Jio True 5G: 5జీలో జియో దూకుడు.. లక్ష టవర్లు ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio True 5G: టెలికం రంగంలో సత్తా చాటుతూ వస్తున్న రిలయన్స్ జియో.. ఇప్పుడు 5జీ నెట్వర్క్ లోనూ దూకుడు చూపిస్తోంది.. 5జీ నెట్వర్క్ని విస్తరించేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది టవర్లను ఏర్పాటు చేయనున్న ప్లాన్లో జియో ఉంది.. మార్చి 21న భారతదేశంలోని 41 కొత్త నగరాల్లో తన హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ జియో ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది జియో.. ఇక, అక్కడ నుంచి క్రమంగా సిటీలు, టౌన్లకు విస్తరిస్తూ వస్తుంది.. అత్యంత వేగవంతమైన మరియు విశాలమైన 5G నెట్వర్క్ను ఏర్పాటు చేసే లక్ష్యంతో దేశవ్యాప్తంగా సుమారు లక్ష టెలికాం టవర్లను ఏర్పాటు చేసింది. ఈ విషయంలో జియో.. ఎయిర్టెల్ను వెనక్కి నెట్టింది. దేశంలో 5G టెలికాం టవర్లను ఏర్పాటు చేయడంలో భారతీ ఎయిర్టెల్ రెండవ స్థానంలో ఉంది. టెలికాం డిపార్ట్మెంట్ నుండి వచ్చిన తాజా డేటా ప్రకారం, టెలికాం టవర్ల ఏర్పాటులో రెండవ స్థానంలో ఉన్న కంపెనీ ఎయిర్టెల్ కంటే జియో దాదాపు ఐదు రెట్లు ముందు ఉన్నట్టు పేర్కొంది.
Read Also: RRR Storybook : ‘RRR’ కథతో జపాన్ పుస్తకం.. సినిమా చూడటం కష్టం…
Also Read
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
- iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
- Google Earthquake Alert: భూకంపానికి ముందే గూగుల్ అలర్ట్.. కాంతి వేగంతో మొబైల్ స్క్రీన్లపైకి వార్నింగ్.. కానీ..
- Meta AI-Powered Smart Glasses: 3K వీడియో రికార్డింగ్, లైవ్ ట్రాన్స్లేషన్.. ఏఐ పవర్డ్ మెటా గ్లాసెస్ విడుదల
భారతి ఎయిర్టెల్ మొత్తం 22,219 బీటీఎస్లను ఇన్స్టాల్ చేసింది. గురువారం నాటికి, జియో ప్రతి బేస్ స్టేషన్కు మూడు సెల్ యూనిట్లను కలిగి ఉండగా, ఎయిర్టెల్ రెండు సెల్ యూనిట్లను కలిగి ఉంది. ఎక్కువ టవర్లు మరియు సెల్ యూనిట్లు ఉన్నందున, ఇంటర్నెట్ వేగం ఎక్కువగా ఉంటుంది.. ఇక, ఫిబ్రవరి 28న విడుదల చేసిన నివేదిక ప్రకారం, జియో యొక్క ఇంటర్నెట్ యొక్క గరిష్ట వేగం సెకనుకు 506 మెగాబైట్లు (MBPS)తో అగ్రస్థానంలో ఉండగా.. ఎయిర్టెల్ 268 MBPS వేగంతో రెండవ స్థానంలో నిలిచింది. అంతకుముందు, మార్చి 21న రిలయన్స్ జియో తన హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ జియో ట్రూ 5Gని భారతదేశంలోని 41 కొత్త నగరాల్లో విడుదల చేసింది. ఈ కొత్త నగరాల చేరిక తర్వాత, జియో ట్రూ 5G నెట్వర్క్ ఇప్పుడు దేశంలోని 406 నగరాలకు చేరుకుంది. దేశంలోని 400 కంటే ఎక్కువ నగరాల్లో 5G నెట్వర్క్ను ప్రారంభించిన మొదటి కంపెనీగా నిలిచింది జియో. ఈ విషయంలో మిగతా టెలికాం కంపెనీలు చాలా వెనుకబడి ఉన్నాయని కంపెనీ పేర్కొంది.
తాజావార్తలు
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!