India vs South Africa: అభిషేక్ మళ్ళీ ఫెయిల్.. టీమిండియా ఓటమికి ఐదు కారణాలు!
- భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్
- టీమిండియా 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం
- ఈ ఓటమి టీం ఇండియా నెట్ రన్ రేట్ను తీవ్రంగా ప్రభావితం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమి టీం ఇండియా నెట్ రన్ రేట్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. సెమీఫైనల్స్కు చేరుకునే భారత ఆశలను దెబ్బతీసింది. భారత బ్యాటింగ్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. ప్రోటీస్ జట్టుకు మిల్లర్ హీరోగా నిరూపించుకున్నాడు. 35 బంతుల్లో 63 పరుగులు చేసి, మ్యాచ్ స్థితిని పూర్తిగా మార్చాడు. ఈ ఓటమి వెనుక గల కారణాలు ఏంటి? ఆ వివరాలు మీకోసం..
బౌలర్ల పేలవమైన ప్రదర్శన
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికాకు శుభారంభం లభించలేదు. దక్షిణాఫ్రికా టాప్ బ్యాట్స్మెన్లలో ముగ్గురు 20 పరుగుల వద్ద అవుటయ్యారు. భారత బౌలర్లు సఫారీలపై ఒత్తిడిని కొనసాగిస్తారని భావించారు. కానీ మిల్లర్, బ్రెవిస్ ఒత్తిడిని అధిగమించి దూకుడుగా బ్యాటింగ్ చేసి 97 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు.
స్పిన్నర్ల అపజయం
ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా భారత స్పిన్నర్లను ధాటిగా ఎదుర్కొంది. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 47 పరుగులు సమర్పించుకోగా, సుందర్ 2 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చాడు. స్పిన్నర్లు ఒక వికెట్ మాత్రమే పడగొట్టారు.
హార్దిక్ చివరి ఓవర్
చివరి ఓవర్లో హార్దిక్ 20 పరుగులు ఇచ్చాడు. ఒకానొక సమయంలో, భారత్ దక్షిణాఫ్రికాను 175 పరుగులకే పరిమితం చేస్తుందని అనిపించింది. కానీ హార్దిక్ ఓవర్ 188 పరుగుల టార్గెట్ కు కారణమైంది. ఇది భారత బ్యాట్స్మెన్పై ఒత్తిడి పెంచింది.
అభిషేక్ మళ్ళీ పరాజయం, ఓపెనర్లు విఫలమయ్యారు.
ఈ మ్యాచ్లో భారత ఓపెనర్లు మరోసారి నిరాశపరిచారు. తొలి ఓవర్లోనే ఇషాన్ పరుగులు చేయకుండానే ఔటయ్యాడు. ఆ తర్వాత తిలక్ కూడా ఔటయ్యాడు. అభిషేక్ భారీ ఇన్నింగ్స్ ఆడతాడని భావించారు, కానీ15 పరుగులకే ఔటయ్యాడు.
బ్యాటర్ల ఆట తీరుపై ప్రశ్నలు
ప్రతి భారత బ్యాట్స్మన్ మొదటి బంతి నుంచే సిక్స్ కొట్టాలని అనుకున్నట్లు అనిపించింది. పిచ్ను అర్థం చేసుకోవడానికి కూడా ఎవరూ ప్రయత్నించలేదు. బంతి అభిషేక్ బ్యాట్పైకి రాలేదు. కాబట్టి ప్లేయర్స్ తమకు తాము సమయం ఇచ్చుకుని, భాగస్వామ్యాలను నిర్మించుకుని, సింగిల్స్, డబుల్స్పై దృష్టి పెట్టాల్సింది. కానీ ప్రతి బంతిని భారీ షాట్లతో ఆడాలని కోరుకున్నారు, తద్వారా వికెట్లను కోల్పోయారు. ఇషాన్, తిలక్, సుందర్లకు ఇలాగే ఔటయ్యారు.
సుందర్ విఫలం
ఈ మ్యాచ్లో భారత్ అక్షర్ స్థానంలో సుందర్ని తీసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమయ్యాడు. సుందర్కి రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయడానికి అనుమతి ఇచ్చారు. అందువల్ల, ఈ ప్రయోగం కూడా ఘోరంగా విఫలమైంది.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!