YS Jagan: ఏపీఎండీసీ ద్వారా బాండ్లు జారీ.. రాష్ట్ర భవిష్యత్త్ను నాశనం చేసేలా ప్రభుత్వ నిర్ణయం..
- చంద్రబాబు ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ఫైర్..
- అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను చంద్రబాబు ప్రభుత్వం తాకట్టు పెట్టింది..
- నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎండీసీ ద్వారా రుణ సమీకరణకు ప్రయత్నిస్తున్నారు: వైఎస్ జగన్
YS Jagan: ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను చంద్రబాబు ప్రభుత్వం తాకట్టు పెట్టిందన్నారు. హైకోర్టులో కేసు నడుస్తున్నా లెక్క చేయకుండా ఏపీఎండీసీ ద్వారా రెండోసారి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ బాండ్లు జారీ చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుందని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎండీసీ ద్వారా మళ్లీ రుణ సమీకరణకు ప్రయత్నిస్తున్నారు.. రాష్ట్ర ఖజానా నుంచి ప్రైవేట్ వ్యక్తులు నిధులు డ్రా చేసుకునేలా ఆదేశాలు ఇవ్వటం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. శాసనసభ ఆమోదం లేకుండా ప్రభుత్వ ఖజానా నుంచి నిధుల డ్రా చేయడం సరికాదు అని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం యధేచ్చగా ఆర్టికల్స్ 203, 204 ఉల్లంఘించింది అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
Read Also: Operation Midnight Hammer: ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా విధ్వంసం.. శాటిలైట్ చిత్రాలు వెలుగులోకి
Also Read
- AP High Court Serious: సీనియర్ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు సీరియస్.. మాకే అధికారముంటే ఈ క్షణాన్నే సస్పెండ్..!
- MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
- AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
అయితే, ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాలను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టటం చట్ట ఉల్లంఘనే అని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రూ. 1.91 లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపదను ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెట్టారు అని ఆరోపించారు. ఇది రాష్ట్ర ప్రజలను తీవ్రంగా మోసం చేయటమే.. ఈ వ్యవహారంపై హైకోర్టులో కేసు నడుస్తోంది.. ఆ కేసులో ప్రతివాదులకు న్యాయస్థానం నోటీసులు కూడా ఇచ్చింది.. ఆ కేసు నడుస్తుండగానే ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ బాండ్లు జారీ చేయటం సరికాదు అని తెలిపారు. ఇది కచ్చితంగా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించటమే కాక రాష్ట్ర భవిష్యత్తును కూడా ప్రభుత్వం నాశనం చేస్తోంది అని జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Another breach of the Constitution of India by the AP Government.
It is learnt that, APMDC is attempting another Bond (NCD) issuance on 24th June, 2025, on terms violative of the Constitution of India, in an unprecedented manner.
Private parties are being… pic.twitter.com/QVgwk7dKe8
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 22, 2025
తాజావార్తలు
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
-
Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
-
MI vs CSK: వాంఖడేలో భావోద్వేగ క్షణం.. తల్లిని కోల్పోయినా మైదానంలోకి దిగిన సీఎస్కే ప్లేయర్ ముఖేష్ చౌదరి
-
North Korea: 10 ఏళ్ల ప్లానింగ్, 2 గంటల్లో ఎస్కేప్.. ఉత్తర కొరియా నుంచి కుటుంబం పరార్..
-
Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!