నేడు సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అలంపూర్, మధ్యాహ్నం 3కి కొల్లాపూర్, సాయంత్రం 4 గంటలకు నాగర్ కర్నూల్, సాయంత్రం 5 గంటలకు కల్వకుర్తి ప్రజా ఆశీర్వాద సభలలో సీఎం మాట్లాడనున్నారు. నేడు మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు నారాయణపేటలో సకల జనుల విజయసంకల్ప సభలో ఆయన పాల్గొననున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు…