NFHS : తెలంగాణలో వెజ్ తినేవారు 2.7 శాతమేనంట.. మిగితావారంతా నాన్ వెజ్ మీద పడ్డారంట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజు రోజుకు తెలంగాణలో నాన్వెజ్ తినేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే.. కరోనా ప్రభావంతో మాంసం తినేవారి సంఖ్య మరింత పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. ఆరోగ్య రీత్యా ఎక్కువగా మాంసాన్ని తినడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారనే దానికి ఈ సర్వే నిదర్శనం. అయితే.. తెలంగాణలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) డేటా ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో గతంలో కంటే ఎక్కువ మంది ప్రజలు మాంసాహారం తింటున్నారు. తెలంగాణలో కేవలం 2.7 శాతం మంది మాత్రమే శాఖాహారం తీసుకుంటున్నారని సర్వే వెల్లడించింది. రాష్ట్రంలోని జనాభాలో 73 శాతం మంది వారానికి ఒక్కసారైనా మాంసం తింటున్నారని, 4.4 శాతం మంది కోడిమాంసం, చేపలు, మాంసం మినహాయించి గుడ్లు తింటున్నారని కూడా సర్వేలో వెల్లడైంది.
Also Read : Jacqueline Fernandez: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు మధ్యంతర బెయిల్ పొడిగింపు
ఎన్ఎఫ్హెచ్ఎస్-5 2019-2021 మధ్య రెండు దశల్లో 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలలో 15-49 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 7,24,115 మంది మహిళలు, 93,144 మంది పురుషులలో సర్వే నిర్వహించారు. అయితే.. ఈ సర్వేలో మాంసాహారం తినే వారి సంఖ్య చాలా ఎక్కువగా పెరిగిందని గుర్తించారు. రాజస్థాన్, హర్యానా, గుజరాత్ మరియు పంజాబ్ నాలుగు రాష్ట్రాలు తప్ప చాలా రాష్ట్రాల్లో మెజారిటీ మాంసాన్ని వినియోగిస్తున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా చూసుకుంటే.. జనాభాలో 51 శాతం మాంసాహారం తింటున్నారని సర్వే ఫలితాల్లో వెల్లడైంది.
Also Read
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!