Bandi sanjay: అసోం సీఎంను మాట్లాడనీయకుండా మైక్ లాక్కోవడం హేయమైన చర్య
గణేశ్ ఉత్సవ కమిటీలో సీఎం కేసీఆర్ని విమర్శించినందుకు, నందుబిలాల్ వెనక నుంచి ఒక్కసారిగా చొచ్చుకొని వచ్చి అసోం సీఎం హిమంత బిస్వా శర్మ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. మైక్ లాక్కొని, ఆయనతో వాగ్వాదానికి దిగారు. అయితే దీనిపై బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ సీరియస్ అయ్యారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మను స్టేజీపై మాట్లాడనీయకుండా టీఆర్ఎస్ నేత మైక్ లాక్కోడం హేయమైన చర్య అని మండిపడ్డారు. గణేష్ నిమజ్జన ఉత్సవాలకు హైదరాబాద్ కు ముఖ్య అతిథిగా వచ్చిన అసోం సీఎంను గౌరవించాలనే కనీస సోయి లేకుండా టీఆర్ఎస్ నేతలు నీచంగా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు.
మెడలో గులాబీ కండువా వేసుకున్న టీఆర్ఎస్ నేతలను ప్రోటోకాల్ లేకుండా పోలీసులు లేకుండా పోలీసులు స్టేజీపైకి ఎలా రానిచ్చారని ప్రశ్నించారు. ఒక రాష్ట్ర సీఎంకి ఇచ్చే భద్రత ఇదేనా? అంటూ ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల పర్యటనలకు వెళ్తున్న సీఎం కేసీఆర్ కు కేంద్రం భద్రత కల్పించకపోతే ఆయన స్వేచ్ఛగా వెళ్లగలుగుతారా? అని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రశాంతంగా తిరగగలరా? అని వ్యాఖ్యానించారు. లక్షలాది మంది పాల్గొనే శోభాదయాత్రకు హాజరయ్యేందుకు అసోం నుండి వచ్చిన ముఖ్య అతిధి అడ్డుకుంటే పరువుపోతుందనే కనీస ఆలోచన లేకపోవడం సిగ్గు చేటన్నారు.
Also Read
- Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
భారతదేశంలోనే అతి తక్కువ కాలంలో అద్భుతమైన పాలనతో అసోం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న గొప్ప వ్యక్తి హిమంత బిశ్వశర్మ అని బండి సంజయ్ అన్నారు. ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తూ.. ఎక్కడా అవినీతి లేకుండా పరిపాలనా చేస్తున్న అసోం సీఎంని చూసి టీఆర్ఎస్ వాళ్లు నేర్చుకోవాలన్నారు. ఇక టీఆర్ఎస్ నాయకులను పంపించి అసోం ముఖ్యమంత్రిపై దాడి చేయించే కుట్రచేయడం సీఎం కేసీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. సీఎం హిమంత బిశ్వశర్మపై దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ నేతపై హత్యాయత్నం కేసు పెట్టి.. ఈ దాడికి పురిగొల్పిన మంత్రులపైనా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నాయకులను గౌరవించాలనే కనీస సోయిలేని కేసీఆర్.. జాతీయ పార్టీ పెడుతానని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. నగరంలో.. గణేష్ నిమజ్జన శోభాయాత్రలో సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులెవరూ పాల్గొనలేదన్నారు.
Saturday Venkateswara swamy Stothraparayanam Live: శనివారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే..
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!