అదే నా ఆశ.. ఆకాంక్ష! నూతన మార్గదర్శకాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో మనం ముందుకు సాగాలన్నదే తన ఆశ, ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ పరీక్షల్ని ఎదుర్కొన్న ప్రతిసారీ విజేతగానే నిలిచిందన్నారు. గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విశ్వరూప సందర్శనం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. మహానాడు సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మరికాసేపట్లో మా తెలుగు తల్లికి గీతాలాపనతో మహానాడు లాంఛనంగా…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పర్యటన వాయిదా పడింది. బుధవారం (మే 28) పొదిలిలో జగన్ పర్యటించాల్సి ఉండగా.. వాయిదా పడిందని వైసీపీ ఓ ప్రకటనలో తెలిపింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో పొదిలి పర్యటన వాయిదా పడినట్లు పేర్కొంది. వాతావరణం అనుకూలించిన తర్వాత వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పర్యటన తేదీలను వైసీపీ ఖరారు చేయనుంది. Also Read: CM Chandrababu: అదే నా ఆశ.. ఆకాంక్ష!…
ఏపీ లిక్కర్ స్కాం ఎపిసోడ్లో రోజుకో ట్విస్ట్ ఉంటోంది. వైసీపీపై విషం చిమ్మేందుకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారని, సిట్ విచారణకు హాజరవబోయే ఒకరోజు ముందు టీడీపీ కీలక నేత టీడీ జనార్దన్తో ఆయన భేటీ అయ్యారంటూ వైసీపీ ఓ వీడియో రిలీజ్ చేయటం తాజా సంచలనం. సాయిరెడ్డికి టీడీపీ నేతలు టచ్లో ఉన్నారని చెప్పడానికే వైసీపీ పెద్దలు ఈ వీడియోను బయటపెట్టి ఉండవచ్చని భావిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడే వాళ్లు ఇక్కడ ఎవరూ లేరని మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేశారన్నారు. రోజుకొకరిపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పెట్టుకుందని విమర్శించారు. రాబోయే రోజుల్లో కూటమి నేతలు చేసిన పనులకు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయ్యాక రెడ్ బుక్…
వైసీపీ నేతలు, మాజీ సీఎం వైఎస్ జగన్పై కూటమి ప్రభుత్వంపెట్టినవన్నీ అక్రమ కేసులే అని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని, తప్పకుండా అన్నీ కేసుల నుంచి ఏమీ లేకుండా బయటకు వస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా రైతుల కోసం పోరాటం చేస్తున్నాం అని, గిట్టుబాటు ధరలు లేక పొగాకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఇబ్బందులు లేకుండా మార్జ్…
పోలీసు వేధింపులకు దేశంలోనే నిలువుటద్దంలా ఏపీ నిలుస్తుందని.. కస్టోడియల్ టార్చర్ కి ఏపీ పోలీస్ స్టేషన్ లు వేదికలుగా మారిపోతున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.. గతంలో సోనియాతో కలసి జగన్ ను 16 నెలలు జైలులో ఉంచేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు.. లిక్కర్ కేసులో బెయిలుపై బయట తిరుగుతున్న చంద్రబాబు.. లేని లిక్కర్ కేసు సృష్టించారని విమర్శించారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తొలిసారి అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ అమరావతికి అంకురార్పణ చేసింది. అందుకు అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కూడా ఓకే చెప్పింది. కానీ... 2019లో అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా యూ టర్న్ తీసుకుని మూడు రాజధానుల ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది. దీంతో... అప్పటికే ప్రారంభమైన అమరావతి నిర్మాణ పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. కట్ చేస్తే... ఐదేళ్ళ తర్వాత సీన్ తిరగబడింది.
జడ్పీ చైర్ పర్సన్ గిరిజమ్మ ఛాంబర్ లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండటాన్ని గుర్తించారు. అదే సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోటో స్టోర్ రూమ్ పక్కన ఉంచడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే జెడ్పీ డిప్యూటీ సీఈవోని పిలిపించి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నిబంధన ప్రకారం మాజీ ముఖ్యమంత్రి ఫోటో పెడతారని ప్రశ్నించారు.. జడ్పీ సీఈవో నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం పై ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్ జగన్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శైలజానాథ్.. సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించిన ఆయన.. జగన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మద్యం అక్రమాలపై ఆధారాలు చూపాలని వైఎస్ జగన్ సవాల్ చేశారు.. దీనిపై ఏమీ సమాధానం చెప్పలేక టీడీపీ నేతలు చేతులు ఎత్తేశారని సెటైర్లు వేశారు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ.. వచ్చే ఎన్నికలలో ఆ పార్టీకి ఆరు సీట్లు కూడా రావన్న భయం పట్టుకుంది వైసీపీ నేతలకు అని కామెంట్ చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కంటే ఏపీ లిక్కర్స్ స్కాం కేసు చాలా పెద్దదని ఆరోపించారు.. మభ్యపెట్టడం మాయ చేయడం వైఎస్ జగన్మోహన్రెడ్డి నైజమని దుయ్యబట్టారు..