IND Playing 11 vs PAK: సంజు, రింకు అవుట్.. సర్ప్రైజ్ ఎంట్రీ, పాకిస్థాన్పై ఆడే భారత్ తుది జట్టు ఇదే!
- ప్రపంచకప్ 2026లో భారత్ దూసుకెళుతోన్న భారత్
- అమెరికా, నమీబియాపై టీమిండియా విజయాలు
- ఫిబ్రవరి 15న పాకిస్థాన్తో భారత్ మ్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Playing XI Pakistan in T20 World Cup 2026: సొంత గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ దూసుకెళుతోంది. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్లలో సూర్య సేన విజయం సాధించింది. చిన్న జట్లు అమెరికా, నమీబియాపై టీమిండియా విజయాలు అందుకుంది. ఇక ఆదివారం (ఫిబ్రవరి 15)న దాయాది పాకిస్థాన్తో భారత్ తలపనుంది. ఎన్ని గెలిచినా పాకిస్థాన్పై గెలిస్తే.. ఆ కిక్కే వేరు. అందుకే టీమిండియా పటిష్ట జట్టుతో బరిలోకి దిగనుంది. పాకిస్థాన్ మ్యాచ్కు భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఓసారి చూద్దాం.
పాకిస్థాన్ మ్యాచ్కు జట్టు కాంబినేషన్లో మార్పులు చోటుచేసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఓపెనింగ్ జోడీ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. యువ బ్యాటర్ అభిషేక్ శర్మ మ్యాచ్కు సిద్ధంగా ఉన్నాడు. ఓపెనర్గా ఇషాన్ కిషన్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. అభిషేక్ రాకతో వికెట్కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ప్లేయింగ్ 11 నుంచి తప్పుకొవాల్సి ఉంటుంది. మిడిల్ ఆర్డర్లో కూడా మార్పు చోటుచేసుకునేలా కనిపిస్తోంది. పవర్ హిట్టర్ రింకు సింగ్ను ఈ మ్యాచ్కు పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి. అతని స్థానంలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆడనున్నాడు. బౌలింగ్ బ్యాలెన్స్ పెంచేందుకు టీమిండియా మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Happy Birthday Dhoni: 17,266 పరుగులు, 829 డిస్మిసల్స్, 3 ఐసీసీ ట్రోఫీస్.. భారత క్రికెట్లో ధోని శకం ఇలా.!
- Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!
- Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రం సూపర్.. ఆ ఒక్క లోపం సరిదిద్దుకుంటే ఇంగ్లండ్కు చుక్కలే..!
- FIFA World Cup 2026: పోర్చుగల్ ఓటమి.. ముగిసిన రొనాల్డో ప్రయాణం.!
ఇషాన్ కిషన్ మంచి ఫామ్ మీదున్నాడు. అభిషేక్ శర్మ కూడా బ్యాట్ జుళిపిస్తే అదిరే ఆరంభం దక్కుతుంది. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు ఇప్పటికే హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. శివమ్ దూబే భారీ హిట్టింగ్ చేస్తున్నాడు. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్ ప్రదర్శన జట్టుకు ఉపయోగపడనుంది. స్పిన్ దళానికి వరుణ్ చక్రవర్తి నాయకత్వం వహించనున్నాడు. పేస్ కోటాలో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ ఆడనున్నారు. హార్దిక్ మూడో పేసర్ గా ఉంటాడు. మొత్తంగా చూస్తే.. పాకిస్థాన్ వంటి బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు టీమిండియా మేనేజ్మెంట్ వ్యూహాత్మకంగా ప్లేయింగ్ XIను సెట్ చేస్తోంది.
తుది జట్టు (అంచనా):
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్.
తాజావార్తలు
-
Queen 2: విడుదలకు ముందే చిక్కుల్లో కంగనా సినిమా.. రూ.250 కోట్ల కేసుతో కొత్త ట్విస్ట్!
-
CM Chandrababu: రెండు నెలల్లో ప్రతీ జిల్లాకు డిస్ట్రిక్ట్ ఎకనామిక్ ప్రొఫైల్.. సీఎం కీలక వ్యాఖ్యలు
-
Happy Birthday Dhoni: 17,266 పరుగులు, 829 డిస్మిసల్స్, 3 ఐసీసీ ట్రోఫీస్.. భారత క్రికెట్లో ధోని శకం ఇలా.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!
-
Dada: గంగూలీ బయోపిక్ నుంచి బర్త్డే ట్రీట్.. ‘దాదా’ ఫస్ట్ లుక్కు టైమ్ ఫిక్స్
ట్రెండింగ్
-
Sanju Samson: జింబాబ్వే టూర్లో నో ఛాన్స్.. సంజు కెరీర్ అప్పుడే ముగియలేదు.. ముందుంది మరో సూపర్ ఛాన్స్!
-
ICC Team: టీ20 ప్రపంచకప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒక్కరికే చోటు.. ఆ ఒక్కరు మన అమ్మాయే!
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!