Palamuru – Ranga Reddy Lift Irrigation: పాలమూరు లిఫ్ట్ పనుల్లో అపశృతి.. క్రేన్ వైరు తెగి ఐదుమంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అపశృతి చోటుచేసుకున్నది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కొల్లాపూర్ మండలం ఏలూరు శివార్లలోని రేగమనగడ్డ వద్ద ప్రమాదం చోటుచేసుకున్నది. పాలమూరు-రంగారెడ్డి ప్యాకేజీ వన్లో రేగమనగడ్డ వద్ద పంపు హౌస్ను నిర్మిస్తున్న క్రమంలో కార్మికులు క్రేన్ సహాయంతో పంపు హౌస్లోకి దిగుతున్నారు. దీంతో ఒక్కసారిగా క్రేన్ వైరు తెగిపోయింది. ఆక్రైన్ దిగుతున్న కార్మికులపై పడటంతో.. దీంతో.. ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొక కార్మికునికి తీగ్రంగా గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రుడికి సమీపంలోని దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతులందరు బీహార్కు చెందిన కార్మికులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రమాదం జరిగి ఐదుగురు దుర్మరణంపాలుకావడం దిగ్భ్రాంతిని కలిగించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మృతులకుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు.
Also Read
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రమాదం జరిగి ఐదుగురు దుర్మరణంపాలుకావడం దిగ్భ్రాంతిని కలిగించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మృతులకుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.
— Revanth Reddy (@revanth_anumula) July 29, 2022
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పనుల్లో క్రేన్ ప్రమాదం జరిగి ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందడం దిగ్భ్రాంతి కలిగించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఉపాధి కోసం వేరే రాష్ట్రాలనుంచి ఇంత దూరం వచ్చి ఇక్కడ చనిపోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఆకార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేసారు. ఈ ప్రమాదం జరగడానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని బండిసంజయ్ కోరారు.
అయితే.. 2019 ఫిబ్రవరి 6న ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో 12.3 లక్షల ఎకరాలకు సాగు నీరు, వెయ్యి కి పైగా గ్రామాలకు తాగు నీరు అందించే పాలమూరు – రంగారెడ్డి ఎత్తి పోతల పథకానికి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ తుది అటవీ అనుమతులను మజూరు చేసింది. ఈనేపథ్యంలో.. రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీకి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ శ్రవణ్ కుమార్ వర్మ జనవరి 25న లేఖ రాశారు. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి నాగర్ కుర్నూల్ జిల్లా అచ్చంపేట అటవి డివిజన్ లో ఉన్న 205.4811 హెక్టార్ల అటవీ భూమిని నీటిపారుదల శాఖకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి 2017 మే నెలలో లేఖ రాసింది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధనని ఫారెస్ట్ అడ్వైసరీ కమిటీ పరిశీలించి 2018 ఏప్రిల్ నెలలో మొదటి దశ అటవీ అనుమతిని మంజూరు చేసింది. దీంతో.. కేంద్ర ప్రభుత్వం విధించిన అన్ని విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేసిన కారణంగా కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ప్రాజెక్టు కు తుది అటవీ అనుమతిని మంజూరు చేసింది.
Monkeypox: కేంద్రం అలర్ట్.. రంగంలోకి టాస్క్ఫోర్స్..!
తాజావార్తలు
-
The Earth: భూగర్భ జలాల దోపిడి.. 31.5 అంగుళాలు వంగిన భూమి!
-
CJI Surya Kant: లండన్లో సీజేఐ సూర్యకాంత్కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
-
IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Stree Ride : మహిళల కోసం ‘స్త్రీ రైడ్’.. ఇక డ్రైవర్ కూడా మహిళే..!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!