Bandi Sanjay Padayatra: రేవంత్ అడ్డాలో సెప్టెంబర్ 12నుంచి నాలుగో విడత పాదయాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజక వర్గంలో బండి సంజయ్ నాలుగోవిడత పాదయాత్ర ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 12వ తేదీ నుండి ప్రారంభించనున్న నాలుగోవిడత పాదయాత్ర మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి అడ్డాలో నిర్వహించాలనే యోచనలో బీజేపీ తెలంగాణ శాఖ ఉంది. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో నాలుగోవిడత పాదయాత్ర నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశ్యం .. హైదరాబాద్ నగరంలోనే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు అందుబాటులో ఉంటూ ప్రతిష్టాత్మకమైన మునుగోడు ఉప ఎన్నకను కూడా పర్యవేక్షించడానికే అంటున్నారు.
నాలుగో విడత పాదయాత్ర రూట్ మ్యాప్, ఎక్కడ ప్రారంభించాలి? ఎక్కడ ముగించాలి అనే అంశాలపై సెప్టెంబర్ 2,3 తేదీల్లో జిహెచ్ఎంసి, ఉమ్మడి రంగారెడ్డి పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో ఒకసమావేశాన్ని నిర్వహించి తుదినిర్ణయం తీసుకోనున్నారు. నాలుగో విడత పాదయాత్రను కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గాజులరామారం లో వున్న చిత్తారమ్మ అమ్మవారి ఆలయం లేదా సూరారంలోని కట్టమైసమ్మ అమ్మవారి గుడి వద్ద ప్రారంభిస్తే బాగుంటుందని ఇప్పటికే నాయకులు సూచించారు.
Also Read
- Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
Read Also: అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ సార్లు డకౌట్ అయిన టీమిండియా ఓపెనర్లు
నాలుగోవిడత పాదయాత్ర కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రారంభించి వ్యూహాత్మకంగా అబ్దుల్లాపూర్ మెట్ ఓఆర్ ఆర్ వద్ద ముగించాలనే యోచనలో ఉన్నారు. దీనికి కారణం దీని ప్రభావం మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పాదయాత్ర ముగించే ప్రాంతానికి 10- 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నాలుగోవిడత పాదయాత్ర పూర్తిగా పట్టణ ప్రాంతంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతుంది. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మేడ్చల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, ఉప్పల్, ఎల్బి నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. ప్రతి నియోజకవర్గంలో రోజున్నర పాటు యాత్ర కొనసాగించాలని, ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పెద్ద సభను సాయంత్రం నిర్వహించాలని తలపెట్టారు.
ప్రతీ రోజు 12 నుండి 16 కిలోమీటర్లు యాత్ర కొనసాగించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో నాలుగో విడత పాదయాత్ర నిర్వహించడంలో దాగివున్న వ్యూహం జిహెచ్ఎంసి పరిధిలో బిజెపి పార్టీ పటిష్టవంతంగా వుండటంతో పాటు టిపిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో పాగా వేయాలని, కాంగ్రెస్పార్టీని పూర్తిగా లేకుండా చేయాలని ఉద్దేశంగా కనిపిస్తోంది. నాలుగోవిడత పాదయాత్రలో గోరేటి వెంకన్న “పాట గల్లీ చిన్నది … గరీబోళ్ల కథ పెద్దది … “పాటని విస్తృతంగా వాడుకోవాలని కూడా యోచనలో బిజెపి తెలంగాణ శాఖ ఉన్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
-
Number Secrete: మొబైల్ నంబర్కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!