AP, Telangana Rain: ఒకేసారి 2 ఆవర్తనాలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వానలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP, Telangana Rain news updates: ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు ఏపీ, తెలంగాణల్లో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం మరికొద్ది గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ కూడా ఇలాంటి హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 4 రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద హెచ్చరించారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో స్కూల్స్ కి సెలవు కలెక్టర్ సెలవు ప్రకటించింది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లా కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు అధికారులు.
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
కోస్తా ఆంధ్ర, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సోమవారం (సెప్టెంబర్ 4) తెల్లవారుజాము నుండి చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తుండగా, ఈ వర్షాలు మరో 4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని 14 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తంహ్రా ప్రాంతంలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. తెలంగాణలోనూ ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలుచోట్ల నదులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై ప్రవాహం కొనసాగుతోంది. నదులు, రిజర్వాయర్లలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. కామారెడ్డి జిల్లాలో చెరువులు రోడ్డుపై ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కడప జిల్లాలో పెన్నానది ప్రవాహంలో చిక్కుకున్న నలుగురు యువకులను అధికారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
BiggBossTelugu7: బోల్డ్ ప్రశ్నలతో షకీలాని కెలికిన టేస్టీ తేజ..తప్పు చేశానని ఫీల్ అవుతున్న శివాజీ..
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!