GHMC Hyderabad: పన్నులు కట్టకుంటే కఠిన చర్యలు.. జీహెచ్ఎంసీ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GHMC Hyderabad: హైదరాబాద్ నగరంలో పన్నుల వసూళ్లపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. పన్ను చెల్లించని ఆస్తులను జప్తు చేసేందుకు సిద్దమవుతున్నారు. పెండింగ్ బకాయిలు చెల్లించనందుకు నగరంలో 120 వాణిజ్య ఆస్తులను జప్తు చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ పన్ను వసూలు లక్ష్యం 2,100 కోట్ల ఆస్తిపన్ను కాగా ఇప్పటి వరకు 1,550 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేసింది. ఇలా పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు జీహెచ్ ఎంసీ మరింత దూకుడు పెంచి పన్ను చెల్లించని వారి ఆస్తులను జప్తు చేస్తోంది. 2024-25 సంవత్సరానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ రూ. 7,937 కోట్లు. అసెంబ్లీ బడ్జెట్లో ప్రభుత్వం రూ.1,100 కోట్లు కేటాయించింది. మిగతా నిధులకు ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీ నిధులు అడగాలని చూస్తోంది.
Read also: MP Ganeshamurthi: టికెట్ రాలేదని ఆత్మహత్య చేసుకున్న ఎంపీ..!
Also Read
ఇప్పటికే భారీగా అప్పుల పాలైన జీహెచ్ ఎంసీ ఆదాయ మార్గాలపై దృష్టి సారించింది. గత రెండు, మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించకపోవడంతో వాణిజ్య ఆస్తులకు సీల్ వేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. హయత్నగర్, గోషామహల్, కూకట్పల్లి సర్కిళ్లలోని ఆస్తులకు సీల్ వేశారు. నివాస భవనాల పన్ను చెల్లింపుదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. నగరంలో నాలుగు లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉండగా 3,500 కోట్ల బకాయిలు ఇంకా రాలేదని జీహెచ్ఎంసీ అధికారి ఒకరు తెలిపారు. ఆస్తిపన్ను, టౌన్ ప్లానింగ్ ద్వారా వచ్చే ఆదాయం రాకపోతే జీతాలు అందని పరిస్థితి నెలకొందని జీహెచ్ ఎంసీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో బల్దియా ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పన్నుల వసూళ్లు, ఆస్తిపన్ను సక్రమంగా వసూలు చేయడం, బకాయిలపై దృష్టి సారిస్తోంది. ఈ మేరకు పన్ను చెల్లించని వారి ఆస్తులను జప్తు చేస్తున్నారు.
Tragedy at Weddings: సంగారెడ్డిలో విషాదం.. పెళ్లి ఆగిపోవడంతో వరుడి తాత ఆత్మహత్య
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?