ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఆరాంఘర్ - జూ పార్క్ ఫ్లైఓవర్ను ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ 6 లైన్లతో.. 4 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. రూ.799 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తయింది. ఈ ఫ్లైఓవర్ నగరంలోని పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ తర్వాత అత్యంత పెద్దదిగా నిలుస్తుంది.