భారతదేశంలోని వినియోగదారుల కోసం వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్ను ప్రారంభించనున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. దీని ద్వారా వినియోగదారులు వాట్సాప్ ద్వారా నేరుగా అన్ని రకాల బిల్లులను చెల్లించుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా విద్యుత్ బిల్లు, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్, ఎల్పిజి గ్యాస్ చెల్లింపు, నీటి బిల్లు, ల్యాండ్లైన్ పోస్ట్పెయిడ్ బిల్లు, అద్దె చెల్లింపులు కూడా చెల్లించుకోవచ్చు.
నవంబర్ 2020లో భారతదేశంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా డబ్బు పంపడం, స్వీకరించడం వాట్సాప్ (WhatsApp) ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఇటీవల, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వాట్సప్ పే (WhatsApp Pay) కోసం UPI ఆన్బోర్డింగ్ పరిమితిని తొలగించింది. దీనివల్ల వాట్సప్ పే సేవలను భారతదేశంలోని అన్ని వినియోగదారులకు అందించడమే కాదు.. వాటిని మరింత విస్తరించడానికి కూడా వీలు కలిగింది.
Read Also: Komatireddy Venkat Reddy : దేశంలో మొట్ట మొదటి సారి కుల గణన చేసి దేశానికే ఆదర్శంగా నిలిచాం
వాట్సాప్ బీటా వెర్షన్లో కొత్త బిల్ చెల్లింపు ఫీచర్ గుర్తింపు
ఈ కొత్త ఫీచర్ను APK డీకోడింగ్ సమయంలో ఆండ్రాయిడ్ అథారిటీ (Android Authority) గుర్తించింది. ఈ ఫీచర్ వాట్సప్ యొక్క ఆండ్రాయిడ్ వెర్షన్ 2.25.3.15 బీటాలో కనుగొనబడింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు వాట్సప్ ద్వారా బిల్లులను చెల్లించడానికి వీలవుతుందని నివేదిక తెలిపింది. ఈ బిల్ చెల్లింపు ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నప్పటికీ.. దానిని వాట్సప్ బీటా వెర్షన్లో ఇప్పటికే ఓ ప్రాథమిక స్థాయిలో చేర్చబడింది. ఈ ఫీచర్ యొక్క విడుదల సమయాన్ని ఇంకా ప్రకటించలేదు.. కానీ ఇది భారతదేశంలో బీటా టెస్టర్లకు ముందుగా అందుబాటులో ఉండవచ్చు.
WhatsApp Payతో పోటీ
వాట్సప్ ఇప్పటికే వినియోగదారులకు UPI చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది. NPCI ద్వారా వాట్సప్ పే కు ఆన్బోర్డింగ్ పరిమితి తొలగించబడిన తర్వాత.. ఇది ఫోన్ పే, గూగుల్ పే వంటి ప్రత్యేక చెల్లింపు ప్లాట్ఫామ్లతో నేరుగా పోటీ పడగలదు. గత సంవత్సరం వాట్సప్ వినియోగదారులు అంతర్జాతీయ చెల్లింపులు చేయడానికి కూడా ఒక ఎంపికను పరీక్షించినట్లు కనిపించింది.