ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025)లో ఈరోజు ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెన్నైని ముందుగా బ్యాటింగ్ను ఎంచుకున్నాడు. బరిలోకి దిగిన ధోనీ నాయకత్వంలోని సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2025లో 33వ మ్యాచ్ గురువారం ముంబై ఇండియన్స్ - సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతోంది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్కు హిట్మ్యాన్ పేరు పెట్టాలనే ప్రతిపాదనను ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) పరిశీలిస్తోంది. తాజాగా జరిగిన సమావేశంలో ఎంసీఎ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత జట్టుకు చేసిన సేవలకు గాను రోహిత్ను ప్రత్యేక గౌరవంతో గుర్తించాలని ఎంసీఎ భావిస్తోంది. ఈ మేరకు ఇండియన్ ఎక్స్ప్రెస్ తమ కథనంలో పేర్కొంది. వాంఖడే స్టేడియంలోని స్టాండ్స్, వాక్వేలకు మాజీ అధ్యక్షులు…
MI vs KKR: ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 సీజన్ లో బోణి కొట్టింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదటగా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ చేపట్టింది. కోల్కతా నైట్ రైడర్స్ కేవలం 16.2 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. ముంబై ఇండియన్స్ బౌలర్ అశ్విని కుమార్ 24 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీయడంతో కోల్కతా నైట్ రైడర్స్ తక్కువ…
MI vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ (MI) తమ హోమ్ గ్రౌండ్ వాంఖడే స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) తో తలపడుతుంది. ఇక ఈ సీజన్ లో తొలిసారి వాంఖడే స్టేడియంలో ఆడుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ముంబై ఇండియన్స్. ఇకపోతే, గత మ్యాచ్ లతో పోలిస్తే ఇరు జట్ల ప్లేయింగ్ XI లో మార్పులు జరిగాయి. ముంబై ఇండియన్స్ లో విల్ జాక్స్…
బార్బడోస్ గడ్డపై 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత క్రికెట్ జట్టు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. ఈరోజు భారత జట్టు తిరిగి స్వదేశానికి చేరుకుంది. ఈరోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని టీమిండియా సభ్యులు కలిశారు.
Team India Victory Parade : 2024 టీ20 ప్రపంచకప్లో భారత జట్టు చరిత్ర సృష్టించి రెండోసారి ఈ పొట్టి క్రికెట్ ఫార్మాట్ లో టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. దీనికి ముందు 2007 టీ20 ప్రపంచకప్ను భారత జట్టు గెలుచుకుంది. వన్డేల్లో 1983, 2011 ప్రపంచకప్లను గెలుచుకుంది. ఈసారి ప్రపంచ కప్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆల్ రౌండర్…
2024 ఐపీఎల్ మొదలైనప్పటినుండి ముంబై ఇండియన్స్ కు ఏది కలసి రాలేదు. ముఖ్యంగా ఆడిన మొదటి మూడు మ్యాచ్ లలో ఓడి పాయింట్ల ఖాతా తెర్చలేకపోయింది. కాకపోతే నేడు జరిగిన ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో ఒక బ్యాట్స్మెన్ కూడా 50 పరుగులు చేయకుండానే భారీ స్కోర్ ను అందుకుంది. ఢిల్లీ బౌలర్స్ పై ఎలాంటి కనికరం చూపించకుండా.. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి చివరి వరకు ముంబై బ్యాట్స్మెన్స్ సిక్సర్లతో చుక్కలు చూపించారు. దీంతో ముంబై…
India defeated Australia for the first time in Women’s Test History: ఇంగ్లండ్పై చారిత్రక టెస్ట్ విజయంతో ఫుల్జోష్లో ఉన్న భారత మహిళల జట్టు.. మరో సంచలనం నెలకొల్పింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శనతో మరోరోజు ఆట మిగిలి ఉండగానే జయకేతనం ఎగురవేసింది. భారత మహిళలకు ఆస్ట్రేలియా జట్టుపై మొట్టమొదటి టెస్టు గెలుపు ఇదే కావడం విశేషం.…
ఎంఎస్ ధోని కెప్టెన్సీలో టీమిండియా ప్రపంచ క్రికెట్లో ఎన్నో పెద్ద మైలురాళ్లను సాధించింది. 2007లో టీ-20 ఫార్మాట్లో భారత జట్టును ఛాంపియన్గా నిలిపిన మహి, 2011లో 28 ఏళ్ల కరువుకు స్వస్తి పలికి వన్డే ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకున్నాడు.