TRAI: మొబైల్ నెట్వర్క్ లో అంతరాయం ఏర్పడితే..వినియోగదారులకు పరిహారం!
- మొబైల్ లేదా బ్రాడ్బ్యాండ్ సేవను ఉపయోగించే కస్టమర్లకు శుభవార్త
- ట్రై కొత్త నిబంధనలు
- 24 గంటల కంటే ఎక్కువ సేవలకు అంతరాయం కలిగితే నష్టపరిహారం
- ఆరు నెలల తర్వాత అమల్లోకి కొత్త నిబంధనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొబైల్ లేదా బ్రాడ్బ్యాండ్ సేవను ఉపయోగించే కస్టమర్లకు శుభవార్త. ఇప్పుడు టెలికాం సేవలను (మొబైల్, బ్రాడ్బ్యాండ్) నిలిపివేసేందుకు కంపెనీ వినియోగదారులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కస్టమర్ల ప్రయోజనాల కోసం కొత్త నిబంధనను అమలు చేయబోతోంది. శుక్రవారం ట్రై జారీ చేసిన కొత్త సేవా నాణ్యత నిబంధనల ప్రకారం.. టెలికాం ఆపరేటర్లు జిల్లా స్థాయిలో 24 గంటల కంటే ఎక్కువ సేవలకు అంతరాయం కలిగితే వినియోగదారులకు పరిహారం చెల్లించాలి.
READ MORE: Priyadarshi: ప్రియదర్శి హీరోయిన్ గా నిహారిక?
Also Read
- Lava Virat V1 Pro 5G: లావా విరాట్ V1 ప్రో 5G రిలీజ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ.. ధర, ఫీచర్లు ఇవే
- 43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
- 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
- Vivo X500 Series: సెప్టెంబర్లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
ఈ కొత్త నిబంధనల ప్రకారం ప్రతి నాణ్యత బెంచ్మార్క్ను అందుకోలేకపోయినందుకు జరిమానా మొత్తాన్ని రూ. 50,000 నుంచి రూ. 1 లక్షకు పెంచింది. ఆరు నెలల తర్వాత కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. రెగ్యులేటర్ సవరించిన నిబంధనల ప్రకారం వివిధ ప్రమాణాల ఉల్లంఘనలకు రూ. 1 లక్ష, రూ. 2 లక్షల జరిమానాలు విధించింది. 5 లక్షల 10 లక్షల గ్రేడెడ్ పెనాల్టీ విధానాన్ని ప్రవేశపెట్టారు.
READ MORE:Mahesh babu : మహేశ్ సినిమాల రీరిలిజ్ క్రేజ్ మామూలుగా లేదుగా..
కొత్త నియమాలు మూడు వేర్వేరు నిబంధనలను భర్తీ చేస్తాయి. ప్రాథమిక, సెల్యులార్ మొబైల్ సేవలు, బ్రాడ్బ్యాండ్ సేవలు, బ్రాడ్బ్యాండ్ వైర్లెస్ సేవల కోసం క్వాలిటీ ఆఫ్ సర్వీస్ (QoS)ను ఏర్పాటు చేసింది. జిల్లాలో నెట్వర్క్ అంతరాయం ఏర్పడితే, టెలికాం ఆపరేటర్లు పోస్ట్పెయిడ్ కస్టమర్లకు ఛార్జీల రాయితీలను అందించాలి. ప్రీపెయిడ్ కస్టమర్లకు చెల్లుబాటును పొడిగించాలి. రోజులో 12 గంటల కంటే ఎక్కువ నెట్వర్క్ అంతరాయాన్ని ఒక పూర్తి రోజుగా లెక్కిస్తుంది. 24 గంటల కంటే ఎక్కువ సమయం అంతరాయం ఏర్పడితే.. పోస్ట్పెయిడ్ కస్టమర్కు ఛార్జీల రాయితీ, ప్రీపెయిడ్ కస్టమర్కు చెల్లుబాటు పొడిగించాలి. కాగా ఈ నిబంధనలు ఆరు నెలల తర్వాత కొత్త అమల్లోకి వస్తాయని తెలిపారు.
తాజావార్తలు
-
Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
-
Telangana High Court : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్పై స్టే ఎత్తివేత.. కానీ..!
-
CM Revanth Reddy : ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దెబ్బ.. పార్లమెంట్లో పంచాయితీ ఖాయం
-
Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
-
CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!