Abhiyan Employees: రెగ్యులర్ చేయండి.. సమగ్ర శిక్షా ఉద్యోగులు వినూత్న నిరసన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhiyan Employees: తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని తెలంగాణ సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులు గత 8 రోజులుగా చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. సమగ్రశిక్ష ఉద్యోగులను క్రమబద్ధికరించాలని హనుమకొండ జిల్లా ఏకాశీల పార్క్ వద్ద వినూత్న రీతిలో నిరసన దీక్ష చేపట్టారు. సమగ్ర శిక్షా ఉద్యోగులు గత 8 రోజులుగా నిరసన చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యాశాఖలో విలీనం చెయాలని డిమాండ్ చేస్తున్నారు. పోతారాజు వేషంతో, మహిళలు బోనాలతో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. చేయాలమ్మ చేయాలని అంటూ పోతురాజుల వేశధారతో వెంటనే రెగ్యులర్ చేయాలని కోరారు. కనీస కాలపరిమితిని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చి ఆచరణలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న చట్టాల అమలులో ప్రభుత్వ యంత్రాంగం ఏళ్ల తరబడి జాప్యం చేయడం సరికాదన్నారు. విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగులకు రూ.10 లక్షల జీవిత బీమా, రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలి. మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని కోరారు. సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చి ఆచరణలో పూర్తిగా విఫలమైనారని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చట్టాలు చెబుతున్న అమలులో ప్రభుత్వ యంత్రాంగం సంవత్సరాలుగా జాప్యం చేయడం సరి కాదన్నారు.
Also Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
19 ఏళ్లుగా కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా సీఆర్పీలు పనిచేస్తున్నారని, అందరికీ విద్య అందించడంలో వారి పాత్ర ముఖ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్లో సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేశారని, సహజ మరణమైతే రెండు లక్షల ఎక్స్గ్రేషియా, ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తున్నారని గుర్తు చేశారు. మృతులను ప్రభుత్వాలు ఆదుకున్న దాఖలాలు లేవని, వారి జీవితాలు అనాథలుగా మిగిలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్ట్టైమ్ ఇన్స్ట్రక్టర్లకు ఏడాదికి 10 నెలల వేతనాలు మాత్రమే ఇస్తున్నందున వారికి 12 నెలల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వృత్తి విద్యా ఉపాధ్యాయులుగా గుర్తించాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, జీవిత బీమా, ట్రావెలింగ్ అలవెన్స్తోపాటు ప్రభుత్వ పథకాలన్నీ వర్తింపజేయాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు.
Errabelli Dayakar Rao: అభయ హస్తం డబ్బులు వారం రోజుల్లో జమ చేస్తాం
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!