CERT Notes on The Microsoft Outage: భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) కీలక సూచన..
- మైక్రోసాఫ్ట్ సాంకేతిక లోపంపై దృష్టి సారించిన ప్రభుత్వం
- ప్రభుత్వ వర్గాలకు అవగాహన కల్పించినట్లు వెల్లడి
- మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సమస్యపై భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కీలక సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్లో సాంకేతిక సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా గందరగోళం నెలకొంది.. భారత్, అమెరికా సహా ప్రపంచంలోని పలు దేశాల్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. భారతదేశంలో, ఢిల్లీ, ముంబై మరియు బెంగళూరు విమానాశ్రయాలలో విమానాలు షెడ్యూల్ కంటే ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ సాంకేతిక సమస్యల తర్వాత భారత ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ను సంప్రదించింది. అనేక దేశాల ప్రభుత్వాలు అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేశాయి.
READ MORE: Himanta Biswa Sarma: 2041 నాటికి ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా అస్సాం.. సీఎం ఆందోళన..
Also Read
- Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
- Public Charging: రైల్వే స్టేషన్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? జర జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!
- Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
- Vivo X300e: వివో X300e.. 7200mAh బ్యాటరీ, Snapdragon 8 Gen 5 చిప్, 50MP ZEISS కెమెరాతో కొత్త ఫ్లాగ్షిప్
ఈ సాంకేతిక లోపంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ.. మైక్రోసాఫ్ట్ అంతరాయంపై అవగాహన కల్పించినట్లు నివేదించింది. దీనికి సంబంధించి ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సలహాలను జారీ చేసింది. మైక్రోసాఫ్ట్ 365ని కోట్లాది మంది భారతీయులు ఉపయోగిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఈ సాంకేతిక లోపాల కారణంగా చాలా కంపెనీల పనితీరు పెద్ద ఎత్తున ప్రభావితమవుతున్నాయి.. మైక్రోసాఫ్ట్ త్వరలో సేవలను పునరుద్ధరిస్తుందని ఆయన పేర్కొన్నారు.
READ MORE:Friday Releases: ఈ వారం వచ్చిన సినిమాల్లో ఏ సినిమా ఎలా ఉందంటే?
మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సమస్యపై భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) కీలక సూచనలు చేసింది. క్రౌడ్ స్ట్రైక్ ఏజెంట్ ఫాల్కన్ సెన్సార్కు సంబంధించిన విండోస్ హోస్ట్లు ఉత్పత్తిలో ఇటీవలి అప్డేట్ అందుకోవడం వల్ల అంతరాయాలు, క్రాష్ అవుతున్నాయని నివేదించింది. సంబంధిత విండోస్ హోస్ట్లు ఫాల్కన్ సెన్సార్కు సంబంధించిన బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD)ని ఎదుర్కొంటున్నాయని సీఈఆర్టీ తన సలహాలో తెలిపింది. సేఫ్ మోడ్లో విండోస్ బూట్ చేయాలని తెలిపింది. అనంతరం క్రౌడ్ స్ట్రైక్ డైరెక్టరీకి వెళ్లి బగ్ ఉన్న ఫైల్ డిలీట్ చేయాల్సిందిగా సూచించింది. ఆ తర్వాత నార్మల్గా బూట్ చేయాలని వెల్లడించింది.
తాజావార్తలు
-
Rahul Gandhi: సీజేపీ నిరసనలపై స్పందించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?
-
NBK 111 : షూటింగ్ లో బాలయ్య కు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు
-
Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
CJP Protest: “4 గంటల సమయం దండగ”.. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!