Chain Snatching: చైన్ స్నాచింగ్ దొంగలు అరెస్ట్.. 16 తులాల బంగారం, రెండు బైక్లు, ఒక ఆటో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balapur Police Arrested 3 Chain Snatching Thieves: హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచింగ్ దొంగలు ఎలా రెచ్చిపోతున్నారో అందరూ చూస్తూనే ఉన్నాం. ఈజీ మనీకి అలవాటు పడిన యువకులు.. చైన్ స్నాచింగ్ దొంగతనాలే పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు మరో ముఠాని కూడా పోలీసులు పట్టుకున్నారు. చైన్ స్నాచింగ్తో పాటు ఇతర దొంగతనాలకు పాల్పడుతూ.. పోలీసులకు చిక్కకుండా సవాల్ విసురుతున్న ముగ్గురు దొంగలను.. ఎట్టకేలకు బాలాపూర్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 16 తులాల బంగారం, రెండు పల్సర్ బైక్లు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Ponnam Prabhakar: అసంతృప్తిలో పొన్నం ప్రభాకర్.. కారణం అదే!
Also Read
- Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న సయ్యద్ ఖాజా, అతని బామ్మర్ది షేక్ ఆరిఫ్, మరో చిన్న బామ్మర్ది చెడు అలవాట్లకు బానిసలయ్యారు. చిల్లర పనులు చేస్తూ తిరిగే ఈ ఇద్దరు.. చైన్ స్నాచింగ్, దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. నెలకు ఒక దొంగతనం చొప్పు.. మొత్తం 21 దొంగతనాలకు వీళ్లు పాల్పడ్డారు. తరచూ కాకుండా నెలకోసారి పక్కా ప్లానింగ్తో వీళ్లు దొంగతనాలు చేస్తుండటంతో.. పోలీసులు వీరిని పసిగట్టలేకపోయారు. వీరిని పట్టుకోవడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. వీళ్లు బిస్మిల్లా కాలనీ, వెంకటాపూర్, క్యుబా కాలనీ, అబ్దుల్లా నగర్ కాలనీల్లో చోరీలు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడైతన సయ్యద్ ఖాజా తొలుత ఉదయం వేళలో రెక్కీ నిర్వహిస్తాడు. తర్వాత రాత్రి వేళల్లో తన బామ్మర్దులతో కలిసి.. దొంగతనాలకు పాల్పడుతాడు. ఇలా దొంగలించిన సొమ్మంతా ఈదీ బజార్లో ఉండే సిరాజుద్దీన్ అనే వ్యక్తికి విక్రయిస్తారు.
Extramarital Affair: భర్త ఇంట్లో ఉండగానే.. ప్రియుడ్ని ఇంటికి పిలిపించి..
మరోవైపు.. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ దొంగల్ని పట్టుకోవాలని పోలీసులు కేసుని సీరియస్గా తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే దొంగల్ని గుర్తించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్లు దొంగలించిన వస్తువుల్ని స్వాధీనం చేసుకొని, వారిని రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాలనీల్లో ప్రతి ఒక్కరు సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవాలని సూచించారు. ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానంగా కనిపిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. విలువైన వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోవాలని సలహా ఇచ్చారు.
తాజావార్తలు
-
Jaishankar: యూరప్ అహంకారంపై భారత్ దెబ్బ.. జైశంకర్ సమాధానంతో సైలెంట్..
-
Iran-US: హమ్మయ్య.. అమెరికాతో ఒప్పందానికి లైన్క్లియర్!.. ఇరాన్ కీలక ప్రకటన
-
Congress: “అఖండ కాంగ్రెస్”.. విలీనం దిశగా టీఎంసీ, ఎన్సీపీ..
-
Charu Pandey: కోచింగ్ లేదు.. బుక్స్ పట్టుకుని కూర్చోలేదు! కానీ 19 గవర్నమెంట్ జాబ్స్ కొట్టింది.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు!
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్.. మత విద్వేష వ్యాఖ్యలే కారణం..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!