Minister KTR: మాకు అహంకారం లేదు.. తెలంగాణపై చచ్చేంత మమకారం ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లోని హైటెక్స్ లో పలు సంస్థల ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ సదస్సు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సదస్సులో హైదరాబాద్ నగర అభివృద్ధిపై బీఆర్ఎస్ విజన్ ను ఆయన వివరించారు. ఆరున్నర సంవత్సరాలు మాత్రమే మాకు సమర్థవంతంగా పనిచేసే అవకాశం దొరికింది.. ప్రజల కోసం పని చేశామన్నారు. అవతల 60 ఏళ్లు పాలన చేసిన వాళ్ళు ఉన్నారు.. ఒక వైపు ఐటీ పెరిగింది.. అదే సమయంలో వ్యవసాయం పెరిగింది.. పంజాబ్, హర్యానా రాష్ట్రాలను దాటి దేశంలో వరి ఉత్పత్తిలో తెలంగాణ స్టేట్ నెంబర్ వన్ అయ్యింది అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Read Also: Bigg Boss 7 Telugu: తారుమారైన ఓటింగ్.. టాప్ లో ఆ కంటెస్టెంట్.. ఫైనల్ కు వెళ్ళేది వాళ్లే?
Also Read
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
- Narayanpet Brutal Murder: సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటారని హామీ(వీడియో)
- Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం
- Telangana Assembly: రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల
ఒక వైపు పరిశ్రమలు పెరుగుతున్నాయి.. మరో వైపు పచ్చదనం పెరిగింది అని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలకు సంబంధం లేని అంశాలను ప్రతిపక్షాలు తీసుకువస్తున్నారు.. మాకు అహంకారం లేదు….తెలంగాణ పై చచ్చెంత మమకారం ఉంది.. మళ్ళీ అధికారంలోకి వస్తామని ఆయన చెప్పుకొచ్చారు. వచ్చిన తర్వాత నిరక్ష్యరాస్యత లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ళు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం.. అప్పు తీసుకుని ఇళ్ళు కొంటున్న మధ్య తరగతి వారికి ప్రభుత్వం తరపున సహకారం ఇవ్వడంపై కేసీఅర్ ఆలోచన చేస్తున్నారు అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Read Also: Bandi Sanjay: రైతులకు మోడీ రూ.24 వేలు ఇస్తే.. కేసీఆర్ ఇచ్చింది రూ.10 వేలు మాత్రమే
మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగర అభివృద్ధిపై కొన్ని ఆలోచనలు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. వాటిని అమలు చేస్తామన్నారు. హైదరాబాద్ లో ప్రధాన రోడ్లలో సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది.. మెట్రో రైలు స్టేషన్ల నుంచి శటిల్ సర్వీసులు తీసుకు వస్తాం.. హైదరాబాద్ లో మరిన్ని పార్క్ లను , గ్రీనరీనీ అభివృద్ధి చేస్తుంది అని ఆయన చెప్పారు. నగరంలో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ పెంచుతాం.. హైదరాబాద్ లో కాలుష్యం తగ్గించేందుకు ఈవీ వెహికిల్స్ కు ప్రాధాన్యత ఇస్తామని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో 24 గంటలు నిరంతర నీటిని ఇస్తాం.. ట్రాఫిక్ గురించి ఎక్కువగా కార్లలలో తిరిగే వారే ఫిర్యాదు చేస్తారు.. ప్రైవేట్ ట్రాన్స్ ఫోర్ట్ బలంగా ఉంటేనే హైదరాబాద్ గ్లోబల్ నగరం అవుతుంది.. వచ్చే అయిదేళ్లలో మెట్రో 250 కిలోమీటర్లు విస్తరణ చేస్తున్నాం.. మెట్రోను డబుల్ డెక్కర్ చేయాలని ఆలోచన ఉంది.. ఆ తరవాత ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో తీసుకురావాలని ఆలోచన చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
PEDDI Ki Aawaz: నమస్తే భోపాల్.. దసరా మైదాన్లో ‘పెద్ది’ దిగుతున్నాడు!
-
CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!