Bandi Sanjay Padayatra: రేవంత్ అడ్డాలో సెప్టెంబర్ 12నుంచి నాలుగో విడత పాదయాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజక వర్గంలో బండి సంజయ్ నాలుగోవిడత పాదయాత్ర ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 12వ తేదీ నుండి ప్రారంభించనున్న నాలుగోవిడత పాదయాత్ర మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి అడ్డాలో నిర్వహించాలనే యోచనలో బీజేపీ తెలంగాణ శాఖ ఉంది. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో నాలుగోవిడత పాదయాత్ర నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశ్యం .. హైదరాబాద్ నగరంలోనే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు అందుబాటులో ఉంటూ ప్రతిష్టాత్మకమైన మునుగోడు ఉప ఎన్నకను కూడా పర్యవేక్షించడానికే అంటున్నారు.
నాలుగో విడత పాదయాత్ర రూట్ మ్యాప్, ఎక్కడ ప్రారంభించాలి? ఎక్కడ ముగించాలి అనే అంశాలపై సెప్టెంబర్ 2,3 తేదీల్లో జిహెచ్ఎంసి, ఉమ్మడి రంగారెడ్డి పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో ఒకసమావేశాన్ని నిర్వహించి తుదినిర్ణయం తీసుకోనున్నారు. నాలుగో విడత పాదయాత్రను కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గాజులరామారం లో వున్న చిత్తారమ్మ అమ్మవారి ఆలయం లేదా సూరారంలోని కట్టమైసమ్మ అమ్మవారి గుడి వద్ద ప్రారంభిస్తే బాగుంటుందని ఇప్పటికే నాయకులు సూచించారు.
Also Read
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
Read Also: అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ సార్లు డకౌట్ అయిన టీమిండియా ఓపెనర్లు
నాలుగోవిడత పాదయాత్ర కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రారంభించి వ్యూహాత్మకంగా అబ్దుల్లాపూర్ మెట్ ఓఆర్ ఆర్ వద్ద ముగించాలనే యోచనలో ఉన్నారు. దీనికి కారణం దీని ప్రభావం మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పాదయాత్ర ముగించే ప్రాంతానికి 10- 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నాలుగోవిడత పాదయాత్ర పూర్తిగా పట్టణ ప్రాంతంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతుంది. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మేడ్చల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, ఉప్పల్, ఎల్బి నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. ప్రతి నియోజకవర్గంలో రోజున్నర పాటు యాత్ర కొనసాగించాలని, ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పెద్ద సభను సాయంత్రం నిర్వహించాలని తలపెట్టారు.
ప్రతీ రోజు 12 నుండి 16 కిలోమీటర్లు యాత్ర కొనసాగించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో నాలుగో విడత పాదయాత్ర నిర్వహించడంలో దాగివున్న వ్యూహం జిహెచ్ఎంసి పరిధిలో బిజెపి పార్టీ పటిష్టవంతంగా వుండటంతో పాటు టిపిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో పాగా వేయాలని, కాంగ్రెస్పార్టీని పూర్తిగా లేకుండా చేయాలని ఉద్దేశంగా కనిపిస్తోంది. నాలుగోవిడత పాదయాత్రలో గోరేటి వెంకన్న “పాట గల్లీ చిన్నది … గరీబోళ్ల కథ పెద్దది … “పాటని విస్తృతంగా వాడుకోవాలని కూడా యోచనలో బిజెపి తెలంగాణ శాఖ ఉన్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
-
Prateek Yadav: అఖిలేష్ యాదవ్ తమ్మడు ‘ప్రతీక్ యాదవ్’ మృతి..!
-
Bomb Threat: ఆ సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం.. ఏకంగా ముఖ్యమంత్రికే బాంబు బెదిరింపు!
-
MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
-
Rahul Ramakrishna : థియేటర్లు ఖాళీగా ఉండటానికి అసలు కారణం ఇదే..
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!