ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతోంది ఉపరితల ఆవర్తనం.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.. ఇక, అల్పపీడనం ప్రభావంతో ఇవాళ విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. ఆరెంజ్ బులెటిన్ హెచ్చరికలు జారీ చేసింది విశాఖపట్నం వాతావరణ కేంద్రం..
అనారోగ్య ప్రదేశ్ ను ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ దిశగా తీసుకు వెళ్తున్నాం అన్నారు.. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ని మరింత విస్తృతం చేస్తున్నాం అన్నారు.. క్యాన్సర్ మహమ్మారిగా తయారైంది.. ఐసీఎంఆర్ లెక్కలు ప్రకారం దేశంలో 8.74 లక్షలు మంది, మన రాష్ట్రంలో 42 వేల మంది క్యాన్సర్ తో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు సత్యకుమార్..
విశాఖ వేదికగా 'సేనతో సేనాని' కార్యక్రమం నిర్వహిస్తున్నారు.. రెండురోజుల పాటు సాగిన ఈ సమావేశాలు.. ఇవాళ బహరంగసభతో ముగియనున్నాయి.. సేనతో సేనాని సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి క్రియాశీలక కార్యకర్తలు హాజరుకానున్నారు.. మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో సభ ప్రారంభం కానుండగా.. సాయంత్రం 6 గంటలకు పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు..
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంలో కీలక వ్యక్తులంతా విశాఖపట్నంలోనే పర్యటిస్తున్నారు.. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విశాఖలో ఉన్నారు.. రెండో రోజు సేనతో సేనాని కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసిన ముఖ్య కార్యకర్తలతో ఇవాళ ఉదయం 10 గంటలకు పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు.. ఇక, మధ్యాహ్నం పార్టీ అనుబంధ విభాగాలతో సమావేశంకానున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ నగరానికి అరుదైన ఘనత దక్కింది. దేశంలోనే మహిళలకు రక్షణ కల్పించడంలో ముంబై, భువనేశ్వర్ నగరాలతో పాటు విశాఖ మొదటి స్థానంలో నిలిచింది. కోహిమా, ఆయిజోల్, గాంగ్టోక్, ఇటానగర్ కూడా టాప్లో నిలిచాయి. ఢిల్లీ, పట్నా, రాంచీ, జైపుర్, ఫరీదాబాద్, కోల్కతా, శ్రీనగర్లు జాబితాలో దిగువన ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 31 నగరాల్లో 12,770 మంది మహిళలపై నిర్వహించిన ఓ సర్వే ఆధారంగా ఈ జాబితా వెల్లడైంది. NARI 2025 నిర్వహించిన సర్వేలో స్మార్ట్…
మూడు రోజుల జనసేన పండుగకు విశాఖ నగరం సిద్ధమైంది. ప్రభుత్వంలో భాగస్వామ్యం తర్వాత పార్టీలో పరిస్థితులను సమీక్షించుకునేందుకు జరుగుతున్న సమావేశాలు కావడంతో శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్. ఇవాళ, రేపు పార్టీ అంతర్గత అంశాలపై చర్చ జరుగుతుంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. నేడు విశాఖపట్నం వెళ్లనున్నారు.. గత ఎన్నికల్లో కూటమి విజయంలో కీలక భూమిక పోషించింది జనసేన.. ఆ తర్వాత కీలకమైన డిప్యూటీ సీఎం పదవి కూడా జనసేనాని వరించింది.. ఓ వైపు కూటమి సర్కార్లో కీలక శాఖలు నిర్వహిస్తూనే.. మరోవైపు పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు పవన్ కల్యాణ్.. దీనికోసం విశాఖ వేదికగా మూడు రోజుల పాటు జనసేన విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించబోతున్నారు..
Vizag: విశాఖ ద్వారాక ఆర్టీసీ కాంప్లెక్స్లో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పలాస డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బ్రేకులు పనిచేయకపోవడంతో ప్లాట్ఫారమ్పైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రయాణికులను బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే, ప్రమాదానికి బ్రేక్ ఫెయిల్యూరే కారణమా లేక డ్రైవర్ నిర్లక్ష్యమా అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Minister Anitha: బాబాయ్ను చంపిన వారికి ఓటు…