Mahabubnagar: మహబూబ్నగర్ కల్తీ కల్లు ఘటన.. నేడు హైకోర్టులో విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahabubnagar: మహబూబ్ నగర్ జిల్లా కల్తీ కల్లు ఘటనపై సుమోటో దాఖలైన అయిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి చెందగా, 42 మంది అస్వస్థతకు గురైన ఘటనపై అందిన లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 13న మహబూబ్ నగర్ కు చెందిన సీహెచ్ అనిల్ కుమార్ హైకోర్టుకు లేఖ రాశారు. కల్తీ కల్లు తాగి ఆశన్న, విష్ణు ప్రకాష్, రేణుక మృతి చెందారని, 42 మంది ఆస్పత్రి పాలయ్యారని లేఖలో పేర్కొన్నారు. బాధితులను మంత్రి పరామర్శించి కల్లును పరీక్షలకు పంపించి కల్తీ చేసినట్లు తేలితే విక్రయదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు వివరించారు. ఈ లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు మహబూబ్నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఎక్సైజ్ శాఖను ప్రతివాదులుగా చేర్చింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది.
Read also: Manipur: మణిపూర్లో కేంద్ర మంత్రి రంజన్ సింగ్ ఇంటిపై పెట్రో బాంబు దాడి
Also Read
- CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
- Pawan Kalyan: అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి ఇంటికే వెళ్లిన పవన్ కళ్యాణ్.. కుటుంబానికి భరోసా!
- Telangana Public School: విద్యా విప్లవానికి నాంది.. తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.!
- Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
మహబూబ్నగర్ జిల్లాలో కల్తీ కల్లు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కల్తీ కల్లు ముగ్గురు మృతి చెందగా.. సుమారు 40 మంది మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రి పాలయ్యారు. ఈ కల్తీ కల్లు ఘటన మహబూబ్నగర్ జిల్లా తాండాల్లో ప్రస్తుతం కలకలం రేపిందివ. బాధితులు పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. నోరు మెదపలేక నోరు మెదపకుండా చూస్తూ ఉండిపోయారు. బాధితుల లక్షణాలతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కల్తీ కల్లు డోస్ విపరీతంగా పెరగడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. కల్తీ కల్లులో ఏమి కలుపుతారు? అధికారులు విచారణ చేస్తున్నారు. మట్టిలో యూరియా, కుంకుమపువ్వు రసం, నిమ్మకాయ ఉప్పు, సక్కరి పొడి, బియ్యప్పిండి, రసాయనాలు కలుపుతున్నారు. ఇలాంటి పదార్థాలతో కల్తీ కల్లు ఎక్కువగా తాగితే లివర్ అబ్సెస్ రావడం ఖాయమని వైద్యులు చెబుతున్నారు. అడిక్ట్ అయ్యి సమయానికి తాగకపోతే ఫిట్స్ వస్తాయని, అదే పనిగా మతిస్థిమితం కోల్పోతారని అంటున్నారు. మెదడులో రియాక్షన్ వల్ల కోమాలోకి వెళ్లే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ కల్తీ కల్లు దందాపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. కల్తీ కల్లు నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించిన విషయం తెలిసిందే..
Adipurush Craze: పిల్లల్లో పిచ్చి క్రేజ్ తెచ్చిన ఆదిపురుష్.. థియేటర్లో జై శ్రీరామ్ అంటూ నినాదాలు
తాజావార్తలు
-
Commodore CallBack 8020: డిజిటల్ వ్యసనానికి చెక్.. 48MP కెమెరా, డ్యూయల్ డిస్ప్లేతో కమోడోర్ కాల్బ్యాక్ 8020 లాంచ్
-
AP Weather Today: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
-
CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
-
Vivo T5 Lite 5G: వివో T5 Lite 5G త్వరలో భారత్లోకి.. 6,500mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Pawan Kalyan: అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి ఇంటికే వెళ్లిన పవన్ కళ్యాణ్.. కుటుంబానికి భరోసా!
ట్రెండింగ్
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?