Bandi Sanjay on Rice: యాసంగి వడ్లను కేసీఆర్ కొనాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రం రా రైస్ కొనేందుకు సిద్ధంగా ఉంది, యాసంగి వడ్లను రాష్ట్రం కొనాల్సిందే అన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. కేంద్రం యాసంగికి సంబంధించి రా రైస్ కొనేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్రం ఎందుకు వడ్లను కొనం అంటోందని బండి సంజయ్ ప్రశ్నించారు. కామారెడ్డి లోని పర్ణికా హోటల్ లో జరిగిన బీజేపీ జోనల్ సమావేశంలో పార్టీ జాతీయ సహా కార్యనిర్వాహక కార్యదర్శి శివప్రకాశ్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ సంస్థాగత నిర్మాణంపై దిశా నిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావ్, ఎమ్యెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్, బంగారు శ్రుతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మంత్రి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీ నారాయణ, జోనల్ పరిధిలోని జిల్లాల అధ్యక్షులు, జిల్లా ఇంఛార్జీలు, మాజీ ఎంపీలు, ఎమ్యెల్యేలు పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల నాయకులను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు.
Also Read
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
- ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
కేసీఆర్ చేస్తున్న సర్వేలన్నీ నెక్స్ట్ బీజేపీయే గెలుస్తుందని చెపుతున్నాయని, అయినా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నాకు సూచించారు. కేసీఆర్ తన చేతకానితనాన్ని కప్పి పుచ్చుకునేందుకు ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తుంటాడని సంజయ్ అన్నారు.యాసంగి వడ్ల కొనుగోలుకు సంబంధించి కేంద్రం అన్ని రాష్ట్రాల పౌరసరఫరాల శాఖలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైతే తెలంగాణ రాష్ట్రం యాసంగి వడ్లు కొనేది లేదు అని ప్లాన్ ఇవ్వలేదని సంజయ్ చెప్పారు.
కేంద్రం కొనడానికి సిద్ధంగా ఉంటే రాష్ట్రం కొనక పోవడాన్ని రైతులకు అర్థమయ్యేలా చెప్పాలని సంజయ్ తమ పార్టీ నాయకులకు సూచించారు.కేంద్రం రా రైస్ కొంటాము అంటే రాష్ట్రం కొనం అంటోంది. పోయిన సారి కూడా కేసీఆర్ రైతుల్ని అనవసరంగా ఆందోళనలో పదేశారని సంజయ్ గుర్తు చేశారు.కోటి టన్నుల వడ్లు పండాయి, కేంద్రం కొనట్లేదు ఢిల్లీలో పోస్తాము, స్టేట్ బీజేపీ ఆఫీస్ ముందు పోస్తాము అన్నాడు. కానీ ఇప్పటి దాకా కేంద్రం చెప్పిన 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం టార్గెట్ చేరుకోలేదు. కేంద్రం బియ్యం కొనడానికి సిద్ధంగా ఉన్న రాష్ట్రం సిద్ధంగా లేదు అని ఆయన చెప్పారు.
ప్రత్యామ్నాయ పంటలు వెయ్యమని చెప్పి బోనస్ ఇవ్వలేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అన్న హామీ ఏమైంది అని సంజయ్ ప్రశ్నించారు. KCR పవర్ పై కూడా కొత్త డ్రామా చేస్తున్నాడన్నారు.వ్యవసాయ కనెక్షన్లకు మీటర్ పెడతారని ఈ మధ్య trs నేతలు కామారెడ్డి లో అన్నారు.వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టారని నేను కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ కాపీని చూపించి ఛాలెంజ్ చేసినా. సీఎం తోక ముడిచారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల రూ. 62 వేల కోట్లనష్టాల్లో డిస్కం లు ఉన్నాయన్నారు సంజయ్. ఏప్రిల్ 1 నుంచి 68,000 కోట్ల రూపాయలు మేర ఛార్జీ పెంచబోతున్నారని ఆయన చెప్పారు. కేసీఆర్ ఫార్మ్ హౌజ్ లో 20 గ్రామాలకు సరిపోయే కరెంట్ వాడుతున్నారని సంజయ్ చెప్పారు.
తాజావార్తలు
-
KKR Vs MI: పాపం పాండ్యా.. కెప్టెన్సీ చేపట్టిన ప్రతీసారి ఇలానే.. మళ్లీ టార్గెట్ అవుతున్న హార్దిక్..
-
Peddi Censor Review : ‘రంగస్థలం’ను మించిన యాక్టింగ్…. లాస్ట్ 50 నిమిషాలు గూస్బంప్స్ గ్యారెంటీ!
-
Acer Aspire 5 AI Laptop: 32GB ర్యామ్, 14-అంగుళాల డిస్ప్లేతో.. ఏసర్ కొత్త ఆస్పైర్ 5 ల్యాప్టాప్ విడుదల
-
NTR : ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
-
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!