Allola Indrakaran Reddy: సంచలన వ్యాఖ్యలు.. దళిత బంధు మా ఇష్టం వచ్చిన వాళ్లకే ఇస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allola Indrakaran Reddy: టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కొద్దిరోజులుగా మంత్రులు, ఎమ్మెల్యేలపై ప్రజలు ప్రశ్నిస్తుండటంతో.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు రాలేదని ప్రశ్నించిన వారిపై మండిపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం కళ్యాణి లక్ష్మీ రాలేదన్న యువకుడిని పై ఎమ్మెల్యే మదసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన యువకుడ్ని లోపలై అంటూ పోలీసులకు ఆర్డర్ చేశారు. సభలో పైసలు వస్తలేదు సార్ అని ఓయువకుడు ప్రశ్నించగా? ఎమ్మెల్యే ఎందుకొస్తేలేదు ఏం మట్లాడుతున్నావ్ అంటూ సీరియస్ అయ్యారు. ఇతన్ని లోపలేయ్ అంటూ మండిపడిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పుడు అదే పరిస్థితి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి ఎదురైంది. దళిత బంధువుపై సభలో మాట్లాడుతున్న ఇంద్రకరణ్ రెడ్డిని మహిళలు ప్రశ్నలు అడుగగా సభలో నుంచి వెళ్లిపోవాలని, మాకు ఇష్టమెచ్చిన వారికి దళితబంధు పథకం ఇస్తామని మంత్రి ఇంద్రకరణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
నిర్మల్ జిల్లా నర్సాపూర్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. దళిత బందు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతుండగా సభకు హాజరైన అక్కడున్న మహిళలు తమకు దళిత బంధు ఇవ్వాలని ప్రశ్నించారు. దీంతో మంత్రి అందరికి వస్తుంది ఓపిక పట్టాలన్నారు. ఆవిధంగా అనుకుంటే కొంతమందికి దళిత బంధు వచ్చింది.. దాదాపుగా కోటి యాభైలక్షలు మంజూరు చేసామని గుర్తు చేశారు. మీకు ఓపిక లేకుంటే మేమేం చేస్తాం అన్నారు మంత్రి. బీజేపీ వాల్లతో తిరుగుతున్న వారు వాళ్లనే అడిగి తీసుకోండని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా మీరు మాకు ప్రశ్నించడం ఏంటి అందరికి వస్తుంది.. ఓపికలేని వాళ్లకు మమేం చేయలేం.. దళిత బంధు మా ఇష్టం వచ్చిన వాళ్లకే ఇస్తాం అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
సభలో ప్రశ్నించిన వారిని బయటకు తీసుకెళ్లాలని పోలీసులకు మంత్రి ఆదేశం చేశారు. మరొక మహిళ దళిత బంధు గురించి అడగటంతో.. నువ్వు ఊరికే వుండమంటూ.. ఆమెను దబాయించారు మంత్రి. ఇప్పుడు ఈవీడియో షోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మాటి మాటికి దళిత బంధువుపై ప్రశ్నలు అడుగుతున్నవారిపై సీరియస్ అయిన మంత్రి వారిని బయటకు తీసుకెళ్లండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్న వారు అలాగే ప్రశ్నలు అడుతుండటంతో.. ఆగ్రహానికి లోనైనా మంత్రి చివరకు పోలీసులకు చెప్పారు. ప్రశ్నలను అడిగే వారిని బయటకు పంపించాలని కోరడంతో.. అక్కడ కాస్త ఉద్రిక్తత నెలకొంది. దళిత బందు రాలేదని అడిగితే మా ఇష్టం వచ్చిన వాళ్లకే ఇస్తామనడం ఏంటని మండిపడ్డారు. వీల్లంతా మనుషులు కాదా కూర్చున్నోల్లు అయినా నీకు దళిత బంధువుకింద.. పదిలక్షల రూపాయలు ఇస్తే నువ్వు ఏం చేస్తావని ప్రశ్నించారు మంత్రి. రా.. ముందుకు చూపెట్టు అంటూ పిలిచారు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ అవుతుంది.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!