అప్పుడప్పుడు రోడ్లపై కరెన్సీ నోట్లు పడిపోవడం మనం చూశాం. కానీ నదిలోంచి కరెన్సీ కట్టలు కొట్టుకువస్తే ఎలా వుంటుంది. అలాంటి అనుభవమే ఎదురైంది రాజస్థాన్ అజ్మేర్లోని పోలీసులకు. ఆనాసాగర్ సరస్సులో 2వేల రూపాయల కరెన్సీ నోట్ట కట్టలు తేలియాడుతూ రావడంతో పోలీసులు షాకయ్యారు. ఈ నోట్లు కూడా పాలిథీన్ బ్యాగులో ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ సంచిలో మొత్తం 30 నుంచి 32 నోట్ల కట్టలు ఉన్నాయని, అన్నీ రూ.2వేల నోట్లే అని అధికారులు తెలిపారు.…
ఎండలు మండుతున్నాయి. భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. గోదావరి జిల్లాలో తాగు నీటి సమస్య పెరుగుతోంది. ప్రధానంగా శివారు ప్రాంతాల ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు.. గోదావరి చెంతనే ఉన్నా ఈ ప్రాంతాల్లో త్రాగునీటికి చింత తప్పడంలేదు. గోదావరి వాసులు త్రాగునీటి కోసం చేస్తున్న ఫీట్లు, మహిళలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీకావు, మండుతున్న ఎండలతో గోదావరి జిల్లాల ప్రజల గొంతు ఎండుతోంది. గుక్కెడు నీళ్లు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ట్యాంకర్లు వద్ద మంచినీళ్లు పట్టుకోవడంలోనూ, సుదూర…
హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో వున్న మాదాపూర్ వడ్డెరబస్తీ వాసులు కలుషిత నీటితో నానా అవస్థలు పడుతున్నారు. కలుషిత నీటి బాధితుల సంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా మరికొందరు అస్వస్థతకు గురికావడంతో మొత్తం బాధితుల సంఖ్య 98కి చేరింది. వాంతులు, విరేచనాలతో కొత్తగా 15 మంది కొండాపూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 52 మంది చికిత్స పొందుతున్నారు. 26 మంది ఇప్పటివరకూ రికవరీ అయ్యారు. కొండాపూర్, గాంధీ…
ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న భారతీయ జనతాపార్టీ ఆ దిశగా దూకుడు పెం చుతోంది. ఈనెల 20వరకు వివిధ రకాల కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఉత్తరాంధ్ర తాగు, సాగునీటి ప్రాజెక్ట్ ల సాధన కోసం నేటి నుంచి మూడు రోజుల పాటు పోరు యాత్రకు సిద్ధం అయింది. 500 కోట్లు కేటాయిస్తే పూర్తయ్యే ప్రాజెక్ట్ లను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనేది బీజేపీ వాదన. ప్రతిపాదిత పనులు చేపడితే ఎనిమిది లక్షల ఎకరాలకు నీరందుతుందని…
ఎండాకాలం వచ్చేసింది. భానుడు ప్రచండంగా మారిపోతున్నాడు. సూరీడు దెబ్బకు జనం విలవిలలాడిపోతున్నారు. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే తీవ్ర ఉష్ణోగ్రతలు ఉండే సమయంలో ఎక్కువగా ఎండలో తిరగవద్దు. రోడ్ల వెంట విక్రయించే చల్లని రంగు పానీయాలు, కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలి. మద్యం, మాంసం తగ్గించాలి. నీరు, పళ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. కోవిడ్ టైంలో ఎలాగైతే జాగ్రత్తలు పాటించామో ఇప్పుడు కూడా అదేవిధంగా జాగ్రత్తగా వుండాలి. ఒకవేళ ఎవరికైనా వడదెబ్బ తగిలితే వెంటనే త్వరగా…
గతంతో పోలిస్తే ఎండాకాలం చుర్రుమనిపిస్తోంది. సమ్మర్ ఎఫెక్ట్ తో తెలంగాణలో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో మండుతున్న ఎండలతో ప్రాణాలు పోతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రం లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదు కావడం విశేషం. ఆదిలాబాద్ జిల్లా చెప్రాలలో 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయిందంటే ఎండల తీవ్రత ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. వడదెబ్బకు గురై మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వడదెబ్బతో ఇద్దరు…
తెలంగాణలో కేసీఆర్ ఉద్యోగాల ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80,039 ఉద్యోగాలకు నేడే నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన 11,103 ఒప్పంద ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలతోనే నిరుద్యోగ నిర్మూలన సాధ్యంకాదు. ఒకేసారి ఖాళీలన్నింటిని భర్తీ చేయాలని ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. తక్షణమే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్.ఎఫ్.ఐ. డిమాండ్ చేసింది. రాష్ట్ర…
తెలంగాణలో నిరుద్యోగం ఇప్పుడు పార్టీలో ఏజెండాగా మారనుందా? అంటే అవుననే అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను ప్రధానంగా చర్చిస్తోంది. లక్షలాది ఉద్యోగాల నియామకం చేపట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. చాలీచాలని జీతాలతో ప్రయివేటు ఉద్యోగాలు చేస్తున్నామని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీలు, పీజీలు చేసిన పలువురు నిరుద్యోగులు ఉద్యోగాలు రాక హమాలీ పనికి, టీ, టిఫిన్ సెంటర్లు నడుపుతూ, కూరగాయలు…
పంజాబ్ రాజధాని చంఢీఘర్లో గత 36 గంటలుగా అంధకారం అలుముకున్నది. చంఢీఘర్లో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది నిరసన దీక్షలు చేస్తున్నారు. విధులను బహిష్కరించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించి 48 గంటల పాటు నిరసనలకు దిగడంతో చంఢీఘర్ అంధకారంగా మారిపోయింది. ఆసుపత్రులు, కార్యాలయాలు, గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర వైద్యం అందక ఆసుపత్రుల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు అంధకారంగా మారిపోయాయి. ఆసుపత్రుల్లో ఉన్న జనరేటర్ సౌకర్యం…
ప్రస్తుతం బీజింగ్లో వింటర్ ఒలింపిక్స్ 2022 జరుగుతున్నది. శీతాకాలంలో నిర్వహించే వింటర్ ఒలింపిక్స్ కోసం మంచు చాలా అవసరం అవుతుంది. సహజసిద్ధంగా మంచు ఉన్న ప్రాంతాల్లోనే వింటర్ ఒలింపిక్స్ను నిర్వహించాలి అంటే సాధ్యం కాదు. సహజసిద్ధంగా ఆ ప్రాంతంలో మంచు ఉన్నప్పటికీ క్రీడల నిర్వహణకు ఏ మాత్రం సరిపోదు. దీనికోసమే కృత్రిమంగా మంచును సృష్టిస్తుంటారు. 1980 దశకం నుంచి వింటర్ ఒలింపిక్స్ కోసం కొంతమేర మంచుకు కృత్రిమంగా సృష్టిస్తూనే ఉన్నారు. గతంలో రష్యాలోని సోచీలో నిర్వహించిన వింటర్…