Honeytrap: హనీ ట్రాప్లో పడ్డ యోగా గురువు.. కోట్లలో డబ్బు డిమాండ్ చేసిన ముఠా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honeytrap: యోగా గురు.. హనీ ట్రాప్లో పడ్డాడు. ఏకంగా 50 లక్షల రూపాయలు సమర్పించుకున్నాడు. కానీ అవతలి వ్యక్తులకు ధనదాహం తీరకపోవడంతో మరో 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని వేధించారు. దీంతో యోగా గురు పోలీసులను ఆశ్రయించాడు. ఫలితంగా ముఠా ఆట కట్టించారు పోలీసులు. ఆయన పేరు రంగారెడ్డి. స్వయంగా ఆయన ఓ రాజకీయ నాయకుడు.. అంతే కాదు ఒక యోగా టీచర్గానూ సేవలందిస్తున్నారు. దీనికి తోడు ఓ వెల్ నెస్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక వెల్ నెస్ సెంటర్ ఏర్పాటుచేసి అక్కడ యోగా పాఠాలు చెబుతున్నారు…
READ ALSO: Banswada Mother Murder: కొడుకు కాదు యముడు..
Also Read
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
యోగా టీచర్ని ట్రాప్ చేసిన ఇద్దరు లేడీస్
ఇక్కడ వరకు బాగానే ఉంది.. అయితే ఈ యోగా టీచర్ని ఇద్దరు లేడీస్ ట్రాప్ చేశారు. నిజానికి ఓ యువకుడు ఆ ఇద్దరు మహిళల వెనుక ఉండి డ్రామా స్టార్ట్ చేశాడు. ఇద్దరు మహిళలను యోగా గురు రంగారెడ్డి నిర్వహిస్తున్న ఆశ్రమానికి పంపించాడు. వారు తమకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి ఆశ్రమంలో చేరారు. అలా చేరిన ఆ ఇద్దరు మహిళలు.. యోగా గురువు రంగారెడ్డితో సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టారు. అయితే ఈ ఇద్దరు మహిళలు రంగా రెడ్డితో సన్నిహితంగా ఉన్న సమయంలో రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఇంకేముంది మాస్టారు కాస్తా హనీ ట్రాప్లో చిక్కుకుపోయారు…
భయపడి రూ.50 లక్షలు
ఆ తర్వాత అసలు కథ షురూ చేశారు కేటుగాళ్లు. ఈ సమయంలో అమర్ అండ్ గ్యాంగ్ రంగంలోకి దిగింది. ఇద్దరు మహిళలతో యోగా గురువు రంగారెడ్డి సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. మేము అడిగినన్నిడబ్బులు ఇవ్వకపోతే ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తామంటూ బెదిరించారు. వారి బెదిరింపులకు భయపడి పోయిన యోగా గురువు రంగారెడ్డి వెంటనే వారికి రూ. 50 లక్షల చెక్కు ఇచ్చాడు…
రూ. 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్
కొద్ది రోజులు గడిచిన అనంతరం మళ్లీ అమర్ గ్యాంగ్.. యోగా గురువు రంగారెడ్డికి ఫోన్ చేసి రూ.2 కోట్ల రూపాయలు కావాలని డిమాండ్ చేశారు. డబ్బులు త్వరగా ఇవ్వాలంటూ ప్రతిరోజూ యోగా గురువుకు ఫోన్ చేసి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. రోజు రోజుకీ వారి వేధింపులు మితి మీరిపోవడంతో భరించలేక యోగా గురువు రంగారెడ్డి గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించిన అనంతరం అమర్ గ్యాంగ్కి చెందిన ఇద్దరు మహిళలతోపాటు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చెక్కులు, ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు…
READ ALSO: Hardik Pandya New Relationship: హార్దిక్ పాండ్యా మళ్లీ ప్రేమలో పడ్డాడా.. ఎవరా రూమర్ గర్ల్ఫ్రెండ్
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!