YS Jagan: ఏపీఎండీసీ ద్వారా బాండ్లు జారీ.. రాష్ట్ర భవిష్యత్త్ను నాశనం చేసేలా ప్రభుత్వ నిర్ణయం..
- చంద్రబాబు ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ఫైర్..
- అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను చంద్రబాబు ప్రభుత్వం తాకట్టు పెట్టింది..
- నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎండీసీ ద్వారా రుణ సమీకరణకు ప్రయత్నిస్తున్నారు: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను చంద్రబాబు ప్రభుత్వం తాకట్టు పెట్టిందన్నారు. హైకోర్టులో కేసు నడుస్తున్నా లెక్క చేయకుండా ఏపీఎండీసీ ద్వారా రెండోసారి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ బాండ్లు జారీ చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుందని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎండీసీ ద్వారా మళ్లీ రుణ సమీకరణకు ప్రయత్నిస్తున్నారు.. రాష్ట్ర ఖజానా నుంచి ప్రైవేట్ వ్యక్తులు నిధులు డ్రా చేసుకునేలా ఆదేశాలు ఇవ్వటం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. శాసనసభ ఆమోదం లేకుండా ప్రభుత్వ ఖజానా నుంచి నిధుల డ్రా చేయడం సరికాదు అని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం యధేచ్చగా ఆర్టికల్స్ 203, 204 ఉల్లంఘించింది అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
Read Also: Operation Midnight Hammer: ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా విధ్వంసం.. శాటిలైట్ చిత్రాలు వెలుగులోకి
Also Read
- Perni Nani: చంద్రబాబుకు రాజకీయ నీతి గురించి మాట్లాడే అర్హత లేదు.. సీఎంపై పేర్ని నాని ఫైర్..
- Thalliki Vandanam: తల్లికి వందనం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఈ మూడు పనులు చేయకుంటే డబ్బులు రావు!
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
అయితే, ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాలను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టటం చట్ట ఉల్లంఘనే అని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రూ. 1.91 లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపదను ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెట్టారు అని ఆరోపించారు. ఇది రాష్ట్ర ప్రజలను తీవ్రంగా మోసం చేయటమే.. ఈ వ్యవహారంపై హైకోర్టులో కేసు నడుస్తోంది.. ఆ కేసులో ప్రతివాదులకు న్యాయస్థానం నోటీసులు కూడా ఇచ్చింది.. ఆ కేసు నడుస్తుండగానే ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ బాండ్లు జారీ చేయటం సరికాదు అని తెలిపారు. ఇది కచ్చితంగా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించటమే కాక రాష్ట్ర భవిష్యత్తును కూడా ప్రభుత్వం నాశనం చేస్తోంది అని జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Another breach of the Constitution of India by the AP Government.
It is learnt that, APMDC is attempting another Bond (NCD) issuance on 24th June, 2025, on terms violative of the Constitution of India, in an unprecedented manner.
Private parties are being… pic.twitter.com/QVgwk7dKe8
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 22, 2025
తాజావార్తలు
-
Jananayagan : విజయ్ లాస్ట్ మూవీతో కిరణ్కు తిప్పలు
-
Ashwini Vaishnaw: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటన
-
Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
-
Vietnam Boat Accident: వియత్నాం బోటు ప్రమాదం.. తెలంగాణ అలర్ట్.!
-
Lucky Plants: ధనలక్ష్మిని ఇంట్లోకి లాగేసే ‘లక్కీ ప్లాంట్స్’.. మీ తలరాత మారిపోవడం ఖాయం అంట!
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!