండి స్పందన.. ఫీజు రీయింబర్స్మెంట్ పై ఫైర్
- కేటీఆర్ ఇజ్జత్ దావా బెదిరింపు మాత్రమే: బండి సంజయ్
- యూరియా సరఫరాలో మాయం అయిన మూడు లక్షల టన్నులు
- ఫీజు రీయింబర్స్మెంట్పై విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన
- కాంగ్రెస్ ఎమ్మెల్యేల గన్మెన్లపై బ్లాక్ మార్కెట్ ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay : కరీంనగర్ జిల్లా పర్యటనలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అంశాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసు, యూరియా సరఫరా సమస్యలు, ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలపై బండి సంజయ్ కడుపుమంట వ్యాఖ్యలు చేసి సర్కారుపై తీవ్రస్థాయిలో దాడి చేశారు.
కేటీఆర్ పరువు నష్టం కేసుపై స్పందన
Also Read
కేటీఆర్ తనపై పరువు నష్టం కేసు వేసిన విషయాన్ని ప్రస్తావించిన బండి సంజయ్, ఇది బెదిరింపు ప్రయత్నమేనని వ్యాఖ్యానించారు. “తొమ్మిది సార్లు జైలు వెళ్లాను, వందకు పైగా కేసులు ఎదుర్కొన్నాను. ఇకనైనా భయపడతానా? నేను రాజకీయంగా ఎదుర్కొంటాను కానీ బెదిరించేందుకు ఇజ్జత్ దావాలు వేయను” అని ఆయన స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులతో దేవాలయంలో ప్రమాణం చేయమని విసిరిన సవాల్ను కేటీఆర్ ఎందుకు స్వీకరించడం లేదని ఆయన ప్రశ్నించారు.
Honeytrap: హనీ ట్రాప్లో పడ్డ యోగా గురువు.. కోట్లలో డబ్బు డిమాండ్ చేసిన ముఠా
యూరియా సరఫరా లోపాలు
రైతుల సమస్యలపై కూడా బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు కేంద్రం 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినప్పటికీ, కేవలం 9 లక్షల టన్నులు మాత్రమే రైతులకు పంపిణీ చేశారని, మిగిలిన 3 లక్షల టన్నులు బ్లాక్ మార్కెట్లో మాయమయ్యాయని ఆరోపించారు. “రైతులు చెప్పులు, పాస్బుక్స్ లైన్లో పెడుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల గన్మెన్లు యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. రైతుల ఇబ్బందులపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?” అని ఆయన ప్రశ్నించారు. RFCL సమస్య కారణంగా కొంత ఇబ్బంది ఉన్నా, దానిని కేంద్రం పరిష్కరిస్తోందని ఆయన తెలిపారు.
ఫీజు రీయింబర్స్మెంట్ వివాదం
ఫీజు రీయింబర్స్మెంట్పై కూడా బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “15 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. వారి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. యాజమాన్యాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. 8 నుంచి 10 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించాలి. ఒక మంత్రి మాట ఇస్తే దాన్ని అమలు చేయాలి కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు” అని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో పంజాబ్ వెళ్లి చెల్లని చెక్కులు ఇచ్చారని గుర్తు చేశారు.
BCCI: ఏం చేసుకుంటారో చేసుకోండి.. హ్యాండ్షేక్ వివాదంపై బీసీసీఐ కార్యదర్శి రియాక్షన్..
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!