Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bandi Sanjay Padayatra Commences From September 12th

Bandi Sanjay Padayatra: రేవంత్ అడ్డాలో సెప్టెంబర్ 12నుంచి నాలుగో విడత పాదయాత్ర

Published Date :August 29, 2022 , 10:06 pm
By NTV WebDesk
Bandi Sanjay Padayatra: రేవంత్ అడ్డాలో సెప్టెంబర్ 12నుంచి నాలుగో విడత పాదయాత్ర
  • Follow Us :
  • google news
  • dailyhunt

మ‌ల్కాజ్ గిరి పార్ల‌మెంటు నియోజ‌క వ‌ర్గంలో బండి సంజయ్ నాలుగోవిడ‌త పాద‌యాత్ర ప్రారంభం కానుంది. సెప్టెంబ‌ర్ 12వ తేదీ నుండి ప్రారంభించ‌నున్న నాలుగోవిడ‌త పాద‌యాత్ర మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో రేవంత్ రెడ్డి అడ్డాలో నిర్వ‌హించాల‌నే యోచ‌న‌లో బీజేపీ తెలంగాణ శాఖ ఉంది. మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో నాలుగోవిడ‌త పాదయాత్ర నిర్వ‌హించ‌డానికి ప్ర‌ధాన ఉద్దేశ్యం .. హైద‌రాబాద్ న‌గ‌రంలోనే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు అందుబాటులో ఉంటూ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన మునుగోడు ఉప ఎన్న‌కను కూడా ప‌ర్య‌వేక్షించ‌డానికే అంటున్నారు.

నాలుగో విడ‌త పాద‌యాత్ర రూట్ మ్యాప్, ఎక్క‌డ ప్రారంభించాలి? ఎక్క‌డ ముగించాలి అనే అంశాల‌పై సెప్టెంబ‌ర్ 2,3 తేదీల్లో జిహెచ్ఎంసి, ఉమ్మ‌డి రంగారెడ్డి ప‌రిధిలోని నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లతో ఒక‌స‌మావేశాన్ని నిర్వ‌హించి తుదినిర్ణ‌యం తీసుకోనున్నారు. నాలుగో విడ‌త పాద‌యాత్ర‌ను కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోని గాజుల‌రామారం లో వున్న చిత్తార‌మ్మ అమ్మ‌వారి ఆల‌యం లేదా సూరారంలోని క‌ట్ట‌మైస‌మ్మ అమ్మ‌వారి గుడి వ‌ద్ద ప్రారంభిస్తే బాగుంటుంద‌ని ఇప్ప‌టికే నాయ‌కులు సూచించారు.

Also Read

  • Sigachi Victims: సిగాచి ప్రమాదంలో మృ*తుల కుటుంబాలకు న్యాయం జరగడం లేదా..?
  • Telangana Vahan Portal: రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన వాహన్ పోర్టల్.. ఇక మీ ఇంటి నుంచే వాహన సేవలు!
  • Dr Preeti Reddy: బీజేపీ ఆఫీస్‌కు మల్లారెడ్డి కోడలు.. రాజకీయాల్లో హాట్ టాపిక్!!
  • Harish Rao: ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత..

Read Also: అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ సార్లు డకౌట్ అయిన టీమిండియా ఓపెనర్లు

నాలుగోవిడ‌త పాద‌యాత్ర కుత్బుల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్రారంభించి వ్యూహాత్మ‌కంగా అబ్దుల్లాపూర్ మెట్ ఓఆర్ ఆర్ వ‌ద్ద ముగించాల‌నే యోచ‌న‌లో ఉన్నారు. దీనికి కార‌ణం దీని ప్ర‌భావం మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం పాద‌యాత్ర ముగించే ప్రాంతానికి 10- 15 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది. నాలుగోవిడ‌త పాద‌యాత్ర పూర్తిగా ప‌ట్ట‌ణ ప్రాంతంలో మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతుంది. కుత్బుల్లాపూర్, కూక‌ట్‌ప‌ల్లి, మేడ్చల్‌, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌, మ‌ల్కాజ్ గిరి, ఉప్ప‌ల్, ఎల్‌బి న‌గ‌ర్‌, ఇబ్ర‌హీంప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ యాత్ర కొన‌సాగుతుంది. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో రోజున్న‌ర పాటు యాత్ర కొన‌సాగించాల‌ని, ప్ర‌తీ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక పెద్ద స‌భ‌ను సాయంత్రం నిర్వ‌హించాల‌ని త‌ల‌పెట్టారు.

ప్ర‌తీ రోజు 12 నుండి 16 కిలోమీట‌ర్లు యాత్ర కొన‌సాగించాల‌ని ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో నాలుగో విడ‌త పాద‌యాత్ర నిర్వ‌హించ‌డంలో దాగివున్న వ్యూహం జిహెచ్ఎంసి ప‌రిధిలో బిజెపి పార్టీ ప‌టిష్ట‌వంతంగా వుండ‌టంతో పాటు టిపిసిసి అధ్య‌క్షులు శ్రీ రేవంత్‌రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గంలో పాగా వేయాల‌ని, కాంగ్రెస్‌పార్టీని పూర్తిగా లేకుండా చేయాల‌ని ఉద్దేశంగా కనిపిస్తోంది. నాలుగోవిడ‌త పాద‌యాత్ర‌లో గోరేటి వెంక‌న్న “పాట గ‌ల్లీ చిన్న‌ది … గ‌రీబోళ్ల క‌థ పెద్ద‌ది … “పాట‌ని విస్తృతంగా వాడుకోవాల‌ని కూడా యోచ‌న‌లో బిజెపి తెలంగాణ శాఖ ఉన్నట్టు తెలుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • Bandi Sanjay Praja Sangrama Yatra
  • bandi sanjay yatra
  • bjp telangana
  • cm kcr

తాజావార్తలు

  • Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200

  • Raghav chadha: సీఏ నుంచి ఆప్‌ను కూల్చేదాకా.! రాఘవ్ చద్దా ఎవరు..?

  • Raghav Chadha: ఆప్‌లో భారీ చీలిక.. పంజాబ్‌లో ‘మాన్’ ప్రభుత్వం కూలిపోతుందా!

  • Botsa Satyanarayana: వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన.. బొత్స ఫైర్‌..

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

ట్రెండింగ్‌

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions