తూర్పుగోదావరి జిల్లాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది… హోంశాఖ మంత్రి తానేటి వనితకు తన సొంత ఇలాకాలో చేదు అనుభవం ఎదురైంది… ఆమె సొంత నియోజకవర్గం కొవ్వూరులో అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది… అసలు వైసీపీ అభ్యర్థులు పోటీలో కనిపించకుండా పోవడం చర్చగా మారింది.. మొత్తంగా.. 11 డైరక్టర్ స్థానాలు ఏకగ్రీవంగా గెలుచుకున్నారు టీడీపీ అభ్యర్థులు… ఆ పార్టీ నేత మద్దిపట్ల శివరామకృష్ణను చైర్మన్గా ఎన్నుకున్నారు డైరెక్టర్లు.. దీంతో,…
నవరత్నాలే హామీలుగా అధికారంలోకి వచ్చిన జగన్.. ఆర్థిక కష్టాలు ఉన్నా.. తుచ తప్పకుండా స్కీముల అమలు చేస్తున్నారు. సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. అభివృద్ధి సంగతేంటనే విమర్శలు వచ్చినా.. బిల్డింగులు కాదు.. మానవాభివృద్ధే అసలు అభివృద్ధి అనే నినాదం ఎత్తుకున్నారు జగన్. ఏపీ లోటు బడ్జెట్ కు, జగన్ ఇచ్చిన హామీలకు పొంతన లేదన్న అభిప్రాయాల మధ్య జగన్ పాలన మొదలైంది. గత ప్రభుత్వాలకు భిన్నంగా.. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే మొత్తం మ్యానిఫెస్టోనూ అమలు చేశామని, చెప్పనివి…