Jio True 5G: 5జీలో జియో దూకుడు.. లక్ష టవర్లు ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio True 5G: టెలికం రంగంలో సత్తా చాటుతూ వస్తున్న రిలయన్స్ జియో.. ఇప్పుడు 5జీ నెట్వర్క్ లోనూ దూకుడు చూపిస్తోంది.. 5జీ నెట్వర్క్ని విస్తరించేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది టవర్లను ఏర్పాటు చేయనున్న ప్లాన్లో జియో ఉంది.. మార్చి 21న భారతదేశంలోని 41 కొత్త నగరాల్లో తన హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ జియో ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది జియో.. ఇక, అక్కడ నుంచి క్రమంగా సిటీలు, టౌన్లకు విస్తరిస్తూ వస్తుంది.. అత్యంత వేగవంతమైన మరియు విశాలమైన 5G నెట్వర్క్ను ఏర్పాటు చేసే లక్ష్యంతో దేశవ్యాప్తంగా సుమారు లక్ష టెలికాం టవర్లను ఏర్పాటు చేసింది. ఈ విషయంలో జియో.. ఎయిర్టెల్ను వెనక్కి నెట్టింది. దేశంలో 5G టెలికాం టవర్లను ఏర్పాటు చేయడంలో భారతీ ఎయిర్టెల్ రెండవ స్థానంలో ఉంది. టెలికాం డిపార్ట్మెంట్ నుండి వచ్చిన తాజా డేటా ప్రకారం, టెలికాం టవర్ల ఏర్పాటులో రెండవ స్థానంలో ఉన్న కంపెనీ ఎయిర్టెల్ కంటే జియో దాదాపు ఐదు రెట్లు ముందు ఉన్నట్టు పేర్కొంది.
Read Also: RRR Storybook : ‘RRR’ కథతో జపాన్ పుస్తకం.. సినిమా చూడటం కష్టం…
Also Read
- Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
- iQOO 15T: ఐకూ 15T వచ్చేస్తోంది.. 200MP ప్రధాన కెమెరా, 8000mAh బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లు
- 600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
- Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్లో మెసేజ్ పంపొచ్చు!
భారతి ఎయిర్టెల్ మొత్తం 22,219 బీటీఎస్లను ఇన్స్టాల్ చేసింది. గురువారం నాటికి, జియో ప్రతి బేస్ స్టేషన్కు మూడు సెల్ యూనిట్లను కలిగి ఉండగా, ఎయిర్టెల్ రెండు సెల్ యూనిట్లను కలిగి ఉంది. ఎక్కువ టవర్లు మరియు సెల్ యూనిట్లు ఉన్నందున, ఇంటర్నెట్ వేగం ఎక్కువగా ఉంటుంది.. ఇక, ఫిబ్రవరి 28న విడుదల చేసిన నివేదిక ప్రకారం, జియో యొక్క ఇంటర్నెట్ యొక్క గరిష్ట వేగం సెకనుకు 506 మెగాబైట్లు (MBPS)తో అగ్రస్థానంలో ఉండగా.. ఎయిర్టెల్ 268 MBPS వేగంతో రెండవ స్థానంలో నిలిచింది. అంతకుముందు, మార్చి 21న రిలయన్స్ జియో తన హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ జియో ట్రూ 5Gని భారతదేశంలోని 41 కొత్త నగరాల్లో విడుదల చేసింది. ఈ కొత్త నగరాల చేరిక తర్వాత, జియో ట్రూ 5G నెట్వర్క్ ఇప్పుడు దేశంలోని 406 నగరాలకు చేరుకుంది. దేశంలోని 400 కంటే ఎక్కువ నగరాల్లో 5G నెట్వర్క్ను ప్రారంభించిన మొదటి కంపెనీగా నిలిచింది జియో. ఈ విషయంలో మిగతా టెలికాం కంపెనీలు చాలా వెనుకబడి ఉన్నాయని కంపెనీ పేర్కొంది.
తాజావార్తలు
-
Satish Kilaru: ‘పెద్ది’లో సుకుమార్ ఇన్వాల్వ్మెంట్..? లాస్ట్ డే డైరెక్టర్ బుచ్చిబాబు చాలా ఎమోషనల్ అయ్యారు!
-
AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
-
PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
-
Taiwan: ‘‘మేము చైనా బానిసలం కాదు’’.. ట్రంప్ ప్రకటనపై తైవాన్ ఆగ్రహం..
-
Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. ‘పెద్ది’ షూటింగ్లో చరణ్కు ఏమైందో చెప్పిన నిర్మాత!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..