Bandi Sanjay: గవర్నర్ వ్యవస్థను కేసీఆర్ ఎత్తేస్తారేమో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సర్కార్-రాజ్భవన్ మధ్య క్రమంగా దూరం పెరుగుతూ పోతోంది… గవర్నర్ తమిళిసై బహిరంగంగానే ప్రభుత్వం, ప్రభుత్వాధినేతలపై విమర్శలు గుప్పించడం.. ఈ మధ్యే హస్తినలో పర్యటించి.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్షాతో సమావేశమైన తర్వాత.. టార్గెట్ రాష్ట్ర ప్రభుత్వం అనే తరహాలో ఆమె చేసిన వ్యాఖ్యలు చేయడం చర్చగా మారింది.. అయితే, అదే రేంజ్లో టీఆర్ఎస్ నుంచి కౌంటర్ ఎటాక్ స్టార్ట్ అయ్యింది.. ఈ నేపథ్యంలో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేవారు.. రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న వారు గవర్నర్ వ్యవస్థను గౌరవిస్తారన్న ఆయన.. సీఎం కేసీఆర్ ఒకవేళ ప్రధాని అయితే గవర్నర్ వ్యవస్థను ఎత్తేస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు.
Read Also: Singareni: సింగరేణి బోర్డు కీలక నిర్ణయాలు.. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే..
Also Read
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
- Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Work From Home ఇచ్చేందుకు కంపెనీలు సుముకంగాలేవా..?
ఇక, గవర్నర్ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదన్నారు బండి సంజయ్.. రాష్ట్ర ప్రభుత్వం ఏది చేస్తే దానికి రబ్బరు స్టాంప్ లా వ్యవహరించాలా? అంటూ ప్రశ్నించిన ఆయన.. టీఆర్ఎస్ ఆందోళనలో రైతులు ఎక్కడా రావడం లేదన్నారు.. దాన్యం కొనాల్సింది సీఎం కేసీఆరేనని డిమాండ్ చేశారు. మరోవైపు.. బీజేవైఎం ఆధ్వర్యంలో డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేయనున్నట్టు వెల్లడించారు.. సీఎం కేసీఆర్ సమాధానం చెప్పే వరకు వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. మా పార్టీలో ఎవరు ఉన్న కూడా పార్టీపరంగా చర్యలు తీసుకుంటాను.. ఫస్ట్ టెస్ట్లు చేయాలని సవాల్ చేశారు.. డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు ఎంత మందిపై చర్యలు తీసుకున్నావు కేసీఆర్? అని నిలదీశారు.. ఈడీకి డ్రగ్స్ రిపోర్టు ఎందుకు ఇవ్వడం లేదు.. నీ కుటుంబానికో.. నీ పార్టీ నేతలకు సంబంధం ఉంది.. కాబట్టే ఇవ్వడం లేదు అని ఆరోపించారు. అంతర్జాతీయ సంబంధాలు పెంచుకునేందుకు డ్రగ్స్ దందాకి ప్రోత్సహిస్తున్నారేమో అంటూ సెటైర్లు వేశారు. అర్థరాత్రి పబ్లకు అనుమతి ఇచ్చింది ఎవరు.. అంతా నీ కుటుంబ సభ్యులవే కదా? మొన్న ఎంత మందికి టెస్ట్ చేశారు.. ఎందరు డ్రగ్స్ తీసుకున్నారు.. ఆ కేసుకు ప్రాధాన్యత లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యుల పై విమర్శలు సరికాదు… ఏ పార్టీ అయినా సరే… డ్రగ్స్ దందాకు హైదరాబాద్ అడ్డాగా మారింది.. ఇక,చ రాష్ట్ర ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు.
తాజావార్తలు
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
PBKS Captain Shreyas Iyer: చాలా బాధగా ఉంది.. మా విజయాన్ని ఆ ‘ఒక్కడు’ లాగేసుకున్నాడు!
-
Google Free Storage: గూగుల్ షాకింగ్ డెసిషన్.. ఫ్రీ స్టోరేజ్లో భారీ మార్పు.. కొత్త అకౌంట్లకు 5GB మాత్రమే!
-
Kerala: “ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే”.. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
-
RRB ALP Recruitment 2026: 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్.. ఈ అర్హతలుండాలి
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!