BJP Vijaya Sankalpa Sabha: నగరానికి కాషాయం కళ.. రెపరెపలాడుతున్న జెండాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరంలో కాషాయి జెండాలు రెపరెపలాడుతున్నాయి. జూలై 3న బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహించేందుకు భారీ ఏర్పట్లపై బీజేపీ శ్రేణులు పకడ్బందీ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ శ్రేణుల్లో పండగ వాతావరణం నెలకొంది. నగరంలో ఎక్కడ చూసిన కాషాయి జెండాలు రెపరెపలాడుతుండటంతో కార్యకర్తల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ప్రతి ఒక్కరికి పార్టీ చేరువయ్యేలా కార్యక్రమాలను శ్రీకారం చుడుతున్నారు బీజేపీ శ్రేణులు. మోదీ సభకు భారీగా జనాన్ని తరలించడానికి పార్టీ జాతీయ నాయకత్వం పకడ్బందీ వ్యూహంతో ప్రణాళికలు రూపొందించింది. ఈనేపథ్యంలో.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 10 వేల మందిని తరలించేలా కసరత్తు చేస్తున్నారు.
నగరంలో బీజేపీ నిర్వహించే జాతీయ కార్యవర్గసమావేశాలకు గురు, శుక్రవారం రెండు రోజుల పాటు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలను నిర్వహించనున్నారు. కాగా.. తెలంగాణ సంపర్క్ అభియాన్ పేరిట నిర్వహించే ఈ భేటీల్లో పాల్గొనడానికి దేశ నలుమూలల నుంచి బీజేపీ ముఖ్య నాయకులు.. కేంద్ర మంత్రులు.. కేంద్ర మాజీ మంత్రులు.. మాజీ ముఖ్యమంత్రులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. వచ్చే ఏడాది (2023)లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో.. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించి.. ముఖ్య నేతలంతా దళిత వాడలనూ సందర్శిస్తారు. ఇక రాత్రిపూట నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ కార్యకర్తల ఇళ్లల్లో ముఖ్య అతిథులు భోజనాలు చేయనున్నారు.
Also Read
- Telangana Govt: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. బకాయిల సొమ్ము రూ.6 వేల కొట్లు విడుదల..
- Metro Express: కరీంనగర్లో 'సిటీ మెట్రో ఎక్స్ప్రెస్' బస్సులు ప్రారంభం.. ఈ రూట్లల్లో అందుబాటులోకి..
- Drugs: డ్రగ్స్ సొమ్ముతో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు.. దర్యాప్తు వేగవంతం చేసిన ఈడీ..
- Anganwadi Recruitment: అంగన్వాడీ ఉద్యోగాల నియామకం.. ఆ జిల్లాలకు మంత్రి సీతక్క డెడ్లైన్..
ఈనేపథ్యంలో.. మాదాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్లోని హోటల్స్ బీజేపీ జాతీయ సమావేశాల నేపథ్యంలో కళకళలాడుతున్నాయి. నగరంలోని హోటల్స్లో 60 శాతానికి మించి రూమ్లు బుక్ అయినట్లు తెలుస్తోంది. అయితే.. ముుఖ్యంగా సమావేశాలు జరిగే నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ హోటల్లో అన్ని రూమ్లనూ మూడు రోజుల పాటు ఆ పార్టీ బుక్ చేసుకుంటే, మాదాపూర్తో పాటుగా బంజారాహిల్స్లోని కొన్ని హోటల్స్లో పెద్ద సంఖ్యలో రూమ్లను ఆ పార్టీ నేతలే బుక్ చేసుకున్నారు. అయితే.. మాదాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్లో ఉన్న స్టార్ హోటల్స్లో 60కి మించి బుకింగ్స్ జరిగాయని కొన్ని హోటల్స్ జనరల్ మేనేజర్లు అంటున్నారు.
YSRCP: వైసీపీలో వెన్నుపోట్లు..! ఎంపీ, ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
-
Rishab Shetty: రామాయణ ట్రైలర్కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
-
Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!