Kolkata: వైద్యురాలి హత్యాచార కేసులో బెంగాల్ పోలీసులపై సీబీఐ సంచలన ఆరోపణలు
- వైద్యురాలి హత్యాచార కేసులో బెంగాల్ పోలీసులపై సీబీఐ సంచలన ఆరోపణలు
- కీలక ఆధారాలు నాశనం అయ్యేలా చేశారని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటన తర్వాత పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చోటుచేసుకున్నాయి. ఇక ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేస్తోంది. అంతకముందు కేసు దర్యాప్తును కోల్కతా హైకోర్టు.. సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం కేంద్ర సంస్థ దర్యాప్తు చేస్తోంది. అయితే సీబీఐ తాజాగా బెంగాల్ పోలీసులపై సంచలన ఆరోపణలు చేసింది. ఘటనాస్థలిలో కీలక ఆధారాలు నాశనం అవ్వడం.. హత్యాచారం జరిగిన తర్వాత నిందితుడికి సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకోవడంలో బెంగాల్ పోలీసులు ఆలస్యం చేశారని సీబీఐ ఆరోపించింది.
ఇది కూడా చదవండి: BC Janardhan Reddy: నితిన్ గడ్కరీతో మంత్రి జనార్దన్రెడ్డి భేటీ.. ఏపీకి అదనపు నిధులు..!
Also Read
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
- Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్పై విడుదల
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
ఆగస్టు 9న ఆర్ జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలు అత్యంత క్రూరంగా హత్యాచారానికి గురైంది. తొలుత ఈ కేసును బెంగాల్ పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే పోలీసుల విచారణపై అనుమానాలు వ్యక్తమవడంతో కోల్కతా హైకోర్టు.. కేసును సీబీఐకి బదిలీ చేసింది. ఇక వైద్యురాలిపై అఘాయిత్యం జరిగిన రెండు రోజుల తర్వాత నిందితుడు సంజయ్రాయ్ దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఒకవేళ వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని ఉంటే సాక్ష్యాధారాలు దొరికే అవకాశం ఉండేదని తెలిపింది. కీలక ఆధారాలు నాశనం చేసే ఉద్దేశంతోనే పోలీసులు విచారణ చేపట్టారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది.
ఇక ఈ కేసులో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. పాలిగ్రాఫ్ టెస్ట్, వాయిస్ అనాలిసిన్ నిర్వహించారు. కీలకమైన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని సీబీఐ అధికారులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Bhatti Vikramarka: మిగిలిన రాష్ట్రాల కంటే అద్భుతమైన MSME పాలసీ మనది
ఇదిలా ఉంటే వైద్యురాలికి న్యాయం చేయాలంటూ వైద్యులు ఇంకా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇక నెల రోజులుగా వైద్య సేవలు కుంటిపడడంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. జూనియర్ డాక్టర్లు చర్చలు జరిపారు. ఐదు డిమాండ్లకు.. మూడింటికి బెంగాల్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయినా కూడా డాక్టర్లు నిరసనలు కొనసాగిస్తున్నారు. మరోసారి సీఎం మమతతో చర్చలకు డాక్టర్లు సిద్ధపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Jani Master: జానీ మాస్టర్ లవ్ జీహాద్.. బీజేపీ నేత సంచలనం!!
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?