ఉక్రెయిన్ పొరుగు దేశాల నుండి మరో 629 మంది భారతీయులను తీసుకువస్తున్న మూడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) విమానాలు శనివారం ఉదయం హిండన్ ఎయిర్ బేస్లో దిగినట్లు వైమానిక దళం తెలిపింది. రష్యా సైనిక దాడి కారణంగా ఫిబ్రవరి 24 నుండి ఉక్రెయిన్ గగనతలం మూసివేయబడినందున, యుద్ధంతో దెబ్బతిన్న ఉక్రెయిన్ పొరుగు దేశాలైన రొమేనియా, హంగేరి, స్లోవేకియా మరియు పోలాండ్ నుండి భారతదేశం తన పౌరులను ఖాళీ చేయిస్తోంది. “ఇప్పటి వరకు, భారత వైమానిక దళం…
ఉక్రెయిన్పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తూ గడగడలాడిస్తోంది. ఉక్రెయిన్ సైనిక దళాలు కూడా రష్యాతో తలపడుతున్నాయి. అయితే ఇప్పటికే రెండుసార్లు యుద్ధం ఆపాలని రష్యాతో ఉక్రెయిన్ చర్చలకు దిగింది. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి రష్యాతో చర్చలు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ దేశంలోని పలు కీలక నగరాలు రష్యా స్వాధీనంలోకి వెళ్లాయి. ఇరు దేశాల మధ్య జరిగిన రెండు దఫాల చర్చలు ఫలితాలనివ్వలేదు. ఈ క్రమంలో రష్యాతో మూడో సారి చర్చలకు…
ఉక్రెయిన్పై రష్యా యుద్ధ వ్యూహం మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. రెండో దఫా చర్చల్లో పౌరులు సురక్షితంగా తరలివెళ్లడానికి రష్యా అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే, తొమ్మిదో రోజు దాడుల్లో ఆ హామీకి కట్టుబడుతూనే.. ఉక్రెయిన్లోని భారీ పవర్ ప్లాంట్లను రష్యా టార్గెట్ చేసింది. యూరప్లోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉక్రెయిన్లోని జపోరిజ్జియాలో ఉంది. దానిపై రష్యా వరుస దాడులకు పాల్పడింది. జపోరిజ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్పై రష్యా బాంబు దాడి చేయడంపై అంతర్జాతీయ అణు శక్తి సంస్థ-…
నియంతల కథలన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. వారిలో చాలా మంది జీవితం అట్టడుగు నుంచి అత్యున్నత అధికార శిఖరం ఎక్కినవారే. ప్రస్తుతం ప్రపంచాన్ని నిద్రకు దూరం చేసిన రష్యా అధినేత వ్లాడిమీర్ పుతిన్ కథ కూడా అందుకు భిన్నం కాదు. అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా దేశాధ్యక్షుడయ్యాడు. రెండు దశాబ్దాలుగా సువిశాల రష్యాను ఎదురులేకుండా ఏలుతున్నాడు. అయితే ప్రస్తుతం ఆయన చేస్తున్నది ఆషామాషీ యుద్ధం కాదు. నాటో శక్తులన్నీ ఏకమై అవకాశం కోసం కాసుకుని కూర్చున్నాయి.…
యుద్ధ భూమి నుంచి సాధారణ పౌరుల తరలింపునకు ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేసేందుకు రష్యా, ఉక్రెయిన్ దేశాల ప్రతినిధులు అంగీకరించారు. రెండో విడత చర్చల్లో భాగంగా ఉక్రెయిన్, రష్యా ప్రతినిధులు మధ్య బెలారస్లో చర్చలు జరిగాయి. ఈ యుద్దంలో భారీ సంఖ్యలో సాధారణ పౌరులు మరణిస్తుండటం వల్ల ఈ నిర్ణయానికి ఇరుదేశాలు అంగీకరించాయి. పోలిష్-బెలారసియన్ సరిహద్దుల్లో బ్రెస్ట్ లో ఇరు దేశాల ప్రతినిధులు సమావేశం జరిగింది. అయితే ఈ చర్చలు ఆలస్యం అయ్యే కొద్దీ మా డిమాండ్ల…
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో.. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విద్యార్థుల తరలింపును వేగవంతం చేసింది భారత ప్రభుత్వం.. ఇప్పటికే ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానాలను కూడా రంగంలోకి దింపింది.. ఇక, మరోసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ.. భారత విద్యార్థులను రష్యా మీదుగా తరలించాలని, విద్యార్థుల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని.. భారతీయులు సురక్షితంగా బయటకొచ్చేందుకు అవకాశం కల్పించాలని కోరారు.. దీంతో, ఖార్కివ్ నుంచి భారతీయులు వెళ్లేందుకు 6 గంటల పాటు…
రష్యా సైనిక దాడితో ఉక్రెయిన్ అట్టుడికిపోతోంది. ఉక్రెయిన్లో ఇతర దేశాలకు చెందిన పౌరులతో పాటు, ఉక్రెయిన్ పౌరులు కూడా తమ ప్రాణాలను గుప్పింట్లో పెట్టకొని గడుపుతున్నారు. అయితే నాటో దేశాలు దూకుడు ప్రదర్శిస్తుండడం, స్విఫ్ట్ నుంచి రష్యాను తొలగించడం, కఠినమవుతున్న ఆర్థికాంక్షలు, తమ విమానాలకు గగనతల నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అంశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నాటో దేశాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న పుతిన్…
ఉక్రెయిన్ సంక్షోభంపై రాష్ట్రంలో అత్యవసరంగా ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని ఏపీ సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు. రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తదితర ఉన్నతాధికారులు ఈ కంట్రోల్ రూమ్ బాధ్యతలు వహిస్తారని ఆయన తెలిపారు. 1902 నెంబర్ ద్వారా తల్లిదండ్రులు వారి పిల్లలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్లో విద్యార్ధులు మినహా ఇతర ప్రవాసాంధ్రులకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రభుత్వం వద్ద లేదని ఆయన వెల్లడించారు. ఆ వివరాలను…
ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులను యావత్తు ప్రపంచ దేశాలు చూస్తూనే ఉన్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్పై వార్ డిక్లర్ చేయకనే చేశారు. అయితే దీనిపై ప్రపంచ దేశాలు జోక్యం చేసుకోరాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎవరైనా ఉక్రెయిన్ వ్యవహారంలో తలదూర్చితే ఎక్కడివరకైనా పోయేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పుతిన్ సంకేతాలు పంపారు. అయితే ఎప్పటినుంచో అగ్రరాజ్యం అమెరికా, రష్యాలకు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో అమెరికా ఎలాంటి…
ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధమేఘాలు అలుముకున్నాయి. ఇప్పటికే బాంబులతో ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడుతోంది. రష్యాకు ఫైటర్ జెట్లు ఉక్రెయిన్ భూతలంలోకి ప్రవేశించిన బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఉక్రెయిన్ పై సైనిక చర్య పేరుతో రష్యా యుద్ధానికి దిగడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి అగ్రరాజ్యాల దేశాధినేతలు చెప్పినా పుతిన్ ఏమాత్రం ఖాతరు చేయడంలేదు. ఈ నేపథ్యంలో భారత్ లో ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం…