Missing Child: బాలిక మిస్సింగ్.. 26 గంటలు గడుస్తున్నా లభించని ఆచూకీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Missing Child: 24 గంటలు గడుస్తున్నా బాలిక మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. అసలు ఎక్కడ వుంది? ఏం చేస్తుంది?. ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు చేశారు? అనేది ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన 4వ తరగతి విద్యార్థి మిస్సింగ్ కేస్ పోలీసులకు సవాల్ గా మారింది. 24 గంటలు దాటుతున్న బాలిక ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడం పై అదృష్యమైన బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం (నిన్న) ఉదయం 9 గంటలకు స్కూలుకు వెళ్లిన బాలిక తిరిగి ఇప్పటివరకు కనిపించలేదని, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు. నిన్న ఉదయం 11 గంటలకు ఫిర్యాదు చేస్తే సాయంత్రం 6 గంటలకు పోలీసులు వచ్చారంటన్న కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. మా పాపపై ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడి ఏదైనా చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? అంటూ ప్రశ్నిస్తున్నారు.
Read also: Gunny Bags Godown Fire: గన్నీ సంచుల గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
NTV తో చిన్నారి తల్లిదండ్రులు మాట్లాడుతూ కన్నీరుపెట్టుకున్నారు. ఉదయం ఇంట్లోంచి స్కూలుకి తీసుకొని వెళ్లానని, స్కూల్లో దింపి తాను పనికి వెళ్లానని చెబుతున్నారు. ఉదయం 9.30 ప్రాంతంలో స్కూల్ సంబంధించిన టీచర్ పాప కనిపించట్లేదని ఫోన్ చేశారని అన్నారు. కంగారుపడి స్కూల్ దగ్గరకు వెళ్లామని స్కూల్లో పాప బ్యాగు మాత్రమే ఉందని వాపోయారు. పోలీసులకు చెప్పాము కానీ సరైన సమయంలో పోలీసులు స్పందించలేదని ఆరోపించారు. ఉదయం చెప్తే సాయంత్రం వరకు కూడా పోలీసులు పాప ఆచూకీ కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ 24 గంటలు దాటుతున్న ఇంకా పాప ఎక్కడ ఉందో మాకు తెలియదని, మా పాప మాకు కావాలంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. స్కూల్ లో వదిలి వెలుతున్నప్పుడు లోపలికి వెళ్లిన పాప మళ్లీ ఎక్కడకు పోతుంది. స్కూల్ యాజమాన్యం కూడా ఇలా నిర్లక్ష్యం వహించడం సరికాదని పాప క్లాస్ లోకి వెళ్లిందని బ్యాగ్ కూడా తన స్థలంలో వుందని అయితే ఆతరువాత ఎక్కడకు వెలుతుందో స్కూల్ యాజమాన్యం, క్లాస్ టీచర్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పిల్లల్ని స్కూల్ యాజమాన్యం పై వున్న నమ్మకంతో పంపిస్తే ఇలా నిర్లక్ష్యం చేసి తన పాపను దూరం చేశారని వాపోతున్నారు. వెంటనే పాప ఆచూకీ కనుగొని తనవద్దకు చేర్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే.. బాలిక ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నరు. ఇందు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సీసీ కెమెరాలో నమోదైంది. మరి పోలీసులకు సవాల్ గా మారిన పాప ఆచూకి లభించేనా?
Corona Virus: వేగంగా విస్తరిస్తున్న మహమ్మారి.. ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనం
తాజావార్తలు
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
VrushaKarma : భారీ ధర పలికిన ‘వృషకర్మ’ నైజాం థియేట్రికల్ రైట్స్
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
Huawei MateBook Pro S: హువావే మేట్బుక్ ప్రో ఎస్ విడుదల.. అత్యంత తేలికైన ల్యాప్టాప్.. Kirin XE90 ప్రాసెసర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!