TRAI: మొబైల్ నెట్వర్క్ లో అంతరాయం ఏర్పడితే..వినియోగదారులకు పరిహారం!
- మొబైల్ లేదా బ్రాడ్బ్యాండ్ సేవను ఉపయోగించే కస్టమర్లకు శుభవార్త
- ట్రై కొత్త నిబంధనలు
- 24 గంటల కంటే ఎక్కువ సేవలకు అంతరాయం కలిగితే నష్టపరిహారం
- ఆరు నెలల తర్వాత అమల్లోకి కొత్త నిబంధనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొబైల్ లేదా బ్రాడ్బ్యాండ్ సేవను ఉపయోగించే కస్టమర్లకు శుభవార్త. ఇప్పుడు టెలికాం సేవలను (మొబైల్, బ్రాడ్బ్యాండ్) నిలిపివేసేందుకు కంపెనీ వినియోగదారులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కస్టమర్ల ప్రయోజనాల కోసం కొత్త నిబంధనను అమలు చేయబోతోంది. శుక్రవారం ట్రై జారీ చేసిన కొత్త సేవా నాణ్యత నిబంధనల ప్రకారం.. టెలికాం ఆపరేటర్లు జిల్లా స్థాయిలో 24 గంటల కంటే ఎక్కువ సేవలకు అంతరాయం కలిగితే వినియోగదారులకు పరిహారం చెల్లించాలి.
READ MORE: Priyadarshi: ప్రియదర్శి హీరోయిన్ గా నిహారిక?
Also Read
- Google Mapsలో సూపర్ అప్డేట్.. హోటల్ బుకింగ్ నుంచి ఫుడ్ ఆర్డర్ వరకు అన్నీ ఒకేచోట
- 7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
- Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్తో కొత్త స్మార్ట్ టీవీ
- Nothing Phone 3: నథింగ్ Phone 3 పై భారీ డిస్కౌంట్.. రూ.40,000 తగ్గింపు, 50MP ట్రిపుల్ కెమెరాలు, Snapdragon 8s Gen 4!
ఈ కొత్త నిబంధనల ప్రకారం ప్రతి నాణ్యత బెంచ్మార్క్ను అందుకోలేకపోయినందుకు జరిమానా మొత్తాన్ని రూ. 50,000 నుంచి రూ. 1 లక్షకు పెంచింది. ఆరు నెలల తర్వాత కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. రెగ్యులేటర్ సవరించిన నిబంధనల ప్రకారం వివిధ ప్రమాణాల ఉల్లంఘనలకు రూ. 1 లక్ష, రూ. 2 లక్షల జరిమానాలు విధించింది. 5 లక్షల 10 లక్షల గ్రేడెడ్ పెనాల్టీ విధానాన్ని ప్రవేశపెట్టారు.
READ MORE:Mahesh babu : మహేశ్ సినిమాల రీరిలిజ్ క్రేజ్ మామూలుగా లేదుగా..
కొత్త నియమాలు మూడు వేర్వేరు నిబంధనలను భర్తీ చేస్తాయి. ప్రాథమిక, సెల్యులార్ మొబైల్ సేవలు, బ్రాడ్బ్యాండ్ సేవలు, బ్రాడ్బ్యాండ్ వైర్లెస్ సేవల కోసం క్వాలిటీ ఆఫ్ సర్వీస్ (QoS)ను ఏర్పాటు చేసింది. జిల్లాలో నెట్వర్క్ అంతరాయం ఏర్పడితే, టెలికాం ఆపరేటర్లు పోస్ట్పెయిడ్ కస్టమర్లకు ఛార్జీల రాయితీలను అందించాలి. ప్రీపెయిడ్ కస్టమర్లకు చెల్లుబాటును పొడిగించాలి. రోజులో 12 గంటల కంటే ఎక్కువ నెట్వర్క్ అంతరాయాన్ని ఒక పూర్తి రోజుగా లెక్కిస్తుంది. 24 గంటల కంటే ఎక్కువ సమయం అంతరాయం ఏర్పడితే.. పోస్ట్పెయిడ్ కస్టమర్కు ఛార్జీల రాయితీ, ప్రీపెయిడ్ కస్టమర్కు చెల్లుబాటు పొడిగించాలి. కాగా ఈ నిబంధనలు ఆరు నెలల తర్వాత కొత్త అమల్లోకి వస్తాయని తెలిపారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!