Bharatiya Antariksh Station : 2028 నాటికి భారత అంతరిక్ష కేంద్రం!
- 2028 నాటికి భారత అంతరిక్ష కేంద్రం
- ఇస్రో లాటరీ.. చంద్రయాన్-4తో పాటు మూడు భారీ ప్రాజెక్టులకు ఆమోదం!
- అందులో మొట్టమొదటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రోత్సాహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2028 నాటికి భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఈ మేరుక ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ గతంలో కూడా వెల్లడించారు. భారతీయ విజ్ఞాన సమ్మేళన్లో పాల్గొన్న ఆయన ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఇస్రోకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఇందులో చంద్రయాన్-4, వీనస్ మిషన్, ఇండియన్ స్పేస్ స్టేషన్, తదుపరి తరం ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేయడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. ఇస్రో ఇప్పటికే చంద్రుడిపైకి మూడు మిషన్లను పంపింది. చంద్రయాన్ 3 చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్, రోవర్ను విజయవంతంగా దింపింది. దీంతో పాటు వీనస్ మిషన్కు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఇస్రో వీటికి సంబంధించిన పనులను ప్రారంభించనుంది.
READ MORE: Kolkata: వైద్యురాలి హత్యాచార కేసులో బెంగాల్ పోలీసులపై సీబీఐ సంచలన ఆరోపణలు
Also Read
- iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
- SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
ఇదిలా ఉండగా.. సోమనాథ్ గతంలో మాట్లాడుతూ.. “ప్రస్తుతమున్న లాంఛర్ సామర్థ్యాలతోనే 2028 కల్లా మన దేశ తొలి అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని భావిస్తున్నాం. ఇతర దేశాలు, సంస్థలు ప్రయోగాలు నిర్వహించేందుకు వీలుగా దాన్ని ప్రయోగశాలగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం.” అని పేర్కొన్నారు. ఆర్థిక కార్యకలాపాలకు అంతరిక్ష కేంద్రం దోహదపడేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అంతరిక్షంలో రెండు స్పేస్ స్టేషన్లు ఉన్నాయి. మొదటిది అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ ఇక్కడికి వచ్చి పరిశోధనలు చేస్తున్నారు. రెండవ స్టేషన్ చైనాకు చెందిన చెందినది. త్వరలో భారత్ కి కూడా అంతరిక్ష కేంద్రం ఉంటుంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!