YS Jagan: ఏపీఎండీసీ ద్వారా బాండ్లు జారీ.. రాష్ట్ర భవిష్యత్త్ను నాశనం చేసేలా ప్రభుత్వ నిర్ణయం..
- చంద్రబాబు ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ఫైర్..
- అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను చంద్రబాబు ప్రభుత్వం తాకట్టు పెట్టింది..
- నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎండీసీ ద్వారా రుణ సమీకరణకు ప్రయత్నిస్తున్నారు: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను చంద్రబాబు ప్రభుత్వం తాకట్టు పెట్టిందన్నారు. హైకోర్టులో కేసు నడుస్తున్నా లెక్క చేయకుండా ఏపీఎండీసీ ద్వారా రెండోసారి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ బాండ్లు జారీ చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుందని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎండీసీ ద్వారా మళ్లీ రుణ సమీకరణకు ప్రయత్నిస్తున్నారు.. రాష్ట్ర ఖజానా నుంచి ప్రైవేట్ వ్యక్తులు నిధులు డ్రా చేసుకునేలా ఆదేశాలు ఇవ్వటం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. శాసనసభ ఆమోదం లేకుండా ప్రభుత్వ ఖజానా నుంచి నిధుల డ్రా చేయడం సరికాదు అని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం యధేచ్చగా ఆర్టికల్స్ 203, 204 ఉల్లంఘించింది అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
Read Also: Operation Midnight Hammer: ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా విధ్వంసం.. శాటిలైట్ చిత్రాలు వెలుగులోకి
Also Read
- Tragedy: ఫోన్ వాడొద్దన్నందుకు.. ఇంటి నుంచి వెళ్లి చెరువులో దూకిన బాలుడు..
- AP Cabinet: ఉద్యోగులకు గుడ్న్యూస్.. రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంపు.. కేబినెట్లో కీలక నిర్ణయాలు..
- Rare Fish: అంతర్వేదిలో అరుదైన ఫిష్.. మత్స్యకారులకు అదృష్టాన్ని తెచ్చిన 'మగ కచిడి చేప'!
- CI Nagaraju: సీఐ చిత్రహింసల వల్లే నా కొడుకు చనిపోయాడు.. వైరల్గా మారిన సాయికృష్ణ తల్లి ఫిర్యాదు లేఖ!
అయితే, ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాలను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టటం చట్ట ఉల్లంఘనే అని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రూ. 1.91 లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపదను ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెట్టారు అని ఆరోపించారు. ఇది రాష్ట్ర ప్రజలను తీవ్రంగా మోసం చేయటమే.. ఈ వ్యవహారంపై హైకోర్టులో కేసు నడుస్తోంది.. ఆ కేసులో ప్రతివాదులకు న్యాయస్థానం నోటీసులు కూడా ఇచ్చింది.. ఆ కేసు నడుస్తుండగానే ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ బాండ్లు జారీ చేయటం సరికాదు అని తెలిపారు. ఇది కచ్చితంగా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించటమే కాక రాష్ట్ర భవిష్యత్తును కూడా ప్రభుత్వం నాశనం చేస్తోంది అని జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Another breach of the Constitution of India by the AP Government.
It is learnt that, APMDC is attempting another Bond (NCD) issuance on 24th June, 2025, on terms violative of the Constitution of India, in an unprecedented manner.
Private parties are being… pic.twitter.com/QVgwk7dKe8
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 22, 2025
తాజావార్తలు
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Deepam Row: తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
-
Padma Awards: 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేత.. మమ్ముట్టి, మాధవన్కు గౌరవం
-
Infosys Recruitment: ఇన్ఫోసిస్లో సరికొత్త రిక్రూట్మెంట్.. 20,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు..
-
Diabetes: కోవిడ్ తర్వాత దేశంలో భారీగా పెరుగుతున్న షుగర్ వ్యాధి..
ట్రెండింగ్
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!