BRS MLA Sanjay Kumar: బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్.. హస్తం గూటికి జగిత్యాల ఎమ్మెల్యే
- ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్..
- హస్తం గూటికి జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS MLA Sanjay Kumar: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. నిన్న (ఆదివారం) రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంజయ్కుమార్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారంతో పాటు సీనియర్ నేత తనయుడు భాస్కర్రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరారు. మూడు రోజుల కిందటే సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సమక్షంలో పోచారం హస్తం పార్టీలో చేరారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే బీఆర్ఎస్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కాంగ్రెస్లో చేరారు. ముందుగా తాను సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు.
Read also: CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రెండు రోజులు అక్కడే మకాం..
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
- Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
ఇక కాంగ్రెస్ నిర్వహించిన సభలో వెంకటరావు ప్రత్యక్షమై కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్కు షాకిస్తూ బీఆర్ఎస్ని వీడిన తొలి ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు. ఆపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన్ నాగేందర్ కూడా హస్తం గూటికి వెళ్లారు. లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్, బీజేపీల్లో చేరి టిక్కెట్లు పొందారు. దాన నాగేందర్ సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కడియం శ్రీహరి, కడియం కావ్య వరంగల్కు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినప్పటికీ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. లోక్సభ ఎన్నికల్లో కడియం కావ్య విజయం సాధించారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ బీఆర్ ఎస్ కు 17 సీట్లలో ఒక్క సీటు కూడా రాకపోవడంతో కేసీఆర్ పునరాలోచనలో పడ్డారు. తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి కీలక నేతలు బీఆర్ ఎస్ ను వీడగా, తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా గులాబీ పార్టీని వీడి హస్తం పార్టీలో చేరారు.
Astrology: జూన్ 24, సోమవారం దినఫలాలు
తాజావార్తలు
-
BCCI New Rules: దేశీయ క్రికెట్లో కొత్త రూల్స్.. చివరి ఓవర్ నుంచి వైడ్ వరకు కీలక మార్పులు..!
-
CJP Protest: జంతర్ మంతర్ వీడేదిలేదు.. మరోసారి పార్లమెంట్ మార్చ్.. సీజేపీ స్పష్టమైన హెచ్చరిక
-
Astrology: జూలై 21 మంగళవారం దినఫలాలు..
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!