Jio True 5G: 5జీలో జియో దూకుడు.. లక్ష టవర్లు ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio True 5G: టెలికం రంగంలో సత్తా చాటుతూ వస్తున్న రిలయన్స్ జియో.. ఇప్పుడు 5జీ నెట్వర్క్ లోనూ దూకుడు చూపిస్తోంది.. 5జీ నెట్వర్క్ని విస్తరించేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది టవర్లను ఏర్పాటు చేయనున్న ప్లాన్లో జియో ఉంది.. మార్చి 21న భారతదేశంలోని 41 కొత్త నగరాల్లో తన హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ జియో ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది జియో.. ఇక, అక్కడ నుంచి క్రమంగా సిటీలు, టౌన్లకు విస్తరిస్తూ వస్తుంది.. అత్యంత వేగవంతమైన మరియు విశాలమైన 5G నెట్వర్క్ను ఏర్పాటు చేసే లక్ష్యంతో దేశవ్యాప్తంగా సుమారు లక్ష టెలికాం టవర్లను ఏర్పాటు చేసింది. ఈ విషయంలో జియో.. ఎయిర్టెల్ను వెనక్కి నెట్టింది. దేశంలో 5G టెలికాం టవర్లను ఏర్పాటు చేయడంలో భారతీ ఎయిర్టెల్ రెండవ స్థానంలో ఉంది. టెలికాం డిపార్ట్మెంట్ నుండి వచ్చిన తాజా డేటా ప్రకారం, టెలికాం టవర్ల ఏర్పాటులో రెండవ స్థానంలో ఉన్న కంపెనీ ఎయిర్టెల్ కంటే జియో దాదాపు ఐదు రెట్లు ముందు ఉన్నట్టు పేర్కొంది.
Read Also: RRR Storybook : ‘RRR’ కథతో జపాన్ పుస్తకం.. సినిమా చూడటం కష్టం…
Also Read
- New Smart Phone: 80W ఫాస్ట్ ఛార్జింగ్, 10,000mAh బ్యాటరీ.. మొబైల్ రంగంలో సంచలనం..
- Sodium Metal Battery Breakthrough: కేవలం 4 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. శాస్త్రవేత్తల సంచలన పరిశోధన..
- OnePlus: ఇండియాను వదిలి వెళ్లి పోతున్న వన్ ప్లస్..? క్లారిటీ..
- Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
భారతి ఎయిర్టెల్ మొత్తం 22,219 బీటీఎస్లను ఇన్స్టాల్ చేసింది. గురువారం నాటికి, జియో ప్రతి బేస్ స్టేషన్కు మూడు సెల్ యూనిట్లను కలిగి ఉండగా, ఎయిర్టెల్ రెండు సెల్ యూనిట్లను కలిగి ఉంది. ఎక్కువ టవర్లు మరియు సెల్ యూనిట్లు ఉన్నందున, ఇంటర్నెట్ వేగం ఎక్కువగా ఉంటుంది.. ఇక, ఫిబ్రవరి 28న విడుదల చేసిన నివేదిక ప్రకారం, జియో యొక్క ఇంటర్నెట్ యొక్క గరిష్ట వేగం సెకనుకు 506 మెగాబైట్లు (MBPS)తో అగ్రస్థానంలో ఉండగా.. ఎయిర్టెల్ 268 MBPS వేగంతో రెండవ స్థానంలో నిలిచింది. అంతకుముందు, మార్చి 21న రిలయన్స్ జియో తన హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ జియో ట్రూ 5Gని భారతదేశంలోని 41 కొత్త నగరాల్లో విడుదల చేసింది. ఈ కొత్త నగరాల చేరిక తర్వాత, జియో ట్రూ 5G నెట్వర్క్ ఇప్పుడు దేశంలోని 406 నగరాలకు చేరుకుంది. దేశంలోని 400 కంటే ఎక్కువ నగరాల్లో 5G నెట్వర్క్ను ప్రారంభించిన మొదటి కంపెనీగా నిలిచింది జియో. ఈ విషయంలో మిగతా టెలికాం కంపెనీలు చాలా వెనుకబడి ఉన్నాయని కంపెనీ పేర్కొంది.
తాజావార్తలు
-
NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
-
England vs India 2nd ODI: భారత్ విజయాన్ని అడ్డుకున్న జో రూట్…! కోహ్లీ, అయ్యర్ పోరాటం వృథా..
-
Astrology: జూలై 17 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!