Tragedy at Weddings: సంగారెడ్డిలో విషాదం.. పెళ్లి ఆగిపోవడంతో వరుడి తాత ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy at Weddings: సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు మృతి చెందడంతో పెళ్లి ఆగిపోయింది. పెళ్లి ఆగిపోయిందనే మనస్తాపంతో వరుడి తాత ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
సంగారెడ్డి జిల్లా బాచారం గ్రామానికి చెందిన సొంగ రాము వివాహం గురువారం జరగాల్సి ఉంది. బుధవారం బంధువులు తమ కోడలిని తీసుకురావడానికి ట్రాక్టర్లో జోగిపేటకు బయలుదేరారు. ఈ ప్రమాదంలో జెట్టిగారి సంగమ్మ, రావుగారి బూదమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. ఇక మరో మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో 20 మంది తీవ్రంగా గాయపడగా వారిని జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు. అయితే కుటుంబ సభ్యులు చనిపోవడంతో పెళ్లి ఆగిపోయింది.
Also Read
Read also: Tirumala: తిరుమలలో చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు
దీంతో మనస్తాపంతో వరుడి తాత పెంటయ్య ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నెల రోజుల క్రితం ఇదే స్థలంలో జరిగిన ప్రమాదంలో బాచారం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రం రోడ్డు ప్రమాదంలో బాచారం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలు మరువకముందే అదే గ్రామానికి చెందిన మరో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అటు వరుడి, ఇటు వధువు కుటుంబాల్లోని పెళ్లిమండపాల్లో మృతదేహాలతో కన్నీరుమున్నీరవుతున్నారు.
Hyderabad: రంజాన్ మాసం.. చార్మినార్ వద్ద వ్యాపారులకు నగర సీపీ గుడ్ న్యూస్
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?