Bandi Sanjay: ఎంఐఎం అత్యాచారాలు చేస్తుంది.. టీఆర్ఎస్ ఆత్మహత్యలను ప్రోత్సహిస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూబ్లీహిల్స్ అత్యాచార సంఘటన జరిగినప్పటి నుంచి ప్రభుత్వం నిందితులను కాపాడే ప్రయత్నం చేసిందని.. చట్టాన్ని కాపాడే వారే ఈ కేసును నీరుగార్చడానికి అనేక కుట్రలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ స్పందించి ఆందోళన చేస్తే ఈ మాత్రం చర్యలైనా తీసుకున్నారని ఆయన అన్నారు. మొదటి నుంచి ఈ కేసులో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతగాని తనంలో ఉన్నారని విమర్శించారు. ఫార్మ్ హౌజ్ కే పరిమితం అయ్యారని ఆరోపించారు.
రాష్ట్రంలో 15 రోజుల నుంచి రోజుకో సంఘటన జరుగుతుందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో ఏ ఘటన జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వస్తుందని.. మీడియా, సోషల్ మీడియా ద్వారానే నిజాలు బయటకు వస్తున్నాయని.. ప్రభుత్వం, పోలీసులు స్పందించే పరిస్థితి లేదని ఆరోపించారు. తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఉందా.? అని సీఎం అసలు ఉన్నాడా.? లేడా.? అని ప్రశ్నించారు. మే 28వ తేదీన సంఘటన జరిగితే 31 వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని..బీజేపీ ఆందోళన చేసిన తర్వాతే ఇద్దరిని ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారని అన్నారు.
Also Read
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం.. ఎయిర్పోర్టులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
డీసీపీ ప్రెస్ మీట్ పెట్టి శాసనసభ్యుడికి కొడుకుకు సంబంధం లేదని అన్నాడని.. ఈ రోజు శాసన సభ్యుడిని రిమాండ్ చేశారని అన్నారు. గవర్నమెంట్ వాహనం ఉందని సీసీ ఫుటేజ్ చూస్తే తెలిసిందని.. ఇన్ని రోజులుగా వాహానాన్ని ఎందుకు సీజ్ చేయలేదని ప్రశ్నించారు. పూర్తిగా కార్ ను సర్వీసింగ్ చేయించి ఆధారాలు పోయేలా చేశారని విమర్శించారు. ఉన్నత స్థాయి వ్యక్తులను , రాజకీయ కుటుంబాలను కాపాడేందుకు పోలీసులు విజయం అయ్యారని.. ఆధారాలు దొరకనివ్వలేదని.. నిజమైన నిందితులను చివరగా చేర్చారని విమర్శించారు.
చట్ట ప్రకారం న్యాయపరంగా వ్యవహరించాల్సిన పోలీసులు భిన్నంగా వ్యవహరించారని ఆరోపించారు. రాష్ట్ర సీఎంఓ ఆదేశాల ప్రకారం కేసును నీరుగార్చారని విమర్శించారు. ఎంఐఎం అత్యాచారాలు చేస్తుందని.. టీఆర్ఎస్ హత్యలు చేస్తుందని, ఆత్మహత్యలను ప్రోత్సహిస్తుందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం ఆదేశిస్తే తప్ప పోలీసులు స్పందించే పరిస్థితి లేదని ఆయన విమర్శించారు.
తాజావార్తలు
-
E20 Petrol: ఈ20 పెట్రోల్పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
-
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
-
Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
-
Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!