Distribution of Ration: పండుగొచ్చె.. కానీ రేషన్ ఎస్తలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Distribution of Ration: సంక్రాంతి పండుగ సమయం దగ్గరపడింది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈనెల రేషన్ బియ్యం పంపిణీలని ఇంకా మొదలు పెట్టలేదు. ప్రజాపంపిణీ వ్యవస్థ బియ్యం పంపిణీకి బ్రేకు పడింది. ప్రతి నెల ఒకటో తేదీ నుంచి రేషన్ డీలర్ల ద్వారా బియ్యం పంపిణీ జరుగుతుంది. అయితే.. ఈ నెల ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. కాగా.. కరోనా సమయంలో మాదిరిగా జనవరి నుంచి మరో ఏడాది పాటు కార్డులోని ప్రతి వ్యక్తికి అయిదు కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీని కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ఈనేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసిన విషయం తెలిసిందే.. ఇక.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున బియ్యం ఇచ్చేది. రాష్ట్రాల్లో ఉచిత బియ్యం పంపిణీని కొనసాగించాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ఒకొక్కరికి అయిదు కిలోలు ఇవ్వాలా? గతంలో మాదిరిగా ఆరు కిలోలు ఇవ్వాలా? అన్న అంశంపై అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు.
Read also: Samantha Bounce Back Soon live: ఆ చిరునవ్వు వెనుక ఎంత వ్యధ ఉందో..!
Also Read
అయితే.. రాష్ట్రంలో బియ్యం పుష్కలంగా ఉన్న నేపథ్యంలో గతంలో తీసుకున్న విధాన నిర్ణయం మేరకు ఆరు కిలోలు ఇస్తే నెలకు ఎంత బియ్యం అవసరమవుతుంది? అదనపు వ్యయం ఎంత అవుతుంది? అన్న అంశంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. దీంతో.. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కాగా.. 55 లక్షల కార్డులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై బియ్యాన్ని కేటాయిస్తుంది. కేంద్రంతో పోలిస్తే ఆదాయ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం పెంచటంతో మరో 35 లక్షల కార్డులకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా బియ్యం పంపిణీ చేస్తోందని.. ఉచిత బియ్యం పంపిణీ విషయంలో గతంలో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ దఫా ఆచితూచి వ్యవహరించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ వ్యూహంగా ఉంది.
Read also: Lips Care: చలికాలంలో పెదవులు పగిలిపోకుండా ఉండాలంటే.. ఇలా చెయ్యండి
జనవరి 7వ తేదీ నుంచి (శనివారం) నుంచి జిల్లాలో ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభిస్తున్న ప్రభుత్వాలు ప్రకటించిన.. గత నెల వరకు ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున ఉచితంగా అందజేస్తున్న రేషన్ బియ్యాన్ని ఈ నెలలో ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున అందించాలని పౌరసరఫరాల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.. దీంతో రేషన్ డీలర్లు గురువారం నుంచి రేషన్ షాపుల ద్వారా పేదలకు ఉచితంగా బియ్యం అందించనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే.. గత వారంలోనే రేషన్ పంపిణీ చేస్తాయన్న వార్తలతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. కానీ సంక్రాంతి దగ్గర పడుతున్న ఇప్పటి వరకు రేషన్ పంపిణీ చేయకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మరి సంక్రాంతికి రేషణ్ పంపిణీ చేయనుందా? లేదా? అనేప్రశ్నలపై ఉత్కంఠ నెలకొంది. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించనుందో వేచి చూడాలి!
తాజావార్తలు
-
IPL 2026 Black Tickets: జోరుగా బ్లాక్ టికెట్ దందా.. కీలక అధికారి ప్రమేయం.. ఒక్కో టికెట్ రూ.80 వేలు!
-
Peddi: ‘పెద్ది’ శాటిలైట్ డీల్ లాక్..
-
NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
-
TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
-
Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..