Bandi Sanjay: ఎంఐఎం అత్యాచారాలు చేస్తుంది.. టీఆర్ఎస్ ఆత్మహత్యలను ప్రోత్సహిస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూబ్లీహిల్స్ అత్యాచార సంఘటన జరిగినప్పటి నుంచి ప్రభుత్వం నిందితులను కాపాడే ప్రయత్నం చేసిందని.. చట్టాన్ని కాపాడే వారే ఈ కేసును నీరుగార్చడానికి అనేక కుట్రలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ స్పందించి ఆందోళన చేస్తే ఈ మాత్రం చర్యలైనా తీసుకున్నారని ఆయన అన్నారు. మొదటి నుంచి ఈ కేసులో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతగాని తనంలో ఉన్నారని విమర్శించారు. ఫార్మ్ హౌజ్ కే పరిమితం అయ్యారని ఆరోపించారు.
రాష్ట్రంలో 15 రోజుల నుంచి రోజుకో సంఘటన జరుగుతుందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో ఏ ఘటన జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వస్తుందని.. మీడియా, సోషల్ మీడియా ద్వారానే నిజాలు బయటకు వస్తున్నాయని.. ప్రభుత్వం, పోలీసులు స్పందించే పరిస్థితి లేదని ఆరోపించారు. తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఉందా.? అని సీఎం అసలు ఉన్నాడా.? లేడా.? అని ప్రశ్నించారు. మే 28వ తేదీన సంఘటన జరిగితే 31 వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని..బీజేపీ ఆందోళన చేసిన తర్వాతే ఇద్దరిని ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారని అన్నారు.
Also Read
డీసీపీ ప్రెస్ మీట్ పెట్టి శాసనసభ్యుడికి కొడుకుకు సంబంధం లేదని అన్నాడని.. ఈ రోజు శాసన సభ్యుడిని రిమాండ్ చేశారని అన్నారు. గవర్నమెంట్ వాహనం ఉందని సీసీ ఫుటేజ్ చూస్తే తెలిసిందని.. ఇన్ని రోజులుగా వాహానాన్ని ఎందుకు సీజ్ చేయలేదని ప్రశ్నించారు. పూర్తిగా కార్ ను సర్వీసింగ్ చేయించి ఆధారాలు పోయేలా చేశారని విమర్శించారు. ఉన్నత స్థాయి వ్యక్తులను , రాజకీయ కుటుంబాలను కాపాడేందుకు పోలీసులు విజయం అయ్యారని.. ఆధారాలు దొరకనివ్వలేదని.. నిజమైన నిందితులను చివరగా చేర్చారని విమర్శించారు.
చట్ట ప్రకారం న్యాయపరంగా వ్యవహరించాల్సిన పోలీసులు భిన్నంగా వ్యవహరించారని ఆరోపించారు. రాష్ట్ర సీఎంఓ ఆదేశాల ప్రకారం కేసును నీరుగార్చారని విమర్శించారు. ఎంఐఎం అత్యాచారాలు చేస్తుందని.. టీఆర్ఎస్ హత్యలు చేస్తుందని, ఆత్మహత్యలను ప్రోత్సహిస్తుందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం ఆదేశిస్తే తప్ప పోలీసులు స్పందించే పరిస్థితి లేదని ఆయన విమర్శించారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!