AI- Jobs Loss: ఏఐతో ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన.. ఉద్యోగాలు పోతాయనే భయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI- Jobs Loss: సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఎంతో విఫ్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. ఏఐతో సాఫ్ట్ వేర్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఏఐ రాకతో సాఫ్ట్ వేర్ కొంత పుంతలు తొక్కడమే కాదు.. కొత్తగా ఉద్యోగాలను పీకేయడం కూడా చేస్తుందని టెక్కిలు ఆందోళన చెందుతున్నారు. ఏఐతో చివరికి మీడియా రంగంలో మనిషి లేకుండానే వార్తలు చదివించే పరిస్థితి ఏర్పడుతోంది. ఏఐతో సాధారణ మనుషులతోపాటు.. సెలబ్రెటీలను కూడా వారు ఏ రూపంలో ఉండాలో.. ఏ రూపంలో ఎలా ఉంటారో స్పష్టంగా చూపుతోంది ఏఐ. అయితే ఏఐతో ఎంత ఉపయోగం ఉందో.. అంతే నష్టం కూడా ఉందంటున్నారు కొందరు. సాఫ్ వేర్ ఉద్యోగుల్లో జీనియస్ కన్సల్టెంట్స్ సంస్థ సర్వే నిర్వహించింది. ఎక్కువ మంది ఉద్యోగులు ఏఐతో తమ ఉద్యోగాలు పోతాయని ఆందోళనలో ఉన్నారని సంస్థ తన నివేదికలో వెల్లడించింది.
Read also: Skull Found: మానవులకు భిన్నంగా చైనాలో పుర్రె.. కలవరపడుతోనున్న సైంటిస్టులు
Also Read
- 8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
- Claude for Legal: న్యాయ వ్యవస్థలోకి ఏఐ ఎంట్రీ!! లాయర్ల కోసం 'క్లాడ్ ఫర్ లీగల్'ను ఆవిష్కరించిన ఆంత్రోపిక్
- 48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
- Smartphone Price Hike: స్మార్ట్ఫోన్ ప్రియులకు ‘షాక్’.. విపరీతంగా పెరుగుతున్న మొబైల్ ధరలు.. కారణం ఇదే!
ఏఐతో ఉద్యోగాలు పోతాయని కొందరు అంటుండగా.. మరికొందరు మాత్రం ఉద్యోగాలకు ఎలాంటి ముప్పు ఉండదని చెబుతున్నారు. కానీ మెజారిటీ ఉద్యోగుల్లో మాత్రం ఏఐ పట్ల భయాందోళనలు ఉన్నాయనేది వాస్తవం. ఏఐ ఉద్యోగుల స్థానాన్ని భర్తీ చేయగలవనే అభిప్రాయాన్ని ఉద్యోగులు వ్యక్తంచేస్తున్నారు. జీనియస్ కన్సల్టెంట్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం స్పష్టంగా వెల్లడయింది. ప్రధానంగా కంటెంట్ క్రియేషన్, కోడింగ్, డిజైనింగ్ రంగాల్లో ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని సర్వే ద్వారా తెలుస్తోంది. మే 15 నుంచి జూన్ 24 మధ్య తేదీల్లో భిన్న పరిశ్రమల్లో పనిచేస్తున్న 1,207 మంది ఉద్యోగులపై జీనియస్ కన్సల్టెంట్స్ ఆన్లైన్ సర్వేను నిర్వహించింది. సర్వేలో ఉద్యోగాలతో పాటు పలు ఆసక్తికరమైన విషయాలను ఉద్యోగులు వెల్లడించారు. 50 శాతం మంది చాట్ జీపీటీ, ఏఐ ప్లాట్ఫామ్లను ఒక వరంలా భావిస్తున్నట్టు సర్వేలో తేలింది. మరో 25 శాతం మంది మాత్రం అధికంగా వాటిపై ఆధారపడడంతో మానవ సంబంధాలు తగ్గిపోవటం, భద్రతాపరమైన ఆందోళనలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేసినట్టు సర్వేలో పేర్కొన్నది.
సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 47 శాతం మంది ఉద్యోగులు చాట్జీపీటీని వినియోగిస్తుండగా.. 44 శాతం మంది మాత్రం దీన్ని వినియోగించటం లేదట. దీనిబట్టి మెజారిటీ వ్యక్తులు చాట్జీపీటీని అందిపుచ్చుకుంటున్నారని సర్వేలో తేలింది. 67 శాతం మంది ఉద్యోగులు ఏఐ ద్వారా ఒకే పని రెండు సార్లు చేయకుండా.. పని భారాన్ని తగ్గిస్తాయని.. తప్పులు రాకుండా సహాయపడతాయని అభిప్రాయపడ్డారు. 65 శాతం మంది ఏఐ రాకతో ఆశాజనకంగా ఉన్నారు. ఏఐ రాకతో కొత్త తరహా ఉద్యోగాలు పెరగటంతో పాటూ ఉత్పాదకత పెరుగుతుందని సర్వేలో పాల్గొన్న ఉద్యోగులు చెప్పినట్టు సర్వే నివేదికలో సంస్థ ప్రకటించింది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!