Bandi Sanjay : కేటీఆర్ పరువు నష్టం కేసుపై బండి స్పందన.. ఫీజు రీయింబర్స్మెంట్ పై ఫైర్
- కేటీఆర్ ఇజ్జత్ దావా బెదిరింపు మాత్రమే: బండి సంజయ్
- యూరియా సరఫరాలో మాయం అయిన మూడు లక్షల టన్నులు
- ఫీజు రీయింబర్స్మెంట్పై విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన
- కాంగ్రెస్ ఎమ్మెల్యేల గన్మెన్లపై బ్లాక్ మార్కెట్ ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay : కరీంనగర్ జిల్లా పర్యటనలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అంశాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసు, యూరియా సరఫరా సమస్యలు, ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలపై బండి సంజయ్ కడుపుమంట వ్యాఖ్యలు చేసి సర్కారుపై తీవ్రస్థాయిలో దాడి చేశారు.
కేటీఆర్ పరువు నష్టం కేసుపై స్పందన
Also Read
- Good News : ఇక వాట్సాప్లోనే మార్కుల మెమో.. తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్.!
- Hyderabad : కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే.!
- Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
- KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
కేటీఆర్ తనపై పరువు నష్టం కేసు వేసిన విషయాన్ని ప్రస్తావించిన బండి సంజయ్, ఇది బెదిరింపు ప్రయత్నమేనని వ్యాఖ్యానించారు. “తొమ్మిది సార్లు జైలు వెళ్లాను, వందకు పైగా కేసులు ఎదుర్కొన్నాను. ఇకనైనా భయపడతానా? నేను రాజకీయంగా ఎదుర్కొంటాను కానీ బెదిరించేందుకు ఇజ్జత్ దావాలు వేయను” అని ఆయన స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులతో దేవాలయంలో ప్రమాణం చేయమని విసిరిన సవాల్ను కేటీఆర్ ఎందుకు స్వీకరించడం లేదని ఆయన ప్రశ్నించారు.
Honeytrap: హనీ ట్రాప్లో పడ్డ యోగా గురువు.. కోట్లలో డబ్బు డిమాండ్ చేసిన ముఠా
యూరియా సరఫరా లోపాలు
రైతుల సమస్యలపై కూడా బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు కేంద్రం 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినప్పటికీ, కేవలం 9 లక్షల టన్నులు మాత్రమే రైతులకు పంపిణీ చేశారని, మిగిలిన 3 లక్షల టన్నులు బ్లాక్ మార్కెట్లో మాయమయ్యాయని ఆరోపించారు. “రైతులు చెప్పులు, పాస్బుక్స్ లైన్లో పెడుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల గన్మెన్లు యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. రైతుల ఇబ్బందులపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?” అని ఆయన ప్రశ్నించారు. RFCL సమస్య కారణంగా కొంత ఇబ్బంది ఉన్నా, దానిని కేంద్రం పరిష్కరిస్తోందని ఆయన తెలిపారు.
ఫీజు రీయింబర్స్మెంట్ వివాదం
ఫీజు రీయింబర్స్మెంట్పై కూడా బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “15 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. వారి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. యాజమాన్యాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. 8 నుంచి 10 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించాలి. ఒక మంత్రి మాట ఇస్తే దాన్ని అమలు చేయాలి కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు” అని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో పంజాబ్ వెళ్లి చెల్లని చెక్కులు ఇచ్చారని గుర్తు చేశారు.
BCCI: ఏం చేసుకుంటారో చేసుకోండి.. హ్యాండ్షేక్ వివాదంపై బీసీసీఐ కార్యదర్శి రియాక్షన్..
తాజావార్తలు
-
Uddhav Thackeray: అధికారం కోసం కాదు, సిద్ధాంతాల కోసమే పదవిని వదులుకున్నా: ఉద్ధవ్ ఠాక్రే
-
China Women: ప్లీజ్ నన్నెవరైనా పెళ్లి చేసుకోండని గుక్కపెట్టి ఏడ్చిన మహిళ.. వైరల్ అవుతున్న వీడియో!
-
Rishab Pant: LSGలో మాత్రం ఉండను బాబోయ్.. ఆర్థిక నష్టానికైనా రెడీ అవుతున్న రిషబ్ పంత్..
-
Veg Biryani with Leftover Rice: పాత అన్నాన్ని పారేయొద్దు.. 10 నిమిషాల్లో సూపర్ బిర్యానీ రెడీ
-
Trump: ఇరాన్కు ఒక్క పైసా కూడా ఇవ్వం.. స్విట్జర్లాండ్ చర్చలు వాయిదాపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు