టీ20 వరల్డ్కప్ 2026 ముందు టీమిండియాకు భారీ పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ వరల్డ్కప్కు దూరమయ్యే ఛాన్సెస్ మెండుగా ఉన్నాయి. ఫిట్నెస్ కారణంగా అతడు మెగా టోర్నీకి అందుబాటులో ఉండడం లేదని తెలుస్తోంది. దీంతో భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుందర్ స్థానంలో యువ ఆటగాడు రియాన్ పరాగ్ను ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. వాషింగ్టన్ సుందర్ గత కొన్నేళ్లుగా టీ20 ఫార్మాట్లో…
మూడు వన్డేల సిరీస్లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ ఆరంభం కానుంది. న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్వెల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఒక మార్పు చేశామని చెప్పాడు. జాడెన్ లెన్నాక్స్ అరంగేట్రం చేస్తున్నాడు. మరోవైపు భారత్ కూడా ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ శుభ్మన్ గిల్ తెలిపాడు. గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్తో…
భారత్–న్యూజిలాండ్ వన్డే సిరీస్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా మిగతా వన్డే మ్యాచ్లకు దూరమయ్యాడు. అతని స్థానంలో యువ ఆల్రౌండర్ ఆయుష్ బదోనిని జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. 26 ఏళ్ల బదోని భారత జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. బుధవారం రాజ్కోట్లో జరిగే రెండో వన్డేకు అతడు అందుబాటులోకి రానున్నాడు. బదోని బ్యాటర్ మాత్రమే కాదు.. ఆఫ్ స్పిన్నర్ కూడా. మొదటి వన్డేలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్…
న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో భారత్ విజయంలో తన వంతు సహకారం అందించడం చాలా సంతోషంగా ఉందని టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ చెప్పాడు. లక్ష్య ఛేదనలో పరుగులు చేయడమే కాదు, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడటమే అత్యంత ముఖ్యమని అన్నాడు. గతం గురించి ఆలోచించకుండా, భవిష్యత్తు టెన్షన్కు పోకుండా.. ప్రస్తుతంపై పూర్తిగా దృష్టి పెడుతా అని గిల్ తెలిపాడు. ప్రస్తుతం గురించి ఆలోచించినపుడే విజయాల ఆనందాన్ని, అపజయాల నిరాశను సమతూకంగా ఎదుర్కొనగలమని గిల్ తెలిపాడు.…
మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం వడోదరలో న్యూజిలాండ్తో జరిగిన మొదటి మ్యాచ్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కింగ్ విరాట్ కోహ్లీ (93; 91 బంతుల్లో 8×4, 1×6) సూపర్ ఇన్నింగ్స్ ఆడగా.. శుభ్మన్ గిల్ (56), శ్రేయస్ అయ్యర్ (49) రాణించారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 8 వికెట్లకు 300 పరుగులు చేసింది. లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే ఈ…
స్వదేశంలో బ్యాటింగ్, బౌలింగ్లో బెబ్బులిలా చెలరేగే భారత్.. దక్షిణాఫ్రికాకు సిరీస్ను కోల్పోవడం ఇక లాంఛనమే. మొదటి టెస్టులో దారుణ ఓటమిని చవిచూసిన టీమిండియా.. రెండో టెస్టులోనూ ఓటమి దిశగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్లో ప్రొటీస్ టీమ్ 489 రన్స్ చేయగా.. భారత్ 201 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 26 రన్స్ చేయగా.. 314 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలుంది. టీమిండియాకు 400 రన్స్ లక్ష్యంను విధించే అవకాశం ఉంది.…
మరికాసేపట్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొదటి టెస్ట్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ప్రొటీస్ కెప్టెన్ టెంబా బావుమా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తమ బ్యాటర్లు మంచి ఫామ్ మీదున్నారని, అందుకే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నానని బావుమా చెప్పాడు. పిచ్ కాస్త పొడిగా కనిపిస్తోందని, మొదటి ఇన్నింగ్స్లో పరుగులు చాలా కీలకం అని పేర్కొన్నాడు. కగిసో స్థానంలో కార్బిన్ ఆడుతున్నడని బావుమా చెప్పాడు. ఫాస్ట్ బౌలర్లకు పిచ్ సహకరించనుందని టీమిండియా…
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ను దృష్టిలో ఉంచుకుని జట్ల మధ్య ట్రేడ్ చర్చలు వేగంగా సాగుతున్నాయి. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ స్పిన్ విభాగాన్ని బలోపేతం చేయడానికి గుజరాత్ టైటాన్స్ (GT) ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను తమ జట్టులోకి తీసుకువాలనే ప్రయత్నం చేసింది. అయితే, గుజరాత్ టైటాన్స్ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. అందిన రిపోర్ట్స్ ప్రకారం.. ఈ రెండు జట్ల మధ్య సుందర్ ట్రేడ్పై చర్చలు ప్రారంభమయ్యాయి. చెన్నై…
ఐదు టీ20 సిరీస్లో భాగంగా క్వీన్స్లాండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. 48 పరుగుల తేడాతో కంగారులను చిత్తు చేసింది. భారత్ నిర్ధేశించిన 168 రన్స్ ఛేదనలో ఆసీస్ 18.2 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (30) టాప్ స్కోరర్. మాథ్యూ షార్ట్ (25) మినహా మిగతా కంగారో బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్స్ పడగొట్టగా.. అక్షర్ పటేల్,…
IND vs SA: హోబార్ట్ వేదికగా జరిగిన భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. టార్గెట్ 187 పరుగులను భారత్ 18.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి పూర్తి చేసి మ్యాచ్ను 5 వికెట్ల తేడాతో గెలుచుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ప్రారంభంలో అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్తో భారత బౌలర్లు దూకుడు ప్రదర్శించారు. మొదటి మూడు…