వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. నాపై తెరచాటు రాజకీయం చేయడం కాదు.. జూనియర్ ఆర్టిస్టులతో మాట్లాడించడం కాదు.. నీకు దమ్ముంటే ప్రెస్మీట్ పెట్టి.. నాపై మాట్లాడు.. నాపై విమర్శలు చేయి.. నన్ను ప్రశ్నించు అంటూ ప్రతీ సమావేశంలోనూ సవాల్ చేస్తూ వస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే ఘన విజయం అన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. కోడ్ వచ్చిన తర్వాత ఈసీ ఏ పార్టీ మీద ఎక్కువ కేసులు ఉన్నాయో చూడండి.. వైసీపీకి ఎక్కువగా ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీసులు వస్తున్నాయి.. కేసులు బుక్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే మాదే విజయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మను క్రాంతి రెడ్డిని వైసీపీ లోకి ఆహ్వానించామని వైసీపీ లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి తెలిపారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. క్రాంతి రెడ్డి అందుకు అంగీకారం తెలిపారని.. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరుతారని చెప్పుకొచ్చారు. మను క్రాంత్ రెడ్డి హోదా .అనుభవానికి తగినట్టుగా పార్టీలో మంచి స్థానాన్ని కల్పిస్తామని., ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ఆయన రాజకీయ భవితవ్యం పై మంచి నిర్ణయం తీసుకుంటాం అన్ని చెప్పుకొచ్చారు.…
సిద్ధం అంటూ తాను చేసిన ట్వీట్ పై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు క్లారిటీ ఇచ్చారు. ‘పవన్ అన్నను సీఎం చేయడానికి సిద్ధం.. కలిసి సాధిద్దామని ట్విట్టర్ (ఎక్స్)లో ట్వీట్ చేశారు.
ఏపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, వైసీపీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తుకుంటూ పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు. ఎలక్షన్ కోడ్ పరిధి దాటి వ్యవహరిస్తున్నారంటూ రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసుకుంటున్నాయి.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలు లేరు గళం మాత్రం ఉందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. నేను పెద్ద ముదురు అని చంద్రబాబు అంటున్నారు.. చంద్రబాబు కంటే ప్రజలకు మేలు చేయడంలో.. రైతులకు మేలు చేయడంలో నేను ముదురన్నారు.
మేమంత సిద్ధం సభ జనసముద్రంగా మారిందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సిద్ధం సిద్ధం అంటూ ప్రజల నినాదాలు వైసీసీ జైత్రయాత్రకు శంఖారావంలా వినిపిస్తున్నాయి.. ప్రజలు చేస్తున్న సిద్ధం సిద్ధం అనే నినాదం ప్రతిపక్షాలకు యుద్ధం యుద్ధం అన్నట్లు ఉంది.
వాలంటీర్లు అనే వారు లేరు.. ఇప్పుడు వారంతా పార్టీ కార్యకర్తలే అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వాలంటీర్లు అంతా రిజైన్ చేసారు.. గతంలో కూడా పార్టీ ఆశయాలు నమ్మే కుటుంబం నుంచి వచ్చినవారే .. టీడీపీ ఎన్ని అవమానాలు చేసిన ఐదేళ్లు నిలబడి పని చేశారు.. అప్పుడు ఓ మాట.. ఇప్పుడో మాట చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు.